మరో సారి చంద్రబాబు,లోకేష్ భద్రతపై కేంద్రం ఆరా !

ఏపీ పాలకులు ప్రత్యర్థుల్ని భౌతికంగా నిర్మూలించడానికి కూడా వెనుకాడని మనస్థత్వం ఉన్న వారు కావడంతో… కేంద్రం కూడా అప్రమత్తమవుతోంది. ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ చంద్రబాబు, లోకేష్ పర్యటనల్లో ఏర్పడుతున్న ఉద్రిక్త పరిస్థితులు, రాళ్ల దాడులు… వారి భద్రత విషయంలో పోలీసులు చూపిస్తున్న నిర్లక్ష్యం అంశాలపై దృష్టి పెట్టింది. చంద్రబాబు,లోకేశ్ ల కల్పించిన భద్రతపై నివేదిక ఇవ్వాలని కేంద్ర హోంశాఖ
ఏపీ సీఎస్, డీజీపీలకు కేంద్ర హోంశాఖ లేఖ రాసింది.

జెడ్ ప్లస్ కేటగిరీ సెక్యూరిటీ ఉన్న చంద్రబాబు కాన్వాయ్ పై ఇటీవల జరిగిన దాడులపై కేంద్రం తీవ్ర ఆగ్రహంతో ఉంది. లోకేశ్ పాదయాత్రలో కల్పిస్తున్న భద్రత వివరాలను కేంద్ర హోంశాఖ కోరింది. కేంద్ర హోంశాఖ నవంబర్ 4న చంద్రబాబు ర్యాలీపై రాళ్ల దాడిపై నివేదిక కోరింది. చంద్రబాబు, లోకేశ్ పర్యటనల్లో భద్రత కల్పించాలని డీజీపీ, సీఎస్‌కు కేంద్రం ఆదేశించింది. జులై 27న ఏపీ ప్రభుత్వానికి లేఖ రాసినట్లుగా తెలుస్తోంది. ఈ లేఖ గురించి రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి వివరణ ఇవ్వకముందే.. పుంగనూరులో చంద్రబాబు కాన్వాయ్‌పై రాళ్ల దాడులు జరగడం.. చర్చనీయాంశంగా మారింది.

చంద్రబాబు పర్యటనల్లో తరచూ ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడుతూండటంతో గత ఏడాది ఆగస్టులో చంద్రబాబు సెక్యూరిటీని రివ్యూ చేసిన ఎన్ఎస్‌జీ కొత్తగా మరో ఇరవై మంది కమెండోలతో భద్రత కల్పించాలని నిర్ణయించారు. అప్పటి వరకూ ఆయనకు జడ్ ప్లస్ కేటగిరి నిబంధనల ప్రకారం షిఫ్ట్‌కు ఎనిమిది మంది భద్రత కల్పించేవారు. ఏడాది నుంచి వారి సంఖ్యను మరో ఇరవై మందికి పెంచారు. అప్పటి వరకూ డీఎస్పీ ర్యాంక్ అధికారి పర్యవేక్షణలో ఆయన భద్రత ఉండేది. ఏడాది నుంచి డీఐజీ స్థాయి అధికారి భద్రతను పర్యవేక్షిస్తున్నారు. ఏపీలో రాజకీయ పరిస్థితులు అత్యంత దారుణంగా ఉన్నాయని… ప్రత్యర్థుల్ని భౌతికంగా నిర్మూరించడానికి కూడా వెనుకాడటంలేదని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

డి-ఏజింగ్… లాభమా? నష్టమా ?

సినిమాలో ఒక క్యారెక్టర్ బాల్యం, యవ్వనం, కౌమార, ప్రౌడ దశలని చూపించడం ఫిల్మ్ మేకర్స్ కి పెద్ద సవాల్. ఇందుకోసం హలీవుడ్ నుంచి కూడా మేకప్ మ్యాన్ లని దిగుమతి చేసుకునే వారు....

దువ్వాడ శ్రీనివాస్ ఇంట్లో దివ్వెల మాధురీ !

దువ్వాడ ఫ్యామిలీ డ్రామాలో కొత్త కొత్త ఎపిసోడ్లు ప్రారంభమవుతున్నాయి. కొద్ది రోజుల పాటు సైలెంట్ గా ఉంటానని చెప్పిన దివ్వెల మాధురీ.. ఒక్క సారిగా.. ఏకంగా దువ్వాడ శ్రీనివాస్ ఇంట్లోనే ప్రత్యక్షమయ్యారు. దువ్వాడ...

ఆ పడవలు నందిగం సురేష్ తాలూకానే !

ప్రకాశం బ్యారేజీకి వరద వస్తే ఈ మధ్య బోట్లు కొట్టుకు వస్తున్నాయి. బ్యారేజని డ్యామేజ్ చేస్తున్నాయి. అవి ఎలా వస్తున్నాయో తెలియడం లేదు. ఇప్పుడు మిస్టరీ బయటపడే అవకాశాలు కనిపిస్తున్నాయి. వైసీపీ రంగులేసిన...

శభాష్ నిమ్మల… అభినందించిన నారా లోకేష్

భారీ వర్షానికి తోడు బుడమేరకు పడిన గండ్లు విజయవాడను ముంచేత్తాయి. కనీవినీ ఎరుగని స్థాయిలో వరద పోటెత్తడంతో విజయవాడ గత ఆరు రోజులుగా వరదలో నానుతోంది. బుడమేరుకు పడిన గండ్లు పూడ్చితేనే విజయవాడకు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close