టీవీ చానళ్లలో నాన్ స్టాప్ దువ్వాడ ఫ్యామిలీ బతుకు జట్కాబండి షో !

వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ కుటుంబాన్ని రోడ్డున పడేయడంలో మీడియా పాత్ర కీలకంగా మారింది. వాళ్ల కుటుంబంలో చిచ్చు చాలా రోజులుగా ఉంది. అంతర్గతంగా పరిష్కరించుకోవడానికి వారి పాట్లేవో వారు పడుతున్నారు. కానీ ఎప్పుడైతే ఈ అంశాన్ని మీడియా టేకప్ చేసిందో అప్పట్నుంచి ఆ కుటుంబం పరిస్థితి కల్లోలంగా మారిపోయింది.

దువ్వాడ కుమార్తె ఆయన ఇంటికి వెళ్లినప్పుడు.. మీడియా ప్రతినిధులు వెళ్లారు. అప్పటి నుంచి ప్రారంభమైన ఫ్యామిలీ సర్కస్ తో రాష్ట్ర వ్యాప్తంగా ఓ బతుకు జట్కాబండి తరహా షోని నడిపిస్తున్నారు. దువ్వాడ శ్రీవాణి దగ్గరకు వెళ్లి ఓ మైక్.. ఆమె అన్న మాటల్ని దివ్వెల మాధురీ దగ్గర చెప్పి మరో మైక్ పెట్టి కౌంటర్లు ఇప్పించి.. రాజుకునేలా చేస్తున్నారు. మధ్యలో అడల్టరీ గురించి చర్చలు పెట్టి న్యాయబద్దమో కాదో చెబుతున్నారు. చివరికి ఆ ఇద్దరు మహిళలకు పుట్టిన బిడ్డలు వారి తండ్రులకే పుట్టారో లేదో అని పరస్పరం ఆరోపణలు చేసుకునే వరకూ వ్యవహారం వెళ్లింది.

ఈ ఆరోపణల వ్యవహారం టీవీలకు టీఆర్పీల వేటకు పెద్ద ఆయుధంగా మారింది. జనాలు చూసేదే చూపిస్తామంటూ… దివ్వెల మాధురీ డాన్స్ వీడియోలు.. ఆమె అడల్టరీ గురించి.. తమ సంబంధాల గురించి దబాయించిన వైనం గురించి కథలు కథలుగా చెబుతున్నారు. ఇది చాలదన్నట్లుగా దువ్వాడ శ్రీను కూడా తెరపైకి వచ్చారు. ఇప్పుడీ సర్కార్ లో .. రింగ్ మాస్టర్లుగా టీవీ చానళ్లు మారిపోయాయి. ఇది చాలా దూరం వెళ్లేలా ఉంది. టీవీ చానళ్లు టీఆర్పీలు వస్తాయి కానీ దువ్వాడ కుటుంబం మాత్రం రోడ్డున పడింది. ఈ విషయాన్ని ఆయన గుర్తించలేకపోతున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

రిమాండ్ రిపోర్ట్: త‌ప్పు ఒప్పుకొన్న జానీ మాస్ట‌ర్‌

లైంగిక ఆరోప‌ణ‌లు ఎదుర్కొంటున్న జానీ మాస్ట‌ర్ ని ఉప్ప‌ర్ ప‌ల్లి కోర్టు 14 రోజుల రిమాండ్ విధించిన సంగ‌తి తెలిసిందే. ఆ త‌ర‌వాత జానీ మాస్ట‌ర్ ని చంచ‌ల్ గూడా జైలుకు త‌ర‌లించారు....

జానీ మాస్ట‌ర్ కేస్‌: సి.క‌ల్యాణ్ సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు

జానీ మాస్ట‌ర్ వ్య‌వ‌హారంపై ప్ర‌ముఖ నిర్మాత సి.క‌ల్యాణ్ స్పందించారు. కొన్ని సంచ‌ల‌న విష‌యాల్ని బ‌య‌ట‌పెట్టారు. ఈ కేసు వెనుక కొంత‌మంది కుట్ర ఉంద‌ని, ఆ విష‌యాల్ని త్వ‌ర‌లోనే బ‌య‌ట‌పెడ‌తాన‌ని ప్ర‌క‌టించారు. ప‌ద‌హారేళ్లుగా ఆ...

‘దేవ‌ర’ ప్ర‌మోష‌న్ల‌కు ఇదొక్క‌టి చాలు!

టాలీవుడ్ అంతటా 'దేవర' ఫీవర్ పాకేసింది. రిలీజ్ డేట్ దగ్గరపడుతుండటంతో మేక‌ర్స్ కూడా ప్రమోషన్స్ జోరు పెంచారు. ఎన్టీఆర్ అన్ని రాష్ట్రాల్లో ప్రమోషన్స్ నిర్వహిస్తూ, మీడియాతో, ఆడియన్స్ తో ఇంటరాక్ట్ అవుతున్నారు. మిగిలిన...

ల్యాబ్ కూడా లేదా…? సంచ‌ల‌న విష‌యాలు వెల్ల‌డించిన టీటీడీ ఈవో

తిరుమ‌లకు ఎన్నో ఏళ్లుగా నెయ్యి స‌ర‌ఫ‌రా అవుతూనే ఉంటుంది. పాలు కూడా వ‌స్తుంటాయి. వేల కోట్లు ఖ‌ర్చు చేసి బ‌య‌ట నుండి కొనుగోలు చేస్తుంటారు. కానీ అవి స‌రిగ్గా ఉన్నాయో లేదో ప‌రిశీలించేందుకు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close