కేటీఆర్ ఎన్నిక‌ల జోస్యం… ఈసారి ఏమౌతుందో!

కేటీఆర్, కేసీఆర్ లు అధికారంలో లేన‌ప్పుడు చెప్పిన రాజ‌కీయ జోస్యాలన్నీ త‌ప్పాయి. 2014 ఎన్నిక‌ల్లో ఏపీలో జ‌గ‌న్ గెలుస్తున్నారు అని కేసీఆర్ ప్ర‌క‌టించారు. కానీ చంద్ర‌బాబు విజ‌య‌కేతనం ఎగుర‌వేశారు. మొన్న‌టి ఎన్నిక‌ల్లో తాము ఓడిపోయి, ఎంపీ ఎన్నిక‌ల ప్ర‌చారం చేస్తూ… ఏపీలో రెండోసారి జ‌గ‌న్ గెలుస్తున్నారు అంటూ కేటీఆర్, కేసీఆర్ లు ప్ర‌క‌టించారు. అదీ కూడా త‌ప్పింది.

గ‌తంలో మాజీ ఎంపీ ల‌గ‌డ‌పాటి స‌ర్వే అంటే రాజ‌కీయ వ‌ర్గాల్లో ఖ‌చ్చిత‌త్వం ఉండేది. కానీ, కొన్ని రోజుల త‌ర్వాత అదీ కూడా బోల్తా కొట్టింది. దీంతో ఆయ‌న ఎగ్జిట్ పోల్స్ కు దూరంగా ఉంటూ వ‌స్తున్నారు. కానీ, కేసీఆర్-కేటీఆర్ లు మాత్రం అలా కామ్ గా ఉండ‌కుండా… త‌మ జ్యోతిష్యాన్ని చెప్పుకుంటూ వ‌స్తున్నారు.

తాజాగా అమెరికాలో ఎవ‌రు గెలువ‌బోతున్నారో మాజీ మంత్రి కేటీఆర్ ట్విట్ట‌ర్ ( ఎక్స్) ద్వారా వెల్ల‌డించారు. కొంత‌కాలంగా వ్య‌క్తిగ‌త ప‌ర్య‌ట‌న కోసం కేటీఆర్ అమెరికాలో ఉన్నారు. తండ్రి బాధ్య‌త‌లు పిలుస్తున్నాయి అంటూ కేటీఆర్ అమెరికా వెళ్లారు. అక్క‌డి నుండే తెలంగాణలో రాజ‌కీయాల‌పై సోష‌ల్ మీడియా ద్వారా కామెంట్ చేస్తున్నారు.

అమెరికాలో ఈ సారి క‌మ‌లా హ్యారిస్ గెల‌వ‌బోతున్నారు… అమెరికాకు తొలి మ‌హిళా అధ్య‌క్షురాలు వ‌చ్చేలా ఉన్నారు అంటూ పోస్ట్ చేశారు. భారతీయ మూలాలు ఉన్న క‌మ‌లా హ్యారిస్ అంటే ఎక్కువ మంది ఆస‌క్తిగానే ఉన్నారు. అదే స‌మ‌యంలో రిప‌బ్లిక‌న్స్ అయితేనే బెస్ట్… ట్రంప్ వ‌స్తే ఇండియన్స్ కు కొంత సేఫ్ అనే వారు కూడా లేక‌పోలేదు. ఇలాంటి స‌మ‌యంలో కేటీఆర్ రాజ‌కీయ జోస్యం మ‌రోసారి బోల్తా కొడుతుందా…? ఈసారైనా ట్రాక్ రికార్డ్ మార్చి చెప్పిన‌ట్లే హ్యారిస్ గెలుస్తారా చూడాలి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

శ్రీవారి లడ్డూలో జంతువుల కొవ్వు – జగన్ హయాంలో అపచారం!

తిరుమలలో ఎన్ని అరాచకాలు చేయాలో అన్నీ చేశారని తేలిపోయింది. చివరికి తిరుపతి లడ్డూ ప్రసాదాన్ని కూడా అపవిత్రం చేశారు. వైసీపీ హయాంలో తిరుపతి లడ్డూ క్వాలిటీ అత్యంత ఘోరంగా ఉండేది. దానికి కారణం...

తమిళనాడు డిప్యూటీ సీఎంగా ఉదయనిధి

తమిళ రాజకీయాలు మారిపోతున్నాయి. ఓ వైపు పొలిటికల్ వాక్యూమ్ ను ఉపయోగించుకుని రాజకీయ నాయకుడు అయిపోవడానికి విజయ్ కొత్త పార్టీ పెట్టారు. మరో వైపు అన్నాడీఎంకే కూడా బలమైన క్యాడర్ తో ఉంది....

వైసీపీ ఆఫీసులకూ అదే పరిస్థితి – లా ఒక్కటే !

నల్లగొండ బీఆర్ఎస్ ఆఫీసును కూల్చేయాలని హైకోర్టు ఇచ్చిన ఆదేశాలతో .. వైసీపీకి కూడా గుండెల్లో రాయి పడింది. బీఆర్ఎస్ పార్టీకి అదొక్కదానికే అనుమతుల్లేవేమో కానీ వైసీపీకి చెందిన ఒక్క ఆఫీసుకు తప్ప...

దేవరని రామాయణంతో ముడిపెట్టిన పరుచూరి

రచయిత పరుచూరి గోపాలకృష్ణ 'పరుచూరి పలుకులు' పేరుతో సినిమాల‌ను విశ్లేషిస్తుంటారు. ఆయన విశ్లేషణలు చాలా ప్రజాదరణ పొందాయి. తన అనుభవాలన్నీ జోడిస్తూ సినిమాల్లోని లోటుపాట్లని, మంచి విషయాల్ని చెపుతుంటారు. తాజాగా ఎన్టీఆర్ దేవర...

HOT NEWS

css.php
[X] Close
[X] Close