ఎమ్మెల్యేగా పోటీ చేస్తానంటోన్న ఎంపీ మిథున్ రెడ్డి

ఎంపీ మిథున్ రెడ్డి… మాజీ మంత్రి పెద్దిరెడ్డి కొడుకే అయినా, ఓ బ‌డా కంపెనీని న‌డిపిస్తున్న వ్యక్తి తెలుగు రాష్ట్రాల్లోని చాలా మంది కీల‌క నేత‌ల‌కు సుప‌రిచితుడు. రాజంపేట ఎంపీగా వ‌రుస‌గా గెలుస్తూ వ‌స్తున్న మిథున్ రెడ్డి… కొంత‌కాలంగా స్థానికంగా ఇబ్బందిక‌ర ప‌రిస్థితులను ఎదుర్కొంటున్నారు.

పుంగ‌నూరు ఎమ్మెల్యేగా ఉన్న త‌న తండ్రి పెద్దిరెడ్డి నియోజ‌క‌వ‌ర్గం వైపే రావ‌టం లేదు. ఎప్పుడైనా వ‌చ్చినా స్థానికంగా నిర‌స‌న‌లు, టీడీపీ నేత‌ల విమ‌ర్శ‌ల‌కు తోడు అక్ర‌మంగా భూముల‌ను కొట్టేశార‌న్న ఆరోప‌ణ‌లు వెల్లువెత్తుతుండ‌టంతో పెద్దిరెడ్డి నియోజ‌క‌వ‌ర్గానికి దూరంగా ఉంటున్నారు. దీంతో అప్పుడ‌ప్పుడు స్థానిక ఎంపీగా ఉన్న ఆయ‌న కొడుకు మిథున్ రెడ్డి వ‌స్తున్నారు.

అయితే, ఎంపీగా ఉన్న మిథున్ రెడ్డి ఎమ్మెల్యేగా పోటీచేయాల‌నుకుంటున్నార‌ని తెలుస్తోంది. 2026లో ఏపీలో అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గాలు పున‌ర్విభ‌జించే అవ‌కాశం ఉంది. ఏపీ పున‌ర్విభ‌జ‌న చ‌ట్టం 2014 ప్ర‌కారం ఏపీలోనూ అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గాల పున‌ర్వ‌వ్య‌వ‌స్థీక‌ర‌ణ త‌ప్ప‌నిసరి. అదే జ‌రిగితే… పుంగ‌నూరు రెండు నియోజ‌క‌వ‌ర్గాలుగా మారితే… ఎక్క‌డో ఒక చోట నుండి ఎమ్మెల్యేగా తానే పోటీ చేస్తాన‌ని, పుంగ‌నూరును వ‌దిలిపెట్టేది లేద‌ని ప్ర‌క‌టించారు.

పుంగ‌నూరును పెద్దిరెడ్డి ఫ్యామిలీ విడిచిపెట్ట‌బోతుందని కొంత‌కాలంగా స్థానికంగా ప్ర‌చారం జ‌రుగుతున్న నేప‌థ్యంలో ఎంపీ మిథున్ రెడ్డి ప్ర‌క‌ట‌న ఆస‌క్తిక‌ర చ‌ర్చ‌కు దారితీస్తోంది. క్యాడ‌ర్ చేజార‌కుండా ఉండేందుకే మిథున్ రెడ్డి ఎమ్మెల్యేగా పోటీ చేస్తాన‌న్న ప్ర‌క‌ట‌న చేసి ఉంటార‌ని, ఎవ‌రు పోటీ చేసినా… పుంగ‌నూరులో పెద్దిరెడ్డికి వ‌చ్చేసారి ఓట‌మి రుచి చూడ‌టం ఖాయం అంటోంది టీడీపీ క్యాడ‌ర్.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

శ్రీవారి లడ్డూలో జంతువుల కొవ్వు – జగన్ హయాంలో అపచారం!

తిరుమలలో ఎన్ని అరాచకాలు చేయాలో అన్నీ చేశారని తేలిపోయింది. చివరికి తిరుపతి లడ్డూ ప్రసాదాన్ని కూడా అపవిత్రం చేశారు. వైసీపీ హయాంలో తిరుపతి లడ్డూ క్వాలిటీ అత్యంత ఘోరంగా ఉండేది. దానికి కారణం...

తమిళనాడు డిప్యూటీ సీఎంగా ఉదయనిధి

తమిళ రాజకీయాలు మారిపోతున్నాయి. ఓ వైపు పొలిటికల్ వాక్యూమ్ ను ఉపయోగించుకుని రాజకీయ నాయకుడు అయిపోవడానికి విజయ్ కొత్త పార్టీ పెట్టారు. మరో వైపు అన్నాడీఎంకే కూడా బలమైన క్యాడర్ తో ఉంది....

వైసీపీ ఆఫీసులకూ అదే పరిస్థితి – లా ఒక్కటే !

నల్లగొండ బీఆర్ఎస్ ఆఫీసును కూల్చేయాలని హైకోర్టు ఇచ్చిన ఆదేశాలతో .. వైసీపీకి కూడా గుండెల్లో రాయి పడింది. బీఆర్ఎస్ పార్టీకి అదొక్కదానికే అనుమతుల్లేవేమో కానీ వైసీపీకి చెందిన ఒక్క ఆఫీసుకు తప్ప...

దేవరని రామాయణంతో ముడిపెట్టిన పరుచూరి

రచయిత పరుచూరి గోపాలకృష్ణ 'పరుచూరి పలుకులు' పేరుతో సినిమాల‌ను విశ్లేషిస్తుంటారు. ఆయన విశ్లేషణలు చాలా ప్రజాదరణ పొందాయి. తన అనుభవాలన్నీ జోడిస్తూ సినిమాల్లోని లోటుపాట్లని, మంచి విషయాల్ని చెపుతుంటారు. తాజాగా ఎన్టీఆర్ దేవర...

HOT NEWS

css.php
[X] Close
[X] Close