నర్సాపురం వైసీపీ అభ్యర్థిగా కృష్ణంరాజు భార్య ?

కృష్ణంరాజు భార్య రాజకీయాల్లోకి వచ్చి నర్సాపురం నుంచి ఎంపీ అభ్యర్థిగా వైసీపీ తరపున పోటీ చేయాలని డిసైడయినట్లుగా కనిపిస్తోంది. కృష్ణంరాజు జయంతి పేరుతో మొగల్తూరులో భారీ వైద్య శిబిరం ఏర్పాటు చేస్తున్నారు. ఆ ఏర్పాట్లను ఆమె చూసుకుంటున్నారు. ఈ కార్యక్రమం ముగిసిన తర్వాత రాజకీయ ప్రకటన చేస్తానని ఆమె చెబుతున్నారు. కృష్ణంరాజు భార్య శ్యమలాదేవి కొద్ది రోజుల నుంచి రాజకీయాల్లోకి వస్తారన్న ప్రచారం జరుగుతోంది.

ఈ వ్యూహంతోనే ఈ సారి జంయతి కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నారని బావిస్తున్నారు. కృష్ణంరాజు చనిపోయిన తర్వాత రెండో జయంతి ఇది. గతం కంటే భిన్నంగా భారీగా చేయాలనుకోవడం వెనుక రాజకీయం ఉందని భావిస్తన్నారు. ఇదే అంశంపై శ్యామలాదేవి కూడా స్బందించారు. 20వ తేదీన జయంతి కార్యక్రమం పూర్తయిన తరువాత రాజకీయ అంశాలపై ప్రస్తావిస్తానని శ్యామల దేవి అన్నారు. నర్సాపురం లోక్‌సభ నియోజకవర్గంలో రఘురామ కృష్ణంరాజు 2019 నాటి ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా ఘన విజయం సాధించారు. అనంతరం రెబల్ గా మారారు. పొత్తుల్లో భాగంగా ఏ పార్టీకి సీటు వెళ్తే ఆ పార్టీ తరపు నుంచి పోటీ చేస్తానంటున్నారు. ఆయనను ఓడించాలంటే బలమైన అభ్యర్థి కావాలని వైసీపీ అధినాయకత్వం భావిస్తోంది. అందుకే కృష్ణంరాజు సతీమణిని సంప్రదించినట్లుగా చెబుతున్నారు.

కృష్ణంరాజు ఇదే నియోజవకర్గం నుంచి 1999 ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి, లక్షా 65 వేలకు పైగా ఓట్ల తేడాతో తిరుగులేని విజయం సాధించారు. అనంతరం అప్పటి ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజ్‌పేయి కేబినెట్‌లో రక్షణశాఖ సహాయ మంత్రిగా పని చేశారు. 2004లో కూడా పోటీ చేశారు గానీ విజయం దక్కలేదు. శ్యామలాదేవి రాజకీయ ఆలోచనలకు కుటుంబం మద్దతు ఉందా లేదా అన్నదానిపై స్పష్టత రావాల్సి ఉంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

డి-ఏజింగ్… లాభమా? నష్టమా ?

సినిమాలో ఒక క్యారెక్టర్ బాల్యం, యవ్వనం, కౌమార, ప్రౌడ దశలని చూపించడం ఫిల్మ్ మేకర్స్ కి పెద్ద సవాల్. ఇందుకోసం హలీవుడ్ నుంచి కూడా మేకప్ మ్యాన్ లని దిగుమతి చేసుకునే వారు....

దువ్వాడ శ్రీనివాస్ ఇంట్లో దివ్వెల మాధురీ !

దువ్వాడ ఫ్యామిలీ డ్రామాలో కొత్త కొత్త ఎపిసోడ్లు ప్రారంభమవుతున్నాయి. కొద్ది రోజుల పాటు సైలెంట్ గా ఉంటానని చెప్పిన దివ్వెల మాధురీ.. ఒక్క సారిగా.. ఏకంగా దువ్వాడ శ్రీనివాస్ ఇంట్లోనే ప్రత్యక్షమయ్యారు. దువ్వాడ...

ఆ పడవలు నందిగం సురేష్ తాలూకానే !

ప్రకాశం బ్యారేజీకి వరద వస్తే ఈ మధ్య బోట్లు కొట్టుకు వస్తున్నాయి. బ్యారేజని డ్యామేజ్ చేస్తున్నాయి. అవి ఎలా వస్తున్నాయో తెలియడం లేదు. ఇప్పుడు మిస్టరీ బయటపడే అవకాశాలు కనిపిస్తున్నాయి. వైసీపీ రంగులేసిన...

శభాష్ నిమ్మల… అభినందించిన నారా లోకేష్

భారీ వర్షానికి తోడు బుడమేరకు పడిన గండ్లు విజయవాడను ముంచేత్తాయి. కనీవినీ ఎరుగని స్థాయిలో వరద పోటెత్తడంతో విజయవాడ గత ఆరు రోజులుగా వరదలో నానుతోంది. బుడమేరుకు పడిన గండ్లు పూడ్చితేనే విజయవాడకు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close