నాగబాబు అతి స్పందన వల్లే ఇదంతా!

నిజానికి అది చిరంజీవి గౌరవాన్ని నిలబెట్టి న ఘటన. ఆయన వ్యక్తిత్వం గొప్పదని అందరికీ చూపించిన ఘటన. కానీ నాగబాబు వల్ల మొత్తం తేడా కొట్టింది. కుల గొడవలకు కారణం అయింది. రెండు కులాలు సోషల్ మీడియాలో పోట్లాడుకోవడానికి వేదిక అయింది. ఇదంతా నాగబాబు వల్లే జరిగింది.

అలయ్ – బలయ్ ప్రోగ్రాంలో చిరంజీవి అతిధులతో సెల్ఫీలు దిగే ప్రోగ్రాం పెట్టుకోవడంతో గరికపాటి నరసింహారావు ప్రవచానికి ఆటంకం ఏర్పడింది. దీంతో గరికపాటి కాస్త అసహనానికి గురయ్యారు. ఆ ఫోటో సెషల్ ఆపేయాలని సూచించారు. దీంతో చిరంజీవి కూడా జరిగిన అసౌకర్యానికి చింతించి.. గరికిపాటికి గౌరవం ఇచ్చారు. ఇక్కడ గరికపాటి అసహనానికి గురయ్యారని అందరూ అంగీకరిస్తారు. చిరంజీవి మెగాస్టార్. ఆయనతో ఫోటోల కోసం అందరూ ఎగబడతారు.. అది కామన్. అందులో చిరంజీవి తప్పేమీ లేదు. అయినా సరే పెద్దలు అన్న గౌరవంతో చిరంజీవి హుందాగా వ్యవహరించారు.. అది చూసి చాలా మంది చిరంజీవిని ప్రశంసించారు. గరికపాటికి అంత అసహనం ఉండకూడదని అభిప్రాయం వ్యక్తం చేశారు.

అయితే ఈ విషయంలో నాగబాబు అతి స్పందన సోషల్ మీడియాలో చిరంజీవిని.. ఆయనతో కలిసి నాగబాబును ట్రోల్ చేయడానికి కారణం అయింది. దీన్ని సోషల్ మీడియాలోకి తెచ్చిన నాగబాబు.. ఆయనకు చాలా జెలసీ అని.. చిరంజీవి ఉన్న పలుకుబడి.. క్రేజ్ చూసి ఆయన అసూయ ఫీలయ్యాడని పేరు పెట్టకుండా రాసుకొచ్చారు. ఇది అరోగ్యానికి హానికరమైన సెటైర్ వేశానని అనుకున్నారు.

చిరంజీవి ఇమేజ్ గురించి ఇప్పుడు నాగబాబు సర్టిఫికెట్ ఇవ్వాల్సిన పని లేదు. గరికపాటి పెద్దమనిషి. ప్రవచనాలు చెబుతారు. అంతే కానీ ఆయనేమీ సినిమా నటుడు కాదు. మాస్ లీడర్ కాదు.. అసూయ ఫీలవడానికి. ఆయన ఎక్కడికైనా వెళ్తే ఒక్కరు కూడా సెల్పీ దిగరు. అది సహజమే ప్రసంగానికి అడ్డం తగిలేలా చిరంజీవి సెల్ఫీలు దిగుతున్నారు కాబట్టి గరికపాటి వారించారు.దాన్ని స్పోర్టివ్ గా తీసుకోవాల్సిన నాగబాబు సోషల్ మీడియాలో పెట్టి చిరంజీవి ప్రవర్తనను మరింత హైలెట్ చేశారు. ఫలితంగా అది కులాల గొడవలకు కారణం అయింది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

డి-ఏజింగ్… లాభమా? నష్టమా ?

సినిమాలో ఒక క్యారెక్టర్ బాల్యం, యవ్వనం, కౌమార, ప్రౌడ దశలని చూపించడం ఫిల్మ్ మేకర్స్ కి పెద్ద సవాల్. ఇందుకోసం హలీవుడ్ నుంచి కూడా మేకప్ మ్యాన్ లని దిగుమతి చేసుకునే వారు....

దువ్వాడ శ్రీనివాస్ ఇంట్లో దివ్వెల మాధురీ !

దువ్వాడ ఫ్యామిలీ డ్రామాలో కొత్త కొత్త ఎపిసోడ్లు ప్రారంభమవుతున్నాయి. కొద్ది రోజుల పాటు సైలెంట్ గా ఉంటానని చెప్పిన దివ్వెల మాధురీ.. ఒక్క సారిగా.. ఏకంగా దువ్వాడ శ్రీనివాస్ ఇంట్లోనే ప్రత్యక్షమయ్యారు. దువ్వాడ...

ఆ పడవలు నందిగం సురేష్ తాలూకానే !

ప్రకాశం బ్యారేజీకి వరద వస్తే ఈ మధ్య బోట్లు కొట్టుకు వస్తున్నాయి. బ్యారేజని డ్యామేజ్ చేస్తున్నాయి. అవి ఎలా వస్తున్నాయో తెలియడం లేదు. ఇప్పుడు మిస్టరీ బయటపడే అవకాశాలు కనిపిస్తున్నాయి. వైసీపీ రంగులేసిన...

శభాష్ నిమ్మల… అభినందించిన నారా లోకేష్

భారీ వర్షానికి తోడు బుడమేరకు పడిన గండ్లు విజయవాడను ముంచేత్తాయి. కనీవినీ ఎరుగని స్థాయిలో వరద పోటెత్తడంతో విజయవాడ గత ఆరు రోజులుగా వరదలో నానుతోంది. బుడమేరుకు పడిన గండ్లు పూడ్చితేనే విజయవాడకు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close