ఒక్క కేసుకే కాంగ్రెస్‌కు మద్దతు ప్రకటించేసిన మల్లారెడ్డి

టీఆర్ఎస్ అెధికారంలో ఉన్నప్పుడు తొడకొట్టి , రేవంత్ రెడ్డిపై చాలెంజులు, ఆరోపణలు చేసిన మల్లారెడ్డి ఇప్పుడు ప్రభుత్వం మారడంతో పూర్తిగా మారిపోయారు. రేవంత్ రెడ్డి తనకు దోస్తని ప్రకటించుకుంటున్నారు. ఆయనపై మూడు రోజుల కిందట ఓ కబ్జా కేసు నమోదయింది. ఇప్పుడు అసెంబ్లీలో ఆయన ప్రవర్తన భిన్నంగా ఉంది. ఆయన తన అల్లుడితో కలిసి సైలెంట్ గా వచ్చి వెళ్తున్నారు. తనపై కేసులు కక్ష సాధింపులు కాదని ఆయన చెబుతున్నారు.

శుక్రవారం అసెంబ్లీ లాబీలో ఉన్న సమయంలో తీన్మార్ మల్లన్న ఎదురయ్యారు. తీన్మార్ మల్లన్న ఇటీవలే కాంగ్రెస్ లో చేరారు. ఆయన కూడా మేడ్చల్ సీటు కోసం ప్రయత్నించారు. కానీ కాంగ్రెస్ నాయకత్వం పట్టించుకోలేదు. దీంతో వారి మధ్య సీటు సంభాషణ ముగిసిన తర్వాత.. మల్లారెడ్డిని.. కాంగ్రెస్ కు మద్దతిస్తావా అని అడిగారు తీన్మార్ మల్లన్న. అంతే సంకోచించకుండా.. అసెంబ్లీలో ఎప్పుడైనా కాంగ్రెస్‌కు సీట్లు తక్కువ అయితే మద్దతిస్తానని ప్రకటించేశారు మల్లారెడ్డి.

ఎన్నికల సమయంలోనే రాజకీయాలు అని.. తర్వాత కాదని చెప్పుకొచ్చారు. సొంత పార్టీకి కాకుండా.. అధికార పార్టీకి మద్దతు ఇస్తానని చెప్పడం రాజకీయం ఎలా అవుతుందో కానీ.. మల్లారెడ్డి మాత్రం.. తన అల్లుడితో కలిసి..రేవంత్ పిలిచిన వెంటనే కాంగ్రెస్‌లో చేరిపోవడం ఖాయమన్న అభిప్రాయం బీఆర్ఎస్‌లో వినిపిస్తోంది

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

డి-ఏజింగ్… లాభమా? నష్టమా ?

సినిమాలో ఒక క్యారెక్టర్ బాల్యం, యవ్వనం, కౌమార, ప్రౌడ దశలని చూపించడం ఫిల్మ్ మేకర్స్ కి పెద్ద సవాల్. ఇందుకోసం హలీవుడ్ నుంచి కూడా మేకప్ మ్యాన్ లని దిగుమతి చేసుకునే వారు....

దువ్వాడ శ్రీనివాస్ ఇంట్లో దివ్వెల మాధురీ !

దువ్వాడ ఫ్యామిలీ డ్రామాలో కొత్త కొత్త ఎపిసోడ్లు ప్రారంభమవుతున్నాయి. కొద్ది రోజుల పాటు సైలెంట్ గా ఉంటానని చెప్పిన దివ్వెల మాధురీ.. ఒక్క సారిగా.. ఏకంగా దువ్వాడ శ్రీనివాస్ ఇంట్లోనే ప్రత్యక్షమయ్యారు. దువ్వాడ...

ఆ పడవలు నందిగం సురేష్ తాలూకానే !

ప్రకాశం బ్యారేజీకి వరద వస్తే ఈ మధ్య బోట్లు కొట్టుకు వస్తున్నాయి. బ్యారేజని డ్యామేజ్ చేస్తున్నాయి. అవి ఎలా వస్తున్నాయో తెలియడం లేదు. ఇప్పుడు మిస్టరీ బయటపడే అవకాశాలు కనిపిస్తున్నాయి. వైసీపీ రంగులేసిన...

శభాష్ నిమ్మల… అభినందించిన నారా లోకేష్

భారీ వర్షానికి తోడు బుడమేరకు పడిన గండ్లు విజయవాడను ముంచేత్తాయి. కనీవినీ ఎరుగని స్థాయిలో వరద పోటెత్తడంతో విజయవాడ గత ఆరు రోజులుగా వరదలో నానుతోంది. బుడమేరుకు పడిన గండ్లు పూడ్చితేనే విజయవాడకు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close