23 నుంచి ‘వీర‌మ‌ల్లు’ సెట్లో ప‌వ‌న్

రాజ‌కీయాల కోసం సినిమాల‌కు తాత్కాలికంగా బ్రేక్ ఇచ్చిన ప‌వ‌న్ క‌ల్యాణ్‌, ఇప్పుడు మ‌ళ్లీ మేక‌ప్ వేసుకోనున్నారు. ఆయ‌న చేతిలో మూడు సినిమాలున్నాయి. ‘ఉస్తాద్ భ‌గ‌త్ సింగ్‌’, ‘ఓజీ’తో పాటు ‘హ‌రిహ‌ర వీర‌మ‌ల్లు’ షూటింగ్ ని పూర్తి చేయాల్సివుంది. వీటిలో ‘వీర‌మ‌ల్లు’కు తొలి ప్రాధాన్యం ఇచ్చారు ప‌వ‌న్‌. ఈనెల 23 నుంచి ‘వీర‌మ‌ల్లు’ షూటింగ్ పునః ప్రారంభం కానుంది. ఓ యాక్ష‌న్ సీన్‌తో కొత్త షెడ్యూల్ ప్రారంభించ‌నున్నారు. ఈ షెడ్యూల్ లో ప‌వ‌న్ క‌ల్యాణ్ పాల్గొన‌బోతున్నారు. హాలీవుడ్ స్టంట్ మాస్ట‌ర్ నిక్ పావెల్ ఆధ్వ‌ర్యంలో భారీ యుద్ధ స‌న్నివేశాన్ని తెర‌కెక్కించ‌నున్నారు. సుమారు 400 మంది జూనియ‌ర్ ఆర్టిస్టులు, ఫైట‌ర్లు, కీల‌క తారాగ‌ణం ఈ షూటింగ్ లో పాలు పంచుకోనుంది.

క్రిష్ గైర్హాజ‌రీతో జ్యోతికృష్ణ ఈ చిత్రానికి ద‌ర్శ‌క‌త్వ బాధ్య‌త‌లు నిర్వ‌హిస్తున్నారు. ఆస్కార్ విజేత కీర‌వాణి సంగీతాన్ని స‌మ‌కూరుస్తున్నారు. బాబీ డియోల్, అనుప‌మ్ ఖేర్‌ కీల‌క పాత్రలు పోషిస్తున్నారు. నిధి అగ‌ర్వాల్ క‌థానాయిక‌. పాన్ ఇండియా స్థాయిలో 2025 వేస‌విలో ఈ చిత్రాన్ని ప్రేక్ష‌కుల ముందుకు తీసుకురావ‌డానికి ద‌ర్శ‌క నిర్మాత‌లు స‌న్నాహాలు చేస్తున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

‘దేవ‌ర’ ప్ర‌మోష‌న్ల‌కు ఇదొక్క‌టి చాలు!

టాలీవుడ్ అంతటా 'దేవర' ఫీవర్ పాకేసింది. రిలీజ్ డేట్ దగ్గరపడుతుండటంతో మేక‌ర్స్ కూడా ప్రమోషన్స్ జోరు పెంచారు. ఎన్టీఆర్ అన్ని రాష్ట్రాల్లో ప్రమోషన్స్ నిర్వహిస్తూ, మీడియాతో, ఆడియన్స్ తో ఇంటరాక్ట్ అవుతున్నారు. మిగిలిన...

ల్యాబ్ కూడా లేదా…? సంచ‌ల‌న విష‌యాలు వెల్ల‌డించిన టీటీడీ ఈవో

తిరుమ‌లకు ఎన్నో ఏళ్లుగా నెయ్యి స‌ర‌ఫ‌రా అవుతూనే ఉంటుంది. పాలు కూడా వ‌స్తుంటాయి. వేల కోట్లు ఖ‌ర్చు చేసి బ‌య‌ట నుండి కొనుగోలు చేస్తుంటారు. కానీ అవి స‌రిగ్గా ఉన్నాయో లేదో ప‌రిశీలించేందుకు...

తిరుమ‌ల ల‌డ్డూ వివాదం… తీవ్రంగా స్పందించిన కేంద్ర‌మంత్రులు

తిరుమ‌ల‌లో శ్రీ‌వారి ల‌డ్డూ త‌యారీలో వాడే నెయ్యిలో జంతువుల కొవ్వు ఆనవాళ్లు ఉన్న‌ట్లు తేల‌టంపై దేశ‌వ్యాప్తంగా దుమారం రేపుతోంది. ఇప్పటికే హిందూ ధార్మిక సంస్థ‌లు తీవ్రంగా స్పందించ‌గా, తాజాగా కేంద్ర‌మంత్రులు ఘ‌ట‌న‌పై విస్మ‌యం...

23 నుంచి ‘వీర‌మ‌ల్లు’ సెట్లో ప‌వ‌న్

రాజ‌కీయాల కోసం సినిమాల‌కు తాత్కాలికంగా బ్రేక్ ఇచ్చిన ప‌వ‌న్ క‌ల్యాణ్‌, ఇప్పుడు మ‌ళ్లీ మేక‌ప్ వేసుకోనున్నారు. ఆయ‌న చేతిలో మూడు సినిమాలున్నాయి. 'ఉస్తాద్ భ‌గ‌త్ సింగ్‌', 'ఓజీ'తో పాటు 'హ‌రిహ‌ర వీర‌మ‌ల్లు' షూటింగ్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close