ప్రారంభమైన పోలింగ్…బరిలో ప్రముఖులు వీరే..!

లోక్ సభ ఎన్నికల్లో భాగంగా కాసేపటి క్రితం నాలుగో విడత పోలింగ్ ప్రారంభమైంది. 10 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లోని 96 పార్లమెంట్ సెగ్మెంట్లలో సోమవారం పోలింగ్ జరుగుతోంది.

తెలంగాణలోని మొత్తం 17, ఏపీలోని 25 స్థానాలకు ఒకే విడతలో ఎన్నికలు జరుగుతున్నాయి. యూపీలో 13, బీహార్‌-5, జార్ఖండ్‌ 4, మధ్యప్రదేశ్‌-8, మహారాష్ట్ర-11, ఒడిశా-4, పశ్చిమబెంగాల్‌-8, జమ్ముకశ్మీర్‌లో ఒక్క స్థానం చొప్పున సోమవారం పోలింగ్‌ కొనసాగుతోంది. ఇందుకోసం ఎన్నికల సంఘం అన్ని ఏర్పాట్లు చేసింది. అలాగే, ఏపీలోని 175, ఒడిశాలోని 147 అసెంబ్లీ స్థానాలకు ఓటింగ్ జరుగుతోంది.ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ జరగనుంది. కాగా, తెలంగాణలో మాత్రం ఎండల వేడిమి నేపథ్యంలో ఓటింగ్ శాతం పెంచేందుకు పోలింగ్ సమయాన్ని సాయంత్రం ఆరు గంటల వరకు పొడిగించినట్లు స్పష్టం చేసింది ఎన్నికల సంఘం.

నాలుగో విడతలో ఐదుగురు కేంద్రమంత్రులతోపాటు పలువురు ప్రముఖులు తమ అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నారు. సికింద్రాబాద్ నుంచి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఉండగా, యూపీ నుంచి అజయ్ మిశ్రా, ఉజియాపూర్ నుంచి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిత్యానంద్ రాయ్, జార్ఖండ్ లోని ఖుంటి నుంచి అర్జున్ ముండా, యూపీ నుంచి అఖిలేష్ యాదవ్, కాంగ్రెస్ నేత అదిర్ రంజన్ చౌదరిలు పోటీ చేస్తున్నారు. తెలుగు రాష్ట్రాల నుంచి లోక్ సభకు వైఎస్ షర్మిల కడప నుంచి, ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ హైదరాబాద్ నియోజకవర్గాల నుంచి పోటీ చేస్తున్నారు.

నాలుగో దశలో పోటీ చేస్తోన్న 476 అభ్యర్తులేనని అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ స్పష్టం చేసింది. 24మంది అభ్యర్థులు మాత్రం తమకు అస్తులేమి లేవని తన నివేదికలో వెల్లడించింది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

డి-ఏజింగ్… లాభమా? నష్టమా ?

సినిమాలో ఒక క్యారెక్టర్ బాల్యం, యవ్వనం, కౌమార, ప్రౌడ దశలని చూపించడం ఫిల్మ్ మేకర్స్ కి పెద్ద సవాల్. ఇందుకోసం హలీవుడ్ నుంచి కూడా మేకప్ మ్యాన్ లని దిగుమతి చేసుకునే వారు....

దువ్వాడ శ్రీనివాస్ ఇంట్లో దివ్వెల మాధురీ !

దువ్వాడ ఫ్యామిలీ డ్రామాలో కొత్త కొత్త ఎపిసోడ్లు ప్రారంభమవుతున్నాయి. కొద్ది రోజుల పాటు సైలెంట్ గా ఉంటానని చెప్పిన దివ్వెల మాధురీ.. ఒక్క సారిగా.. ఏకంగా దువ్వాడ శ్రీనివాస్ ఇంట్లోనే ప్రత్యక్షమయ్యారు. దువ్వాడ...

ఆ పడవలు నందిగం సురేష్ తాలూకానే !

ప్రకాశం బ్యారేజీకి వరద వస్తే ఈ మధ్య బోట్లు కొట్టుకు వస్తున్నాయి. బ్యారేజని డ్యామేజ్ చేస్తున్నాయి. అవి ఎలా వస్తున్నాయో తెలియడం లేదు. ఇప్పుడు మిస్టరీ బయటపడే అవకాశాలు కనిపిస్తున్నాయి. వైసీపీ రంగులేసిన...

శభాష్ నిమ్మల… అభినందించిన నారా లోకేష్

భారీ వర్షానికి తోడు బుడమేరకు పడిన గండ్లు విజయవాడను ముంచేత్తాయి. కనీవినీ ఎరుగని స్థాయిలో వరద పోటెత్తడంతో విజయవాడ గత ఆరు రోజులుగా వరదలో నానుతోంది. బుడమేరుకు పడిన గండ్లు పూడ్చితేనే విజయవాడకు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close