నమ్మించి గొంతు కోశాడు – జగన్‌పై కాపు రామచంద్రారెడ్డి నిప్పులు

జగన్ రెడ్డి టిక్కెట్ల కసరత్తు ట్రాక్ తప్పుతున్న సూచనలు కనిపిస్తున్నాయి. ఆయన ట్రీట్ చేస్తున్న విధానంతో ఎక్కువ మంది ఎమ్మెల్యేలు తిరుగుబాటుకు సిద్ధమవుతున్నారు. తాజాగా రాయదుర్గం నియోజకవర్గానికి ఇంకా టిక్కెట్ ఖరారు చేయకపోయినప్పటికీ సిట్టింగ్ ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డికి తన పరిస్థితిపై క్లారిటీ వచ్చింది. ఆయన ఒక్క సారిగా బ్లాస్ట్ అయ్యారు.

జగన్ రెడ్డి నమ్మించి గొంతు కోశారని ఇంత కంటే అవమానం ఇంకెప్పుడూ జరగలేదని ఆయన మండిపడ్డారు. జగన్ రెడ్డిని కలిసేందుకు కూడా అవకాశం ఇవ్వలేదని.. తాను పోటీ చేసి తీరుతానని ఆయన ప్రకటించారు. తాను రాయదుర్గం నుంచి.. తన బార్య కల్యాణదుర్గం నుంచి పోటీ చేస్తుందని ఆయన ప్రకటించారు. ఏదైనా పార్టీలో టిక్కెట్ ఇస్తే ఆ పార్టీల నుంచి పోటీ చేస్తానని చెబుతున్నారు.

కాపు రామచంద్రారెడ్డి.. గాలి జనార్ధన్ రెడ్డి వ్యాపార భాగస్వామి. అప్పట్లో హవా నడిచినప్పుడు.. కాపు రామచంద్రారెడ్డి.. గాలి జనార్దన్ రెడ్డి అంత పవర్ చూపించేవారు. కానీ ఇటీవల గాలితో పాటు శ్రీరాములుతోనూ ఆయనకు వివాదాలు వచ్చినట్లుగా తెలుస్తోంది. కాపు రామచంద్రారెడ్డి అల్లుడు ఓ ప్రభుత్వ పని కాంట్రాక్టులు చేస్దూ..బిల్లులు రాలేదని విజయవాడలోనే ఆత్మహత్య చేసుకున్నారు. ఈ విషయంలో ఆయన సైలెంట్ గానే ఉన్నారు. ఇప్పుడు ఆయనకు టిక్కెట్ రాదని తెలియడంతో.. ఫైర్ అవుతున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

డి-ఏజింగ్… లాభమా? నష్టమా ?

సినిమాలో ఒక క్యారెక్టర్ బాల్యం, యవ్వనం, కౌమార, ప్రౌడ దశలని చూపించడం ఫిల్మ్ మేకర్స్ కి పెద్ద సవాల్. ఇందుకోసం హలీవుడ్ నుంచి కూడా మేకప్ మ్యాన్ లని దిగుమతి చేసుకునే వారు....

దువ్వాడ శ్రీనివాస్ ఇంట్లో దివ్వెల మాధురీ !

దువ్వాడ ఫ్యామిలీ డ్రామాలో కొత్త కొత్త ఎపిసోడ్లు ప్రారంభమవుతున్నాయి. కొద్ది రోజుల పాటు సైలెంట్ గా ఉంటానని చెప్పిన దివ్వెల మాధురీ.. ఒక్క సారిగా.. ఏకంగా దువ్వాడ శ్రీనివాస్ ఇంట్లోనే ప్రత్యక్షమయ్యారు. దువ్వాడ...

ఆ పడవలు నందిగం సురేష్ తాలూకానే !

ప్రకాశం బ్యారేజీకి వరద వస్తే ఈ మధ్య బోట్లు కొట్టుకు వస్తున్నాయి. బ్యారేజని డ్యామేజ్ చేస్తున్నాయి. అవి ఎలా వస్తున్నాయో తెలియడం లేదు. ఇప్పుడు మిస్టరీ బయటపడే అవకాశాలు కనిపిస్తున్నాయి. వైసీపీ రంగులేసిన...

శభాష్ నిమ్మల… అభినందించిన నారా లోకేష్

భారీ వర్షానికి తోడు బుడమేరకు పడిన గండ్లు విజయవాడను ముంచేత్తాయి. కనీవినీ ఎరుగని స్థాయిలో వరద పోటెత్తడంతో విజయవాడ గత ఆరు రోజులుగా వరదలో నానుతోంది. బుడమేరుకు పడిన గండ్లు పూడ్చితేనే విజయవాడకు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close