ర్యాంకులొచ్చాయి.. కానీ పెట్టుబడులేవి ?

ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో టాప్ పొజిషన్లో ఉన్నాయని కేరళ, ఏపీ వంటి రాష్ట్రాలను పొగిడేస్తున్నారు. మా ర్యాంక్ గల్లంతయిందని ఇదంతా కాంగ్రెస్ పుణ్యమేనని కేటీఆర్ ఆరోపించేస్తున్నారు. ఆ ర్యాంకులు ఇప్పటివి కాదు.. బీఆర్ఎస్ హయాంలోనివేనని కాంగ్రెస్ ఎదురుదాడి చేస్తోంది. ఈ ర్యాంకులు గొప్పగా ఉన్న సమయంలోనే ఈ ఏడాది వచ్చిన విదేశీ పెట్టుబడుల్లో ఏ రాష్ట్రానికి ఎంత వచ్చిందో కూడా ఓ లిస్ట్ బయటకు వచ్చింది. కానీ ఈ డూయింగ్ బిజినెస్ రాష్ట్రాలకు .. పెట్టుబడులే రాలేదు.

ఈ ఆర్థిక సంవత్సరంలో దేశానికి వచ్చిన మొత్తం విదేశీ పెట్టుబడుల్లో 52 శాతం మహారాష్ట్రకే వెళ్లాయి. మొత్తంగా 70, 795 కోట్ల రూపాయలు మహారాష్ట్రకు పెట్టుబడులుగా వచ్చాయి. కానీ ఈజ్ ఆఫ్ డూయింగ్ లో ఆ రాష్ట్రం టాప్ టెన్ లో లేదు. పెట్టుబడుల సాధనలో రెండో స్థానంలో కర్ణాటకకు రూ. 19,059 కోట్ల పెట్టుబడులు వచ్చాయి. దీనికీ డూయింగ్ బిజినెస్‌లో చోటు లేదు. పెట్టుబడుల సాధనలో మూడో స్థానంలో ఢిల్లీ కి కూడా టాప్ టెన్ లో చోటు లేదు.

ఈ ఆర్థిక సంవత్సరంలో ఇప్పటికే తెలంగాణకు విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు 9 వేల కోట్ల రూపాయలకుపైగా వచ్చాయి. నాలుగో స్థానంలో నిలిచింది. కానీ డూయింగ్ బిజినెస్ ర్యాంకుల్లో చోటు లేదు. టాప్ టెన్‌లో చివరిలో ఉన్నరాజస్థాన్‌కు వచ్చిన పెట్టుబడులు రూ. 311 కోట్లు మాత్రమే. అంటే మిగతా పందొమ్మిది రాష్ట్రాలకు ఆ మాత్రం పెట్టుబడులు కూడా రాలేదని అర్థం చేసుకోవచ్చు. అయితే ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో కేరళ ముందొచ్చినా.. టాప్ టెన్ పెట్టుబడులు ఆకర్షించిన రాష్ట్రాల్లో కేరళ లేదు. ఆంధ్రప్రదేశ్ కూడా లేదు. ర్యాంకులకు.. చదువుకు పొంతనలేదన్నట్లుగా.. ర్యాంకులకు పెట్టుబడులకు పెద్దగా సంబంధం ఉండటం లేదు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

మారుతికి ముందే తెలుసా?

రాజ్ తరుణ్ కి హ్యాట్రిక్ ఫ్లాపులు పడ్డాయి. రెండు నెలల వ్యవధిలో మూడు సినిమాలు రాజ్ నుంచి వచ్చాయి. పురుషోత్తముడు, తిరగబడరాస్వామి, భలే ఉన్నాడే. ఈ మూడు ఫ్లాపులే. భలే ఉన్నాడే చాలా...

బంగ్లాని లైట్ తీసుకోవద్దు బాసూ

ఇండియా - బంగ్లాదేశ్‌ టెస్ట్ సిరీస్ ఈనెల‌ 19 నుంచి ప్రారంభం కానుంది. డబ్ల్యూటీసీ 2023-25 సీజన్‌లో రాబోయే పది టెస్టులు టీమ్‌ఇండియాకు అత్యంత కీలకం. అందుకే ఈ సిరీస్ ప్రాధాన్యతని సంతరించుకుంది....

చిట్‌చాట్‌లతో BRSను చిరాకు పెడుతున్న రేవంత్ !

రేవంత్ రెడ్డి మీడియా ప్రతినిధులతో ఇష్టాగోష్టిగా మాట్లాడే మాటలు మీడియాలో హైలెట్ అవుతూంటాయి. వాటిని పట్టుకుని బీఆర్ఎస్ ఆవేశ పడుతోంది . అంతా అయిపోయిన తరవాత తీరిగ్గా.. నేను ఎప్పుడన్నాను అని రేవంత్...

ఢిల్లీ తర్వాత సీఎం కూడా కేజ్రీవాలే ?

ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ మంగళవారం రాజీనామా చేయబోతున్నారు. అదే రోజు ఢిల్లీ శాసనసభాపక్ష సమావేశం కూడా నిర్వహిస్తున్నారు. కొత్త సీఎంగా కేజ్రీవాల్ ఎవరికి చాన్సిస్తారన్నది హాట్ టాపిక్ గా మారింది. విచిత్రంగా...

HOT NEWS

css.php
[X] Close
[X] Close