రగిలిపోతున్న నార్త్ హిందూ సమాజం !

ఏం చేసినా జగన్ రెడ్డిని సమర్థించే అంధ వ్యక్తులు ఏపీలో ఉంటారేమో కానీ ఇతర రాష్ట్రాల్లో ఉండరు. ఆయన చేసిన మత మార్పిళ్లు.. ఆయన చేసిన హిందూ వ్యతిరేక కుట్రలు దేశం మొత్తం తెలుసు. ఇప్పుడు బయటపడ్డాయి . ఆ ఆగ్రహం అంత బయట కనిపిస్తోంది. అన్ని రాష్ట్రాల్లోనూ జగన్ రెడ్డికి వ్యతిరేకంగా ప్రదర్శనలు జరిగాయి. చెప్పులతో కొట్టడం.. శవయాత్రలు చేయడం వంటివి చేశారు. చేస్తున్నారు. హిందూద్రోహిగా జగన్ రెడ్డి నిలిచిపోయారు.

కాసుల కక్కుర్తితో జగన్ రెడ్డి దేనికైనా తెగిస్తారని ఇప్పుడు ఉత్తరాది ప్రజలు గట్టిగా నమ్ముతున్నారు. హిందూ సమాజాన్ని ఏపీలో నాశనం చేయడానికి ఆయన చేసిన ప్రయత్నాలపై కథలు కథలుగా మీడియా ప్రచారం చేస్తున్నారు. జగన్ రెడ్డి హయాంలో పెరిగిన చర్చిలు… మత మార్పిళ్లు ఇప్పుడు హాట్ టాపిక్ . తిరుమల వంటి ప్రసిద్ధ ఆలయాన్ని ఆయన రాజకీయ పునరావాస కేంద్రంగా మార్చడం.. తన కేసులు ఇతర విషయాల్లో కీలక వ్యక్తుల్ని ప్రభావితం చేయడానికి .. శ్రీవారిని ఉపయోగించుకున్న వైనం ఇప్పుడు హాట్ టాపిక్ అయింది.

అక్కడి హిందూ సమాజంలో వచ్చిన రియాక్షన్ చూసే…ఇతర కేంద్ర మంత్రులు అంతా స్పందించారు. కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. జాతీయ మీడియా అంతా చర్చోపచర్చలు నిర్వహించింది. ఇంకా జరుగుతున్నాయి కూడా. జగన్ రెడ్డి నిర్వాకం అంతా… ఇప్పుడు ఉత్తరాదిలో హాట్ టాపిక్ అవుతోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

దువ్వాడ హీరోగా “వాలంటీర్” – నిర్మాత దివ్వెల !

కళా పోషకురాలు అయిన దివ్వెల మాధురీ తన రాజా దువ్వాడ శ్రీనివాస్ హీరోగా ఓ సినిమా ను నిర్మించారు. ఆ సినిమా పేరు వాలంటీర్. క్యాచీగా ఉన్న టైటిల్ గా .....

తిరుప‌తి ల‌డ్డూ నెయ్యి క‌ల్తీ… స్పందించిన రాహుల్ గాంధీ

తిర‌మల వెంక‌న్న ల‌డ్డూ త‌యారీలో వాడిన నెయ్యి క‌ల్తీ అయ్యింద‌ని, అందులో జంతువుల కొవ్వు అవ‌శేషాలున్న‌ట్లు తేల‌టంపై స‌ర్వ‌త్రా విస్మ‌యం వ్య‌క్తం అవుతోంది. ఈ విష‌యంలో క‌ఠిన చ‌ర్య‌లు తీసుకోవాల‌ని అంద‌రూ డిమాండ్...

ఆదిమూలం కేసు అలా సెటిల్ – సస్పెన్షన్ ఎత్తేస్తారా ?

టీడీపీ ఎమ్మెల్యే ఆదిమూలంపై ఓ మహిళ చేసిన ఆరోపణల కేసు తేలిపోయింది. తాము రాజీకి వచ్చామని కేసు అవసరం లేదని ఆ మహిళ నేరుగా హైకోర్టుకు వచ్చి చెప్పింది. దీంతో హైకోర్టు కూడా...

హైదరాబాద్‌లో 18 శాతం పెరిగిన ఇళ్ల డిమాండ్

ఏపీలో టీడీపీ గెలవడం, హైడ్రా ఎఫెక్ట్ కారణంగా హైదరాబాద్‌లో ఇళ్ల అమ్మకాలు పడిపోయాయని జరుగుతున్న ప్రచారానికి వాస్తవనికి హస్తిమశకాంతరం ఉందని రిపోర్టులు వెల్లడిస్తున్నాయి. హైడ్రా దూకుడు చూపించిన ఆగస్టు నెలలో రూ. 4...

HOT NEWS

css.php
[X] Close
[X] Close