ఫోన్ ట్యాపింగ్ పై కేసీఆర్ రివర్స్ గేర్..!?

తెలంగాణ రాజకీయాలను కుదిపేస్తోన్న ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై మాజీ సీఎం కేసీఆర్ స్పందించారు. రెండు, మూడు రోజుల్లో ఈ విషయంపై క్లారిటీ ఇస్తానన్నారు. బీఆర్ఎస్ పెద్దల ఆదేశాల మేరకే ఫోన్ ట్యాపింగ్ కు పాల్పడినట్లుగా నిందితులు చెబుతుండటంతో అన్ని వేళ్ళు కేసీఆర్ వైపే చూపుతున్నాయి. తదుపరి ఆయనకు నోటీసులు ఇచ్చి విచారణకు పిలుస్తారనే ప్రచారం నేపథ్యంలో కేసీఆర్ అన్ని విషయాలను బయటపెడతానని చెప్పడం ఆసక్తికరంగా మారింది.

ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం కల్వకుంట్ల ఫ్యామిలీ మెడకు చుట్టుకునే అవకాశం ఉంది.ఈ నేపథ్యంలో ఈ వ్యవహారంపై కేసీఆర్ ఏం చెబుతున్నారని రాజకీయ వర్గాల్లో ఉత్కంఠ నెలకొంది. తెలంగాణలో బీఆర్ఎస్ అధికారంలోకి రాగానే ప్రభుత్వాన్ని కూల్చాలని కాంగ్రెస్ అప్పట్లో కుట్రలు చేసిందని గతంలోనే ఆయన ఆరోపించిన సంగతి తెలిసిందే. ఈ కారణంగానే ప్రభుత్వ కూల్చివేతలపై జాగ్రత్త వహించేందుకే ఫోన్ ట్యాపింగ్ చేశామని చెప్తారా..? అనేది సస్పెన్స్ గా మారింది. పైగా కేసీఆర్ రివర్స్ ఎటాక్ చేస్తారన్న వాదనలు కూడా వ్యక్తం అవుతున్నాయి.

ఫోన్ ట్యాపింగ్ పట్ల బీఆర్ఎస్ పెద్దలపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ఈ క్రమంలోనే కాంగ్రెస్ ను టార్గెట్ చేస్తూ రాజకీయం చేస్తారన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఫోన్ ట్యాపింగ్ పై 2001 నుంచి ( టీఆర్ఎస్ ఆవిర్భావం నుంచి) విచారణ చేపట్టాలని డిమాండ్ చేసే అవకాశం ఉన్నట్లుగా రాజకీయ పరిశీలకులు అంచనా వేస్తున్నారు. తద్వారా ఈ విషయంలో కాంగ్రెస్ ను కట్టడి చేయవచ్చుననేది కేసీఆర్ వ్యూహమంటున్నారు. కానీ, ఈ ఇష్యులో కేసీఆర్ ఎంత ఎదురుదాడి చేసినా… ఆయనకు వ్యతిరేకంగా నిందితుల స్టేట్ మెంట్లు ఉన్నాయి. కాబట్టి.. ఎం చేసినా ఆయన విచారణ ఎదుర్కోక తప్పదని అంటున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

డి-ఏజింగ్… లాభమా? నష్టమా ?

సినిమాలో ఒక క్యారెక్టర్ బాల్యం, యవ్వనం, కౌమార, ప్రౌడ దశలని చూపించడం ఫిల్మ్ మేకర్స్ కి పెద్ద సవాల్. ఇందుకోసం హలీవుడ్ నుంచి కూడా మేకప్ మ్యాన్ లని దిగుమతి చేసుకునే వారు....

దువ్వాడ శ్రీనివాస్ ఇంట్లో దివ్వెల మాధురీ !

దువ్వాడ ఫ్యామిలీ డ్రామాలో కొత్త కొత్త ఎపిసోడ్లు ప్రారంభమవుతున్నాయి. కొద్ది రోజుల పాటు సైలెంట్ గా ఉంటానని చెప్పిన దివ్వెల మాధురీ.. ఒక్క సారిగా.. ఏకంగా దువ్వాడ శ్రీనివాస్ ఇంట్లోనే ప్రత్యక్షమయ్యారు. దువ్వాడ...

ఆ పడవలు నందిగం సురేష్ తాలూకానే !

ప్రకాశం బ్యారేజీకి వరద వస్తే ఈ మధ్య బోట్లు కొట్టుకు వస్తున్నాయి. బ్యారేజని డ్యామేజ్ చేస్తున్నాయి. అవి ఎలా వస్తున్నాయో తెలియడం లేదు. ఇప్పుడు మిస్టరీ బయటపడే అవకాశాలు కనిపిస్తున్నాయి. వైసీపీ రంగులేసిన...

శభాష్ నిమ్మల… అభినందించిన నారా లోకేష్

భారీ వర్షానికి తోడు బుడమేరకు పడిన గండ్లు విజయవాడను ముంచేత్తాయి. కనీవినీ ఎరుగని స్థాయిలో వరద పోటెత్తడంతో విజయవాడ గత ఆరు రోజులుగా వరదలో నానుతోంది. బుడమేరుకు పడిన గండ్లు పూడ్చితేనే విజయవాడకు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close