నాని – సాయి ప‌ల్ల‌వి – శేఖ‌ర్ క‌మ్ముల‌?

టాలీవుడ్ లో మ‌రో ఇంట్ర‌స్టింగ్ కాంబినేష‌న్ కి రంగం సిద్ధం అవుతోందా? నాని – శేఖ‌ర్ క‌మ్ముల కాంబోలో ఓ సినిమా రాబోతోందా? అంటే అవున‌నే అంటున్నాయి టాలీవుడ్ వ‌ర్గాలు. నాని, శేఖ‌ర్ క‌మ్ముల క‌లిసి ఓ సినిమా చేసే అవ‌కాశాలు పుష్క‌లంగా క‌నిపిస్తున్నాయి. నానితో ప‌ని చేయ‌డానికి శేఖ‌ర్ క‌మ్ముల‌, శేఖర్ క‌మ్ముల‌తో వ‌ర్క్ చేయ‌డానికి నాని ఆస‌క్తిని చూపిస్తున్నారు. నానికి స‌రిప‌డా క‌థ శేఖ‌ర్ క‌మ్ముల ద‌గ్గ‌ర సిద్ధంగా ఉంద‌ని టాక్. ఈ చిత్రంలో కథానాయిక‌గా సాయిప‌ల్ల‌వి అయితే బాగుంటుంద‌ని శేఖ‌ర్ క‌మ్ముల భావిస్తున్నార్ట‌.

నిజానికి ఓ సినిమా చేస్తుంటే, మిగిలిన ఏ ప్రాజెక్టుల మీదా శేఖ‌ర్ క‌మ్ముల దృష్టి పెట్టరు. అయితే ఈమ‌ధ్య ఆయ‌న పంథా మారింది. రెండు మూడు క‌థ‌ల్ని ఏక కాలంలో సిద్ధం చేస్తున్నారు. ప్ర‌స్తుతం ధ‌నుష్ తో ‘కుబేర‌’ రూపొందిస్తున్నారు శేఖ‌ర్ క‌మ్ముల‌. ఈ సినిమా షూటింగ్ శ‌ర వేగంగా సాగుతోంది. ‘కుబేర‌’ అవ్వ‌గానే ధ‌నుష్ తోనే మ‌రో సినిమా చేసే ఛాన్సుంది. ఒక వేళ ధ‌నుష్ మ‌రో ప్రాజెక్టుతో బిజీ అయితే, శేఖ‌ర్ క‌మ్ముల ఇంకో ఆప్ష‌న్ వెదుక్కోవాలి. అందుకోసం నానిని దృష్టిలో ఉంచుకొని ఓ క‌థ రెడీ చేశార‌ని స‌మాచారం. మ‌రోవైపు నాని కూడా త‌న లైన‌ప్ ని స్ట్రాంగ్ చేసుకొంటున్నాడు. ‘హిట్ 3’ త‌ర‌వాత సుజిత్ తో ఓ సినిమా చేయాలి. ‘ద‌స‌రా’ ద‌ర్శ‌కుడు క్యూలో ఉన్నాడు. వీటి మ‌ధ్య శేఖ‌ర్ క‌మ్ముల‌కు డేట్లు ఎప్పుడు ఇస్తాడో చూడాలి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కుక్కల విద్యాసాగర్ కూడా పరారీ !

కేసులు నమోదైన ప్రతి ఒక్కరూ పరారీ అవుతున్నారు. తాము తప్పు చేయలేదని విచారణ ఎదుర్కొంటామని ఒక్కరూ ధైర్యంగా ముందుకు రావడం లేదు. తాజాగా ముంబై నటి జెత్వానీపై కుట్ర చేసిన కేసులో...

తెలంగాణ తల్లి విగ్రహం – కేటీఆర్‌ ఆన్సర్ ఏది ?

రాజీవ్ గాంధీ విగ్రహాన్ని తీసేస్తామని కేటీఆర్ ప్రకటంచి.. గొప్పగా బెదిరించానని అనుకుంటున్నారు. కానీ వచ్చే ఎన్నికల నాటికి రాజకీయ పరిస్థితులు ఎలా ఉంటాయో చెప్పడం కష్టం. అప్పుడు కాంగ్రెస్ తో పొత్తులో ఉంటే......

తగ్గుతున్న జగన్ భయం – ఏపీలో పెట్టుబడుల వెలుగులు !

ఐదేళ్ల అరాచక నీడ నుంచి ఏపీ ఇప్పుడిప్పుడే బయటపడుతోంది. ఎవరైనా రూపాయి పెట్టుబడితో రావాలంటే వణికిపోయే పరిస్థితి నుంచి మళ్లీ ఏపీలో పెట్టుబడులు పెడితే బెటరన్న ఆలోచనలకు పెట్టుబడిదారులు వస్తున్నారు. గుజరాత్...

బెజవాడ ప్రజలకు తోడు, నీడగా ప్రభుత్వం !

బుడమేరు ఉగ్రరూపం కారణంగా నష్టపోయిన బెజవాడ వాసులందరికీ ఆర్థిక పరమైన మద్దతు ఇవ్వడానికి చంద్రబాబు భారీ ప్యాకేజీ ప్రకటించారు. ముంపు ప్రాంతంలోని ప్రతి ఇంటికి ఆయన పరిహారం ప్రకటించారు. ప్రతి ఒక్క కుటుంబానికి...

HOT NEWS

css.php
[X] Close
[X] Close