మరో పోర్టు చేతులు మారే..! గంగవరం అదానీ పరం..!

ఆంధ్రప్రదేశ్‌లోని మరో పోర్టు చేతులు మారింది. కాకినాడ పోర్టులు.. అరబిందో రియాల్టీ చేతికి వెళ్లగా… విశాఖలోని గంగవరం పోర్టు అదానీ గ్రూప్ చేతుల్లోకి వెళ్లింది. ఈ మేరకు 89.6 శాతం వాటాను కొనులోగు చేసినట్లుగా గౌతం అదానీ స్వయంగా ట్వీట్ చేశారు. ఇప్పటి వరకూ గంగవరం పోర్టులో వీఎస్ రాజు, ఆయన కుటుంబానికి చెందిన 58.1 శాతం వాటా ఉంది. ఈ మొత్తాన్ని.. ప్రైవేటు పోర్టులు, లాజిస్టిక్స్ నిర్వహిస్తున్న సంస్ధ అదానీ గ్రూప్‌ రూ. 3604 కోట్లు వెచ్చించి కొనుగోలు చేసింది.

అంతకు ముందే… గంగవరం పోర్టులో 31.5 శాతం వాటా ఉన్న వార్‌బర్గ్ పిన్‌కస్ నుంచి ఆ మొత్తాన్ని ఆదానీ గ్రూప్ కొనుగోలు చేసింది.అంటే దాదాపు 90 శాతం వాటాను గంగవరం పోర్టులో అదానీ గ్రూప్ కొనుగోలు చేసిందన్నమాట. మిగిలిన పది శాతం ఏపీ ప్రభుత్వ వాటా ఉంటుంది.

ఏపీలోని రెండో అతిపెద్ద నాన్‌ మేజర్‌ పోర్టు అయిన గంగవరం పోర్టు వైజాగ్‌ పోర్టుకు అతి సమీపంలోనే ఉంది. దీని సామర్ధ్యం 64 ఎంఎంటీ. ఏపీ ప్రభుత్వ ఆధ్వర్యంలో నిర్మించిన ఈ పోర్టుపై 2059 వరకూ వాటా దారులకు ఆధిపత్యం ఉంటుంది. ఇది అన్నిరకాల వాతావరణం, లోతైన నీరు వంచి అంశాలతో బహుళార్ధ సాధక ఓడరేవుగా గంగవరం పోర్టుకు పేరుంది. 1,800 ఎకరాల భూమి కూడా పోర్టు సొంతం.

విశాఖపట్నంలోని గంగవరం పోర్టును అదానీ దక్కించుకోవడం మంచిదేనని.. ఏపీ మంత్రి గౌతంరెడ్డి స్పష్టం చేశారు. ఇటీవల గంగవరం పోర్టులోని మెజారిటీ వాటాను పారిశ్రామిక దిగ్గజం గౌతం అదానీ నేతృత్వంలోని అదానీ పోర్ట్స్‌ తాజాగా కొనుగోలు చేసింది. పోర్టులో ప్రభుత్వ వాటా మాత్రం కొనసాగుతుందని ఆయన చెబుతున్నారు. ఏపీలో కొత్త ప్రభుత్వం మారిన తర్వాత ఏపీలో పోర్టులు… పెద్ద ఎత్తున చేతులు మారుతున్నాయి. ఇప్పటికే కృష్ణపట్నం కూడా అదానీ చేతుల్లోకి వెళ్లింది. అరబిందో చేతికి మరిన్ని పోర్టులు వెళ్లాయి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

డి-ఏజింగ్… లాభమా? నష్టమా ?

సినిమాలో ఒక క్యారెక్టర్ బాల్యం, యవ్వనం, కౌమార, ప్రౌడ దశలని చూపించడం ఫిల్మ్ మేకర్స్ కి పెద్ద సవాల్. ఇందుకోసం హలీవుడ్ నుంచి కూడా మేకప్ మ్యాన్ లని దిగుమతి చేసుకునే వారు....

దువ్వాడ శ్రీనివాస్ ఇంట్లో దివ్వెల మాధురీ !

దువ్వాడ ఫ్యామిలీ డ్రామాలో కొత్త కొత్త ఎపిసోడ్లు ప్రారంభమవుతున్నాయి. కొద్ది రోజుల పాటు సైలెంట్ గా ఉంటానని చెప్పిన దివ్వెల మాధురీ.. ఒక్క సారిగా.. ఏకంగా దువ్వాడ శ్రీనివాస్ ఇంట్లోనే ప్రత్యక్షమయ్యారు. దువ్వాడ...

ఆ పడవలు నందిగం సురేష్ తాలూకానే !

ప్రకాశం బ్యారేజీకి వరద వస్తే ఈ మధ్య బోట్లు కొట్టుకు వస్తున్నాయి. బ్యారేజని డ్యామేజ్ చేస్తున్నాయి. అవి ఎలా వస్తున్నాయో తెలియడం లేదు. ఇప్పుడు మిస్టరీ బయటపడే అవకాశాలు కనిపిస్తున్నాయి. వైసీపీ రంగులేసిన...

శభాష్ నిమ్మల… అభినందించిన నారా లోకేష్

భారీ వర్షానికి తోడు బుడమేరకు పడిన గండ్లు విజయవాడను ముంచేత్తాయి. కనీవినీ ఎరుగని స్థాయిలో వరద పోటెత్తడంతో విజయవాడ గత ఆరు రోజులుగా వరదలో నానుతోంది. బుడమేరుకు పడిన గండ్లు పూడ్చితేనే విజయవాడకు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close