జానీ మాస్ట‌ర్ స‌స్పెండ్… వైసీపీకి జ‌న‌సేన‌కు ఇదీ తేడా!

రాజ‌కీయాల్లో మార్పుల‌కు శ్రీ‌కారం చుడుతాం అంటూ ప్ర‌క‌టించే డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ళ్యాణ్… త‌ను చెప్పిన మాట‌ల‌ను ఆచ‌ర‌ణ‌లో పెట్టే ప్ర‌య‌త్నంలో విజ‌య‌వంతంగా కొన‌సాగుతున్నారు. ముఖ్యంగా మ‌హిళ‌ల‌పై వేధింపుల విష‌యంలో పార్టీ పంపిన స్ట్రాంగ్ సిగ్న‌ల్స్ ఎంతో ప్ర‌భావం చూప‌నున్నాయి.

కొంత‌కాలంగా వైసీపీ నేత‌ల‌తో పాటు ఆనాడు కీల‌కంగా ఉన్న అధికారుల‌పై సైతం ఎన్నో ఆరోప‌ణ‌లు. జ‌త్వానీ కేసు ఒక్క‌టే కాదు బ‌య‌ట‌కు రాకుండా మ‌హిళ‌ల‌పై జ‌రిగిన కీచ‌క‌ప‌ర్వాలు ఎన్నో. స్వ‌యంగా త‌మ పార్టీ నేత‌లపై ఆధారాల‌తో స‌హా బ‌య‌ట‌కు వ‌స్తున్నా వైసీసీ రెస్పాండ్ కాదు. జ‌గ‌న్ నోరు తెర‌వరు.

కానీ, త‌న‌తో…జ‌న‌సేన‌తో చాలా కాలంగా కొన‌సాగుతున్న జానీ మాస్ట‌ర్ పై వేధింపుల కేసు న‌మోదైంది. త‌న టీంలో ఉన్న ఓ మ‌హిళా కొరియోగ్రాఫ‌ర్… జానీ మాస్ట‌ర్ పై కేసు పెట్టింది. కేసు న‌మోదు కావ‌టం, ఎఫ్.ఐ.ఆర్ కూడా బుక్ అయినా జానీ మాస్ట‌ర్ స్పందించ‌క‌పోవ‌టంతో జ‌న‌సేన సీరియ‌స్ గా తీసుకుంది. జ‌న‌సేన కార్య‌క్ర‌మాల నుండి త‌న‌ను దూరంగా ఉంచుతున్న‌ట్లు ప్ర‌క‌ట‌న విడుద‌ల చేసింది. ప‌వ‌న్ క‌ళ్యాణ్ సూచ‌న‌తో పార్టీ అధికారికంగా ప్ర‌క‌ట‌న కూడా విడుద‌ల చేసింది.

అంత‌కు ముందు స‌త్యవేడు ఎమ్మెల్యే ఆదిమూలం విష‌యంలోనూ టీడీపీ అంతే స్ట్రాంగ్ గా రియాక్ట్ అయ్యింది. సిట్టింగ్ ఎమ్మెల్యే అని కూడా చూడ‌కుండా… ఆరోప‌ణ‌లు వ‌చ్చిన వెంట‌నే పార్టీ నుండి స‌స్పెండ్ చేసి, మ‌హిళ‌ల ప‌ట్ల టీడీపీకి వైఖ‌రేంటో చెప్ప‌క‌నే చెప్పింది. తాజాగా కూట‌మిలోని జ‌న‌సేన కూడా అంతే స్థాయిలో రియాక్ట్ అయ్యింది.

దీంతో… వైసీపీకి, కూట‌మికి ఉన్న తేడా ఇది… పరిపాల‌నే కాదు పార్టీ నేత‌ల విష‌యంలోనూ తామేంటో చూడండి. వైసీపీకి ఇలా చ‌ర్య‌లు తీసుకోవ‌టం సాధ్య‌మవుతుందా అంటూ కూట‌మి క్యాడ‌ర్ జోష్ లో విమ‌ర్శ‌లు చేస్తోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

శ్రీవారి లడ్డూలో జంతువుల కొవ్వు – జగన్ హయాంలో అపచారం!

తిరుమలలో ఎన్ని అరాచకాలు చేయాలో అన్నీ చేశారని తేలిపోయింది. చివరికి తిరుపతి లడ్డూ ప్రసాదాన్ని కూడా అపవిత్రం చేశారు. వైసీపీ హయాంలో తిరుపతి లడ్డూ క్వాలిటీ అత్యంత ఘోరంగా ఉండేది. దానికి కారణం...

తమిళనాడు డిప్యూటీ సీఎంగా ఉదయనిధి

తమిళ రాజకీయాలు మారిపోతున్నాయి. ఓ వైపు పొలిటికల్ వాక్యూమ్ ను ఉపయోగించుకుని రాజకీయ నాయకుడు అయిపోవడానికి విజయ్ కొత్త పార్టీ పెట్టారు. మరో వైపు అన్నాడీఎంకే కూడా బలమైన క్యాడర్ తో ఉంది....

వైసీపీ ఆఫీసులకూ అదే పరిస్థితి – లా ఒక్కటే !

నల్లగొండ బీఆర్ఎస్ ఆఫీసును కూల్చేయాలని హైకోర్టు ఇచ్చిన ఆదేశాలతో .. వైసీపీకి కూడా గుండెల్లో రాయి పడింది. బీఆర్ఎస్ పార్టీకి అదొక్కదానికే అనుమతుల్లేవేమో కానీ వైసీపీకి చెందిన ఒక్క ఆఫీసుకు తప్ప...

దేవరని రామాయణంతో ముడిపెట్టిన పరుచూరి

రచయిత పరుచూరి గోపాలకృష్ణ 'పరుచూరి పలుకులు' పేరుతో సినిమాల‌ను విశ్లేషిస్తుంటారు. ఆయన విశ్లేషణలు చాలా ప్రజాదరణ పొందాయి. తన అనుభవాలన్నీ జోడిస్తూ సినిమాల్లోని లోటుపాట్లని, మంచి విషయాల్ని చెపుతుంటారు. తాజాగా ఎన్టీఆర్ దేవర...

HOT NEWS

css.php
[X] Close
[X] Close