నాగబాబు కోసం అనకాపల్లి కావాలంటున్న పవన్ !

టీడీపీతో పొత్తు ప్రస్తావన లేనప్పుడు తాను ఇక ఎన్నికల్లో పోటీ చేయబోనని పార్టీకి మాత్రమే పని చేస్తానని నాగబాబు ప్రకటించారు. ఇప్పుడు టీడీపీతో పొత్తుతో ఎక్కడ పోటీ చేసినా గెలుస్తామన్న నమ్మకం ఉండటంతో ఆయన మనసు మార్చుకున్నట్లుగా కనిపిస్తోంది. అనకాపల్లి నుంచి నాగబాబును పోటీ చేయించాలని పవన్ కల్యాణ్ ఆలోచిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఇప్పటికే కాకినాడ, మచిలీపట్నం స్థానాలను జనసేనకు కేటాయించారు. ఆ స్థానాలకు అభ్యర్థులను కూడా ఖరారు చేశారు. వైసీపీ నుంచి వచ్చిన బాలశౌరికి మచిలీపట్నం, సాన సతీష్ కుమార్ కు కాకినాడ ఇస్తారని చెబుతున్నారు.

ఇప్పుడు అనకాపల్లి కూడా కావాలని పవన్ అడుగుతున్నట్లుగా చెబుతున్నారు. అనకాపల్లి స్థానం కోసం టీడీపీలోనే చాలా పోటీ ఉంది. బైరి దిలీప్ చక్రవర్తి అనే నేతకు చంద్రబాబు సీటు కన్ఫర్మ్ చేశారని అంటున్నారు. కానీ చింతకాలయ విజయ్ గట్టిగా ప్రయత్నిస్తున్నారు. ఇప్పుడు నాగబాబు రంగంలోకి వస్తున్నారు. దీంతో అనకాపల్లి వ్యవహారం హాట్ హాట్ గా మారే అవకాశం కనిపిస్తోంది. నాగబాబు ఇప్పటికే విశాఖ చేరుకున్నారు. ఆయనకు సోదరుడు హామీ ఇచ్చి ఉంటారన్న చర్చ జరుగుతోంది.

గతంలో నర్సాపురం నుంచి నాగబాబు పోటీ చేశారు. నర్సాపురం పొత్తుల్లో ఏ పార్టీకి వెళ్తే ఆ పార్టీ నుంచి రఘురామ పోటీ చేస్తారు. అందుకే అక్కడ చాన్స్ లేదు. మెగా ఫ్యామిలీ నుంచి చిరంజీవి మాత్రం ఒక్క సారిగా ఎమ్మెల్యే గా గెలిచారు. మరో చోట ఓడిపోయారు. తర్వాత ఎవరు పోటీ చేసినా గెలవడం లేదు. ఈ సారి పవన్ తో పాటు నాగబాబు కూడా ప్రజాప్రతినిధి అవ్వాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లుగా తెలుస్తోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

డి-ఏజింగ్… లాభమా? నష్టమా ?

సినిమాలో ఒక క్యారెక్టర్ బాల్యం, యవ్వనం, కౌమార, ప్రౌడ దశలని చూపించడం ఫిల్మ్ మేకర్స్ కి పెద్ద సవాల్. ఇందుకోసం హలీవుడ్ నుంచి కూడా మేకప్ మ్యాన్ లని దిగుమతి చేసుకునే వారు....

దువ్వాడ శ్రీనివాస్ ఇంట్లో దివ్వెల మాధురీ !

దువ్వాడ ఫ్యామిలీ డ్రామాలో కొత్త కొత్త ఎపిసోడ్లు ప్రారంభమవుతున్నాయి. కొద్ది రోజుల పాటు సైలెంట్ గా ఉంటానని చెప్పిన దివ్వెల మాధురీ.. ఒక్క సారిగా.. ఏకంగా దువ్వాడ శ్రీనివాస్ ఇంట్లోనే ప్రత్యక్షమయ్యారు. దువ్వాడ...

ఆ పడవలు నందిగం సురేష్ తాలూకానే !

ప్రకాశం బ్యారేజీకి వరద వస్తే ఈ మధ్య బోట్లు కొట్టుకు వస్తున్నాయి. బ్యారేజని డ్యామేజ్ చేస్తున్నాయి. అవి ఎలా వస్తున్నాయో తెలియడం లేదు. ఇప్పుడు మిస్టరీ బయటపడే అవకాశాలు కనిపిస్తున్నాయి. వైసీపీ రంగులేసిన...

శభాష్ నిమ్మల… అభినందించిన నారా లోకేష్

భారీ వర్షానికి తోడు బుడమేరకు పడిన గండ్లు విజయవాడను ముంచేత్తాయి. కనీవినీ ఎరుగని స్థాయిలో వరద పోటెత్తడంతో విజయవాడ గత ఆరు రోజులుగా వరదలో నానుతోంది. బుడమేరుకు పడిన గండ్లు పూడ్చితేనే విజయవాడకు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close