క్యాంప్ ఆఫీసును ప్రభుత్వానికి తిరిగిచ్చేసిన పవన్

డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ప్రభుత్వం విజయవాడలో ఇచ్చిన క్యాంప్ ఆఫీసును మళ్లీ ప్రభుత్వానికి ఇచ్చేశారు. ఆయన అక్కడి నుంచే అధికారిక సమీక్షలు నిర్వహిస్తున్నారు. అయితే పవన్ కల్యాణ్ క్యాంప్ ఆఫీస్ అక్కడ ఉండటం వల్ల వచ్చే జనంతో అనేక సమస్యలు వస్తున్నాయి. భవనానికి వెనుకాలే కోర్టుల సముదాయం ఉంది. అక్కడకు వెళ్లి వచ్చే వారికి పవన్ కల్యాణ్‌ రాకపోకలతో సమస్యలు వస్తున్నాయి. పవన్ వచ్చి వెళ్లేటప్పుడు ట్రాఫిక్‌ నిలిపేయడం, అధికారుల రాకపోకలతో కూడా కోర్టులకు వెళ్లే వచ్చే వాళ్లకు ఇబ్బందులు తప్పడం లేదన్న ఫీడ్ బ్యాక్ పవన్ కల్యాణ్‌కు వచ్చింది.

దాంతో పవన్ కల్యాణ్ మంగళగిరిలోని తన నివాసాన్ని క౧ద్ది కాలం క్యాంప్ ఆఫీసుగా మార్చుకోవాలని నిర్ణయించారు. గత కొద్ది రోజులుగా పార్టీ కార్యాలయంలో బస చేసే బిల్డింగ్‌లోనే సమీక్షలు నిర్వహిస్తున్నారు. దాన్నే క్యాంపు కార్యాలయంగా మార్చుకోవాలని చూస్తున్నారు. అందుకే అధికారికంగా తనకు కేటాయించిన భవనాన్ని ప్రభుత్వానికి తిరిగి ఇచ్చేశారు. మంగళగిరిలో జనసేన పార్టీ ఆఫీసు నిర్మాణం చురుగ్గా ాసగుతోంది.

ఐదు అంతస్తుల పార్టీ ఆఫీసులో మొదటి రెండు అంతస్తులు మరింత వేగంగా పూర్తి చేసి అందులోకి త్వరలో వెళ్లిపోవాలని చూస్తున్నారు. ఈ లోపు తాత్కాలిక క్యాంపు కార్యాలయంగా తను బస చేసే బిల్డింగ్‌ను వాడుకుంటున్నారు. క్యాంప్ ఆఫీసే అయినా జగన్ చేసినట్లుగా చేయకుండా ..ఒక్క రూపాయి కూడా ప్రజాధనాన్ని కేటాయింప చేసుకోకండా.. తన క్యాంప్ ఆఫీస్ ఏర్పాట్లు తానే చేసుకోవాలని పవన్ నిర్ణయించుకున్నారు. తనదిప్రైవేటు భవనం కావడంతో ఆ నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది. జగన్ పార్టీ కార్యాలయంగా మార్చిన క్యాంప్ ఆఫీసులో ప్రతి వస్తువు ప్రజాధనంతో కొన్నదే.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కుక్కల విద్యాసాగర్ కూడా పరారీ !

కేసులు నమోదైన ప్రతి ఒక్కరూ పరారీ అవుతున్నారు. తాము తప్పు చేయలేదని విచారణ ఎదుర్కొంటామని ఒక్కరూ ధైర్యంగా ముందుకు రావడం లేదు. తాజాగా ముంబై నటి జెత్వానీపై కుట్ర చేసిన కేసులో...

తెలంగాణ తల్లి విగ్రహం – కేటీఆర్‌ ఆన్సర్ ఏది ?

రాజీవ్ గాంధీ విగ్రహాన్ని తీసేస్తామని కేటీఆర్ ప్రకటంచి.. గొప్పగా బెదిరించానని అనుకుంటున్నారు. కానీ వచ్చే ఎన్నికల నాటికి రాజకీయ పరిస్థితులు ఎలా ఉంటాయో చెప్పడం కష్టం. అప్పుడు కాంగ్రెస్ తో పొత్తులో ఉంటే......

తగ్గుతున్న జగన్ భయం – ఏపీలో పెట్టుబడుల వెలుగులు !

ఐదేళ్ల అరాచక నీడ నుంచి ఏపీ ఇప్పుడిప్పుడే బయటపడుతోంది. ఎవరైనా రూపాయి పెట్టుబడితో రావాలంటే వణికిపోయే పరిస్థితి నుంచి మళ్లీ ఏపీలో పెట్టుబడులు పెడితే బెటరన్న ఆలోచనలకు పెట్టుబడిదారులు వస్తున్నారు. గుజరాత్...

బెజవాడ ప్రజలకు తోడు, నీడగా ప్రభుత్వం !

బుడమేరు ఉగ్రరూపం కారణంగా నష్టపోయిన బెజవాడ వాసులందరికీ ఆర్థిక పరమైన మద్దతు ఇవ్వడానికి చంద్రబాబు భారీ ప్యాకేజీ ప్రకటించారు. ముంపు ప్రాంతంలోని ప్రతి ఇంటికి ఆయన పరిహారం ప్రకటించారు. ప్రతి ఒక్క కుటుంబానికి...

HOT NEWS

css.php
[X] Close
[X] Close