అరెస్ట్ భయంతో వణికిపోతున్న జోగి రమేష్

చంద్రబాబు ఇంటిపై దాడి చేశారు. తాము పెద్ద రౌడీ పుడింగినని జగన్ దగ్గర సర్టిఫికెట్ కొట్టేసి.. కొడాలి నాని, పేర్ని నాని వంటి వాళ్లను కూడా పక్కకు నెట్టేసి మంత్రి పదవి పొందారు. ఇప్పుడు ఆ మంత్రి పదవి లేదు.. కనీసం ఎమ్మెల్యే పోస్టు కూడా లేదు. కానీ చంద్రబాబు ఇంటిపై దాడి చేసిన కేసు మాత్రం అలాగే ఉంది. అప్పట్లో జగన్ రెడ్డి ప్రభుత్వం కేసు పెట్టకపోయినా వీడియో రికార్డింగ్స్ అన్నీ సాక్ష్యాలుగా ఉన్నాయి కాబట్టి ఇప్పుడు పోలీసులు కేసు పెట్టేశారు.

కేసు పెట్టేశారని .. అర్థరాత్రి పూట గోడలు దూకి .. తలుపులు బద్దలు కొట్టి అరెస్ట్ చేస్తారన్న అనుమానంతో జోగి రమేష్ వెంటనే హైకోర్టులో పిటిషన్ వేశారు. తనపై కేసు నమోదయిందని అరెస్టు చేసే అవకాశం ఉందని ముందస్తు బెయిల్ ఇవ్వాలని హైకోర్టులో పిటిషన్ వేశారు. ఎనిమిదో తేదీన జోగి రమేష్ ముందస్తు బెయిల్ పిటిషన్ విచారణకు వచ్చే అవకాశం ఉంది. తమ ప్రభుత్వం ఉందని ప్రతిపక్ష నేత ఇంటిపైనే దాడి చేసి అదే అర్హతగా మంత్రి పదవి పొందిన ఆయన ఇప్పుడు అదే ఘటన కారణంగా జైలుకు దగ్గరగా ఉన్నారు.

టీడీపీ ప్రభుత్వం ఆయనను జైలుకు పంపాలంటే.. ఇదొక్కటే కాదు.. అగ్రిగోల్డ్ భూముల్ని కబ్జా చేసిన కేసు కూడా రెడీగా ఉంది. ఇంకా ఆయన మంత్రిత్వ శాఖలో చేసిన నిర్వాకాల దగ్గర నుంచి చాలా కేసులు పెట్టుకోవచ్చు. అయితే చంద్రబాబు ఇంటిపై దాడి కేసు ఇప్పుడు లైవ్ లో ఉంది కాబట్టి.. ఆ కేసులో అరెస్టు నుంచి తప్పించుకునేందుకు జోగిరమేష్ న్యాయస్థానం వద్దకు పరుగులు పెడుతున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కడపకు ఉపఎన్నికలు వస్తే ప్రచారం చేస్తా : రేవంత్ రెడ్డి

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి షర్మిల కోసం నేరుగా రంగంలోకి దిగుతానని ప్రకటించారు. మంగళగిరిలోని సీకే కన్వెన్షన్ హాల్లో నిర్వహించిన వైఎస్ జయంతి సభలో రేవంత్ రెడ్డి ప్రసంగించారు. కడపకు ఉప...

బీజేపీతో అంటకాగేవాళ్లు వైఎస్ వారసులా ? : షర్మిల

వైఎస్ రాజశేఖర్ రెడ్డి 75వ జయంతి కార్యక్రమంలో ఆయనకు తానే రాజకీయ వారసురాలినని షర్మిల నేరుగా సందేశం ఇచ్చారు. ఇవ్వాళ YSR వారసుడు అని చెప్పుకొనే వాళ్ళు BJP...

డ్ర‌గ్స్‌పై పోరుకు టాలీవుడ్ సిద్ధం

డ్ర‌గ్స్ మహ‌మ్మారిని త‌రిమికొట్టేలా తెలంగాణ రాష్ట్ర ప్ర‌భుత్వం ప్ర‌త్యేక చ‌ర్య‌లు తీసుకొంటోంది. డ్ర‌గ్స్‌పై ప్ర‌జ‌ల్లో అవ‌గాహ‌న క‌ల్పించ‌డానికి కొత్త మార్గాల్ని అన్వేషిస్తోంది. ఈ ఉద్య‌మంలో చిత్ర‌సీమ కూడా పాలుపంచుకోవాల‌ని ఇటీవ‌ల తెలంగాణ సీఎం...

అడుసు తొక్కనేలా.. కోర్టుల చుట్టూ తిరగనేలా?

వైసీపీ నేతలు ఒక్కొక్కరుగా హైకోర్టు వైపు పరుగులు పెడుతున్నారు. ఒకరు ముందస్తు బెయిల్ కావాలని.. మరొకరు అరెస్ట్ చేయకుండా ఆదేశాలు ఇవ్వాలని.. ఇంకొందరూ అదే లైన్ లో ఉన్నారు. వరుసగా వైసీపీ నేతలు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close