సీఎంఆర్ఎఫ్‌కే మేకపాటి విరాళం – జగన్ ఊరుకుంటారా ?

సీఆర్ఆర్ఎఫ్‌కు ఎవరూ విరాళాలు ఇవ్వవద్దని వైసీపీ నేతలు .. తమ వారు అందరికీ సమాచారం పంపారు. అందుకే కొంత మంది చెక్కులు తెచ్చి జగన్ కే ఇచ్చారు. అయితే జగన్ మాటను లెక్క చేయని మేకపాటి రాజమోహన్ రెడ్డి తన పాతిక లక్షల రూపాయల విరాళాన్ని సీఎంఆర్ఎఫ్‌కే పంపారు. అయితే తాను నేరుగా వెళ్తే ఇక తమ నాయకుడు తట్టుకోలేడన్న ఉద్దేశంతో స్పీడ్ పోస్టు ద్వారా పంపారు. తన ప్రతినిధులుగా కుమారుడ్ని కూడా పంపలేదు. అదే తెలంగాణ ముఖ్యమంత్రిని మాత్రం రాజమోహన్ రెడ్డి నేరుగా కలిసి ఇచ్చాడు.

జగన్ మనస్థత్వం తెలుసు కాబట్టి రాజమోహన్ రెడ్డి.. నేరుగా ప్రభుత్వానికి ఇవ్వడానికి జంకారు. కానీ ఇప్పుడు అయినా జగన్ మేకపాటిపై కినుక వహిస్తారు. ఎందుకంటే…సీఎంఆర్ఎఫ్‌కు విరాళాలివ్వొద్దని పార్టీ ద్వారా సాయం చేయాలని ఆయన ఇప్పటికే సూచనలు పంపారు. కానీ మేకపాటి బాధమేకపాటిది. ఆయనకు బడా నిర్మాణ సంస్థ ఉంది. ఆయన ప్రభుత్వాలతో సున్నం పెట్టుకోలేరు. చంద్రబాబు వైసీపీ నేత కాబట్టి.. ఆయన సంస్థను నిర్వీర్యం చేయాలని అనుకోరు కాబట్టి కాస్త ధైర్యంగానే ఉన్నారు. అదే జగన్ అయితే మేకపాటి లాంటి వాళ్లు ఎంత వేదన అనుభవిస్తూ ఉంటారో చెప్పాల్సిన పని లేదు.

జగన్ రెడ్డి తాను కోటి ప్రకటించానని చెప్పి.. విజయవాడలో రెండు ఆటోల సరుకుల బస్తాల్ని పంపిణీ చేసి.. రూ. కోటి ఖర్చు మమ అనిపించారు. నిజానికి రూ. కోటితో ఏదో చేయాలనుకోవడమే అమాయకత్వం. ఎందుకంటే లక్షల్లో ఉన్నబాధితులకు రూ. కోటితో ఏమీ చేయలేరు . అయినా అతి కొద్ది మొత్తంలో అందులోనూ ఎంత పంచారో ఎవరికీ తెలియని మొత్తాన్ని పంచి.. తాము తమ కోటి ఇచ్చేశామని చెప్పుకుంటున్నారు. తన పాతిక లక్షలకు లెక్కలుండాలన్న ఉద్దేశంతో మేకపాటి సీఎంఆర్ఎఫ్‌కే చెక్కులు పంపించారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

జ‌న‌సేన‌లోకి బాలినేని… జ‌గ‌న్ పై సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

తాను ఏనాడూ ఏదీ ఆశించ‌కుండా, మంత్రిప‌ద‌విని సైతం వ‌దులుకొని జ‌గ‌న్ వెంట న‌డిస్తే... నాపై ఇష్టం వ‌చ్చినట్లు మాట్లాడిస్తున్నా ప‌ట్టించుకోలేద‌ని మాజీ మంత్రి బాలినేని మండిప‌డ్డారు. జ‌గ‌న్ వెంట‌నే క‌ష్ట‌కాలంలో న‌డిచిన 17మంది...

కిల్’ రీమేక్‌: ఏ స్టూడియోస్ + ధ‌ర్మా ప్రొడ‌క్ష‌న్స్‌

బాలీవుడ్ లో ఘ‌న విజ‌యాన్ని అందుకొన్న సినిమా 'కిల్‌'. తెలుగులో ఈ చిత్రాన్ని రీమేక్ చేస్తార‌ని కొంత‌కాలంగా ప్ర‌చారం జ‌రుగుతోంది. బ‌డా బ‌డా నిర్మాణ సంస్థ‌లు రీమేక్ రైట్స్ కోసం పోటీ పడ్డాయి....

ఎక్స్‌క్లూజీవ్‌: గ‌ప్ చుప్ గా ప్ర‌భాస్ సినిమా

ప్ర‌భాస్ - హ‌ను రాఘ‌వ‌పూడి కాంబోలో ఓ సినిమా ఇటీవ‌లే లాంఛ‌నంగా ప్రారంభ‌మైన సంగ‌తి తెలిసిందే. మైత్రీ మూవీస్ సంస్థ ఈచిత్రాన్ని నిర్మిస్తోంది. బుధ‌వారం నుంచే ఈ సినిమా రెగ్యుల‌ర్ షూటింగ్ ప్రారంభ‌మైంది....

నాగ‌బాబు ట్వీట్… జానీ మాస్ట‌ర్ ఇష్యూ మీదేనా?

జ‌న‌సేన నేత‌, ప్ర‌ముఖ కొరియోగ్రాఫ‌ర్ జానీ మాస్ట‌ర్ పై లైంగిక ఆరోప‌ణ‌లు రాగా కేసులు కూడా న‌మోద‌య్యాయి. ప‌రారీలో ఉన్న జానీ మాస్ట‌ర్ ను సైబ‌రాబాద్ పోలీసులు అరెస్ట్ కూడా చేశారు. ఈ...

HOT NEWS

css.php
[X] Close
[X] Close