ఈ సీక్వెల్ ఎప్పుడు పూర్త‌య్యింద‌బ్బా..?!

మైత్రీ మూవీస్ అంటే పెద్ద పెద్ద ప్రాజెక్టులే గుర్తొస్తాయి. వాళ్లు తీసిన చిన్న సినిమాల్లో ‘మ‌త్తు వ‌ద‌ల‌రా’ ఒక‌టి. 2019 డిసెంబ‌రులో విడుద‌లైన ఈ చిత్రం మంచి విజ‌యాన్నే అందుకొంది. ముఖ్యంగా ఈ సినిమాలో కామెడీ బాగా వ‌ర్క‌వుట్ అయ్యింది. స‌త్య చేసిన క్యారెక్ట‌ర్ హిలేరియ‌స్‌గా పండింది. ఇప్పుడు దీనికి సీక్వెల్ రెడీ అయిపోయింది. ‘మ‌త్తువ‌ద‌ల‌రా 2’ని సెప్టెంబ‌రు 13న విడుద‌ల చేస్తున్న‌ట్టు చిత్ర‌బృందం ప్ర‌క‌టించింది. కీర‌వాణి త‌న‌యుడు శ్రీ‌సింహా ఇందులో క‌థానాయ‌కుడిగా న‌టించిన సంగ‌తి తెలిసిందే. రితీష్ రానా ద‌ర్శ‌కుడు. ఈ సీక్వెల్ లో ఫ‌రియా అబ్దుల్లా క‌థానాయిక‌గా న‌టించింది. సునీల్, సునీల్, వెన్నెల కిషోర్‌, శ్రీ‌నివాస రెడ్డి కీల‌క పాత్ర‌లు పోషించారు.

సాధార‌ణంగా ఓ హిట్ సినిమాకు సీక్వెల్ వ‌స్తోందంటే ముందు నుంచీ హ‌డావుడి చేస్తారు. పైగా మైత్రీ మూవీస్ లాంటి సంస్థ అంటే ఆ హంగామా వేరేలా ఉంటుంది. కానీ ‘మ‌త్తు వ‌ద‌ల‌రా 2’ ప‌నుల‌న్నీ గ‌ప్ చుప్‌గా జ‌రిగిపోయాయి. ఈ సినిమా షూటింగ్ ఎప్పుడు మొద‌లైందో, ఎప్పుడు పూర్త‌య్యిందో కూడా తెలీకుండా గ‌మ్మ‌త్తుగా న‌డిపించేశారు. ఇప్పుడు స‌డ‌న్ గా రిలీజ్ డేట్ కూడా ప్ర‌క‌టించేశారు. సెప్టెంబ‌రు 13 అంటే రెండు వారాల స‌మ‌యం కూడా లేదు. ప్ర‌మోష‌న్ల‌కు ఇది స‌రిపోతుంద‌ని మైత్రీ మూవీస్ భావిస్తోంది. రేప‌టి నుంచి వ‌రుస‌గా అప్‌డేట్లు ఒకొక్క‌టిగా బ‌య‌ట‌కు రానున్నాయి. ‘మ‌త్తు వ‌ద‌ల‌రా’ త‌ర‌వాత శ్రీ‌సింహా చాలా సినిమాలే చేసినా, ఏదీ వర్క‌వుట్ అవ్వ‌లేదు. ఈ సీక్వెల్ అయినా త‌న‌కు బ్రేక్ ఇస్తుందేమో చూడాలి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

రైతు భరోసాపై సర్కార్ కీలక ప్రకటన

రెండు లక్షల రుణమాఫీ పేరుతో హడావిడి చేసి రైతు భరోసాను కాంగ్రెస్ ప్రభుత్వం ఎగ్గొట్టిందని బీఆర్ఎస్ పదేపదే విమర్శలు చేస్తోంది. రైతు భరోసాను ఎప్పటి నుంచి అమలు చేస్తారు? ఎవరికి రైతు...

సత్య.. ది వన్ అండ్ ఓన్లీ…

సునీల్ తర్వాత మళ్ళీ ఆలాంటి కమెడియన్ దొరుకుతాడా? అనే ప్రశ్నకు సమాధానంగా కనిపించాడు సత్య. సునీల్ ని ఇమిటేట్ చేస్తున్నాడనే విమర్శలని బిగినింగ్ లో ఎదురుకున్నాడు. ఆ విమర్శలలో కొంతం వాస్తవం కూడా...
video

దేవర ముందర బావ బావమరిది

https://www.youtube.com/watch?v=7QCGkkKiJOE 96 సినిమాతో డైరెక్టర్ సి ప్రేమ్ కుమార్ పేరు బయటికి వచ్చింది. ఆ సినిమా మ్యాజికల్ హిట్. తెలుగులో రిమేక్ మాత్రం సరిగ్గా ఆడలేదు. ఇప్పుడు ప్రేమ్ కుమార్ నుంచి మరో సినిమా...

వేణుస్వామిపై కేసు – మూర్తి సక్సెస్

జాతకాల పేరుతో బ్లాక్ మెయిల్ చేసి డబ్బులు గుంజే వేణు స్వామిపై కేసు పెట్టాలని హైదరాబాద్ పదిహేడో మెట్రోలిపాలిటక్ కోర్టు జూబ్లిహిల్స్ పోలీసులను ఆదేశించింది. వేణు స్వామి మహా మోసగాడు అని...

HOT NEWS

css.php
[X] Close
[X] Close