చిరంజీవి, బాలకృష్ణ ఎప్పుడో వంద సినిమాల మైలు రాయిని దాటేశారు. ఇప్పుడు నాగార్జున వంతు వచ్చింది. నాగ్ సెంచరీకి అతి దగ్గరలో ఉన్నారు. ఆయన తన వందో సినిమాని ప్రత్యేకంగా డిజైన్ చేయాలనుకొంటున్నారు. ప్రస్తుతం కూలీ, కుబేర చిత్రాల్లో నటిస్తున్నారు నాగ్. ఈ సినిమాలతో ఆయన మళ్లీ ఫామ్ లోకి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇదే జోష్తో తన వందో సినిమాకు శ్రీకారం చుట్టాలని భావిస్తున్నారు. టాలీవుడ్ లోని ఓ ప్రముఖ నిర్మాత నాగ్ కోసం కథలు వింటున్నారు. కే.ఏ.కార్తిక్ అనే ఓ తమిళ దర్శకుడు ఇటీవల ఓ కథ వినిపించినట్టు సమాచారం. ఆ కథ నాగ్ కి బాగా నచ్చింది. అన్నీ కుదిరితే… నాగ్ చేసే వందో సినిమా ఇదే అవుతుందని సమాచారం.
కార్తీక్ తమిళంలో నితమ్ వరు వానమ్ అనే చిత్రానికి దర్శకత్వం వహించారు. క్లాస్ టచ్తో సాగే సినిమా ఇది. నాగ్ కోసం మాత్రం పూర్తి స్థాయి కమర్షియల్ కథని ఎంచుకొన్నారని సమాచారం. వందో సినిమా కాబట్టి, ఓ స్టార్ డైరెక్టర్ ఉంటే బాగుంటుందన్నది అక్కినేని ఫ్యాన్స్ ఆలోచన. కానీ నాగ్ ఎప్పుడూ కొత్తతరాన్ని ప్రొత్సహిస్తుంటారు. కథ నచ్చితే జూనియరా, సీనియరా? అనేవి పట్టించుకోరు. ఈసారి కూడా అదే లెక్కల్లో ఈ సినిమాని పట్టాలెక్కిస్తున్నారని తెలుస్తోంది. ‘కుబేర’, ‘కూలీ’ చిత్రాలు విడుదల అయ్యాకే ఈ సినిమా పట్టాలెక్కే అవకాశం వుంది.