ల్యాండ్ ఇష్యూ… మల్లారెడ్డి వర్సెస్ అడ్లూరి లక్ష్మణ్

బీఆర్ఎస్ ఎమ్మెల్యే మల్లారెడ్డి, కాంగ్రెస్ ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ మధ్య భూపంచాయితీ హాట్ టాపిక్ గా మారింది. ఈ భూమి మాదంటే మాదేనని ఇద్దరూ ఎమ్మెల్యేలు చెబుతున్నారు. తమ దగ్గర అన్ని ఆధారాలు ఉన్నాయని అటు మల్లారెడ్డి చెప్తుండగా.. తమ దగ్గర కూడా ప్రూఫ్స్ ఉన్నాయని అడ్లూరి లక్ష్మణ్ చెబుతుండటంతో ఈ ఇష్యూ కాస్త సీఎం వద్దకు చేరనున్నట్లు తెలుస్తోంది.

హైదరాబాద్ పేట్ బషీరాబాద్ పీఎస్ పరిధిలోని సుచిత్రలో సర్వే నెంబర్ 82కు సంబంధించి రెండున్నర ఎకరాల భూమిపై మల్లారెడ్డి, అడ్లూరి లక్ష్మణ్ ల మధ్య వివాదం నెలకొంది. తమ భూమిలో అక్రమంగా ఫెన్సింగ్ వేశారంటూ మల్లారెడ్డి వర్గీయులు ఇటీవల కంచెను కూల్చడం ఘర్షణకు దారితీసింది. ఈ భూమిని పదిహేనేళ్ళ కిందటే కొనుగోలు చేసినట్లు మల్లారెడ్డి చెబుతున్నారు. తన దగ్గర ఉన్న ల్యాండ్ డాక్యుమెంట్స్ ఫేక్ అని నిరూపిస్తే, ఎమ్మెల్యే పదవికి రాజేనేమా చేస్తానని మల్లారెడ్డి సవాల్ విసరడంతో ఈ ఇష్యూ మరింత హీట్ పెంచింది. కాంగ్రెస్ పార్టీ తమపై తప్పదు ప్రచారం చేస్తోందని ఆరోపించారు.

ఈ అంశంపై స్పందించిన అడ్లూరి లక్ష్మణ్.. తనతోపాటు ఆరుగురు కలిసి 2015లో ఈ భూమిన్ని కొనుగోలు చేశామని ఆయన స్పష్టం చేస్తున్నారు. ల్యాండ్ పై వివాదం ఉండటంతో మల్లారెడ్డి, ఆయన అల్లుడిని కలిసి సెటిల్ చేయాలని అడిగితే పట్టించుకోలేదన్నారు. మల్లారెడ్డి కాంగ్రెస్ పై ఆరోపణలు చేస్తూ కబుర్ల చెప్పడం కాదు.. ముఖ్యమంత్రి వద్ద తన నిజాయితీని నిరూపించుకోవాలని సవాల్ విసరడంతో మల్లారెడ్డి ఎలా వ్యవహరిస్తారు..? అన్నది ఆసక్తికరంగా మారింది.

ఈ ల్యాండ్ ఇష్యూపై మల్లారెడ్డి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసేందుకు ప్రయత్నిస్తున్నారు. అయితే, ఈ భూమి మాదేనని కాంగ్రెస్ ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కూడా చెబుతుండటంతో రేవంత్ ఈ వివాదానికి ఎలా ఫుల్ స్టాప్ పెడుతారన్నది ఉత్కంఠ రేపుతోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

డి-ఏజింగ్… లాభమా? నష్టమా ?

సినిమాలో ఒక క్యారెక్టర్ బాల్యం, యవ్వనం, కౌమార, ప్రౌడ దశలని చూపించడం ఫిల్మ్ మేకర్స్ కి పెద్ద సవాల్. ఇందుకోసం హలీవుడ్ నుంచి కూడా మేకప్ మ్యాన్ లని దిగుమతి చేసుకునే వారు....

దువ్వాడ శ్రీనివాస్ ఇంట్లో దివ్వెల మాధురీ !

దువ్వాడ ఫ్యామిలీ డ్రామాలో కొత్త కొత్త ఎపిసోడ్లు ప్రారంభమవుతున్నాయి. కొద్ది రోజుల పాటు సైలెంట్ గా ఉంటానని చెప్పిన దివ్వెల మాధురీ.. ఒక్క సారిగా.. ఏకంగా దువ్వాడ శ్రీనివాస్ ఇంట్లోనే ప్రత్యక్షమయ్యారు. దువ్వాడ...

ఆ పడవలు నందిగం సురేష్ తాలూకానే !

ప్రకాశం బ్యారేజీకి వరద వస్తే ఈ మధ్య బోట్లు కొట్టుకు వస్తున్నాయి. బ్యారేజని డ్యామేజ్ చేస్తున్నాయి. అవి ఎలా వస్తున్నాయో తెలియడం లేదు. ఇప్పుడు మిస్టరీ బయటపడే అవకాశాలు కనిపిస్తున్నాయి. వైసీపీ రంగులేసిన...

శభాష్ నిమ్మల… అభినందించిన నారా లోకేష్

భారీ వర్షానికి తోడు బుడమేరకు పడిన గండ్లు విజయవాడను ముంచేత్తాయి. కనీవినీ ఎరుగని స్థాయిలో వరద పోటెత్తడంతో విజయవాడ గత ఆరు రోజులుగా వరదలో నానుతోంది. బుడమేరుకు పడిన గండ్లు పూడ్చితేనే విజయవాడకు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close