వరదలు తగ్గిన వెంటనే ఆపరేషన్ బుడమేరు !

బుడమేరును ఆక్రమించేసి అడ్డగోలుగా కట్టిన నిర్మాణాలతో .. ఎంత ప్రమాదమో… తాజాగా బయట ప డింది. రాష్ట్ర విభజన తర్వాత విజయవాడ వేగంగా విస్తరిస్తోంది. వైసీపీ హయాంలో వ్యవస్థలన్నీ దోచుకుతినడమే పనిగా ఉండిపోయాయి. ఫలితంగా బడమేరు కుంచించుకుపోయింది. కబ్జాలు పెరిగిపోయాయి. ఇప్పుడు ఆ కారణంగా బుడమేరు ప్రవాహం సాగడం లేదు. మరోసారి ఇలాంటి ప రిస్థితి వస్తే.. ఇంకా ఎక్కువ సమస్యలు వస్తాయి. అందుకే ప్రభుత్వం బుడమేరును సంస్కరించాలని నిర్ణయించింది.

బుడమేరులో కబ్జాల లెక్క తీసి.. ఎవరెవరు అమ్ముకున్నారు.. ఎవరెవరు కొనుగోలు చేశారో మొత్తం కేసులు పెట్టి … బుడమేరు పరిధిలో ఉన్న ఇళ్లన్నీ కూల్చివేసే అవకాశం ఉంది. సామాన్యులు ఎవరైనా ఆ ఇళ్లను కోనుగోలు చేసి ఉంటే.. వారికి కబ్జాలు చేసి అమ్మిన వారి వద్ద నుంచే డబ్బులు వసూలు చేసి పరిహారం ఇప్పించే ఆలోచన చేసే అవకాశం ఉంది. వైసీపీ నేతలు ముఖ్యంగా వెల్లంపల్లితో పాటు నాటి కొంత మంది ప్రజాప్రతనిధులు బుడమేరు మీద పడ్డారని అనేక సార్లు మీడియా కూడా వెలుగులోకి తెచ్చింది.

అయితే కబ్జాలు మా హక్కు అన్నట్లుగా అప్పటి ప్రభుత్వం పట్టించుకోలేదు. ఫలితంగా ఐదేళ్ల పాటు నిరంతరాయంగా ఈ ఆక్రమణలు సాగాయి. ఇప్పుడు అదే వైసీపీ నేత వచ్చి బుడమేరు గురించి కథలు చెబుతున్నారు. ఆయనకు అవగాహన లేదు కాబట్టి… చేసిన కబ్జాలపైనా స్పష్టత లేదో.. ఆయనకు రావాల్సినవి అందాయో కానీ… ముందు ముందు అసలు సినిమా చూపించడంల ఖాయంగా కనిపిస్తోంది. బుడమేరును మేసిన వైసీపీ నేతల జాతకాలు గుట్టు బయటపడనుంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

శ్రీవారి లడ్డూ ఇష్యూ : వైసీపీ పాపం పండింది !

గుడిని గుడిలో లింగాన్ని మింగే బ్యాచ్‌కు ప్రజలు తిరుగులేని మెజార్టీతో అధికారం ఇస్తే.. తమకు దోచుకోమని లైసెన్స్ ఇచ్చారని ఫీలవుతారు. వైసీపీ నేతలు అదే ఫీలయ్యారు. దేవుడనే భయం కూడా...

కంగనపై దానం కామెంట్స్‌ – కేటీఆర్ ఖండన !

సినిమాల్లో బోగం వేషాలు వేసుకునే కంగనా.. రాహల్ గాంధీని విమర్శించడమా ?... అని దానం నాగేందర్.. హీరోయిన్ కంగనపై విరుచుకుపడ్డారు. ఈ బోగం వేషాలు అంటే ఏమిటో కానీ.. బీజేపీ నేతలకు...

తిరుపతి లడ్డూ ఇష్యూ : అడ్డంగా దొరికినా అదే ఎదురుదాడి !

వైసీపీ సిగ్గులేని రాజకీయాలు చేస్తుంది. అడ్డంగా దొరికిన తర్వాత కూడా ఎదురుదాడి చేసేందుకు ఏ మాత్రం సిగ్గుపడటం లేదు. తిరుమల శ్రీవారి ప్రసాదం లడ్డూలో నాణ్యత లేని నెయ్యిని.. పశువుల కొవ్వుతో కల్తీ...

తిరుప‌తి ల‌డ్డు చుట్టూ వివాదం… ఇంత‌కు ఈ ల‌డ్డూ ఎందుకింత స్పెష‌ల్?

తిరుప‌తి ల‌డ్డూ. తిరుమ‌ల‌లో శ్రీ‌వారి వెంక‌న్న ద‌ర్శ‌నాన్ని ఎంత మ‌హాభాగ్యంగా భావిస్తారో... తిరుప‌తి ల‌డ్డూను అంతే మ‌హాభాగ్యంగా భావిస్తారు. ఉత్త‌రాది, ద‌క్షిణాది అన్న తేడా ఉండ‌దు... ఆ రాష్ట్రం, ఈ రాష్ట్రం అన్న...

HOT NEWS

css.php
[X] Close
[X] Close