మచిలీపట్నం పోలీసులు తాపీ దాడి కేసును మెల్లగా మాజీ మంత్రి, టీడీపీ నేత కొల్లు రవీంద్ర వద్దకు తీసుకెళ్తున్నారు. ఆయనకు సెక్షన్ 91 కింద నోటీసులు పంపారు. విచారణకు హాజరు కావాలని ఆదేశించారు. హాజరు కాకపోతే అరెస్ట్ చేస్తామని చెబుతున్నారు. నాలుగు రోజుల కిందట… పేర్ని నానిపై ఆయన ఇంట్లోనే బడుగు నాగేశ్వరరావు అనే వ్యక్తి తాపీతో దాడి చేశాడు. తాను వైసీపీ కార్యకర్తనని… పేర్ని నాని అనుచరుడ్నని.. అయితే ఇసుక కొరత కారణంగా పనుల్లేవని.. ఈ కారణంగానే పేర్ని నానిపై దాడి చేసినట్లుగా నిందితుడు వాంగ్మూలం ఇచ్చారు. అయితే.. అప్పటి నుంచి రాజకీయ కోణం వెదుకుతున్న వైసీపీ నేతలు… హోంమంత్రి కూడా.. టీడీపీ నేతల ప్రమేయం ఉందని చెబుతూ వస్తున్నారు.
మూడు రోజుల నుంచి బడుగు నాగేశ్వరరావు కాల్ లిస్ట్ పరిశీలిస్తూనే ఉన్నారు. చివరికి కొల్లు రవీంద్రకు నోటీసులు జారీ చేశారు. నిజానికి బడుగు నాగేశ్వరరావు పేర్ని నానికి ముఖ్య అనుచరుడిగా ఉన్నారు. తల్లి దశదిన కర్మ రోజు.. పేర్ని నాని వెనుకే ఆయన ఉన్నట్లుగా వైసీపీ సోషల్ మీడియాలోనే ప్రచారం జరుగుతోంది. అన్ని అంశాల్లోనూ ఆయన వెంటే ఉన్నారని… పేర్ని ఏ కార్యక్రమం చేపట్టినా పాల్గొంటారని చెబుతూంటారు. అయితే ఇప్పుడు ఆయన వెనుక టీడీపీ ఉన్నారని.. వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. చివరికి కేసులో ఏం తేలినా తేలకపోయినా.. ప్రచారం చేసుకోవడానికి ఈ నోటీసులు ఉపయోగపడతాయన్న అంచనా కూడా ఉంది. కొల్లు రవీంద్ర ఐదేళ్ల పాటు మంత్రిగా ఉన్నారు.
కానీ ఎప్పుడూ విపక్ష నేతలపై కూడాదాడి జరగలేదు. కానీ.. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత పేర్ని నాని మంత్రి అయ్యాక.. అధికార పార్టీ నేతలపైనే దాడులు జరుగుతున్నాయి. వైసీపీ నేత హత్యకు గురయ్యారు. పేర్ని నానిపైనే దాడి జరిగింది. దీనంతటికి కొల్లు రవీంద్రనే కారణమనన్నట్లుగా ఆయన వైపే కేసుల్ని మళ్లిస్తున్నారన్న ఆరోపణలను టీడీపీ నేతలు చేస్తున్నారు.