వైఎస్ జయంతికి కూడా ఖర్చు వైసీపీ క్యాడర్‌కే !

వైఎస్ 75వ జయంతిని ఘనంగా నిర్వహిస్తామని మాజీ మంత్రి పేర్ని నాని ప్రకటించారు. ఆయన ప్రకటన చూసి అందరూ షర్మిల చేయబోతున్న కార్యక్రమం కంటే పెద్ద ప్రోగ్రామ్ ఏదో ప్లాన్ చేశారని అనుకున్నారు. కానీ వైసీపీ క్యాడర్ అంతా కలిసి సేవా కార్యక్రమాలు చేపట్టాలట. మొక్కలు నాటడం, రక్తదానం, పుస్తకాల పంపిణీ వంటివి చేయాలని పార్టీ నేతలకు పేర్ని నాని పిలుపునిచ్చారు. వైఎస్సార్ ను ఆరాధించేవాళ్లు ఈ కార్యక్రమాల్లో పాల్గొనవచ్చని బంపర్ ఆఫర్ కూడా ఇచ్చారు.

పేర్ని నాని పిలుపును బట్టి చూస్తే.. వైసీపీ హైకమాండ్.. వైఎస్‌ను ఏదో ఫోటోకు దండేసి దండం పెట్టి సర్దుకుంటుందని అర్థమైపోతుంది. పార్టీ శ్రేణలు మాత్రం ఘనంగా చేయాలని సేవా కార్యక్రమాలు చేయాలని పిలుపునిచ్చారు. వైఎస్ పేరుతో ఐదేళ్లు అధికారం అనుభవించిన జగన్ ఒక్క రూపాయి ఖర్చు పెట్టరు కానీ.. పార్టీ క్యాడర్ కు మాత్రం..వైఎస్ పేరుతో అన్నీ పంచేయాలని పిలుపునిస్తున్నారు. మరో వైపు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఈ సారి వైఎస్ కు పూర్తి స్థాయి గౌరవం ఇచ్చేలా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.

ఎనిమిదో తేదీన విజయవాడలో భారీ వేడుక ేర్పాటు చేశారు. వైఎస్ ఆత్మీయులందర్నీ ఆహ్వానించారు. రాహుల్, సోనియా వస్తారని ప్రచారం చేస్తున్నారు. కానీ వారు వస్తారా లేదా అన్నది ఇంకా క్లారిటీ లేదు. అలాగే రేవంత్, సిద్దరామయ్య, డీకే శివకుమార్ వంటి వారిని కూడా ఆహ్వానించారు. వారి రాకపైనా స్పష్టత లేదు. అయితే హైకమాండ్ నుంచి ఓ కీలక నేత వస్తారని మాత్రం గట్టి నమ్మకంతో ఉన్నారు. షర్మిల ఆ రేంజ్ లో చేస్తూంటే… జగన్ మాత్రం.. పార్టీ క్యాడర్ కే ఆ ఆఫర్ ఇచ్చేశారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కడపకు ఉపఎన్నికలు వస్తే ప్రచారం చేస్తా : రేవంత్ రెడ్డి

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి షర్మిల కోసం నేరుగా రంగంలోకి దిగుతానని ప్రకటించారు. మంగళగిరిలోని సీకే కన్వెన్షన్ హాల్లో నిర్వహించిన వైఎస్ జయంతి సభలో రేవంత్ రెడ్డి ప్రసంగించారు. కడపకు ఉప...

బీజేపీతో అంటకాగేవాళ్లు వైఎస్ వారసులా ? : షర్మిల

వైఎస్ రాజశేఖర్ రెడ్డి 75వ జయంతి కార్యక్రమంలో ఆయనకు తానే రాజకీయ వారసురాలినని షర్మిల నేరుగా సందేశం ఇచ్చారు. ఇవ్వాళ YSR వారసుడు అని చెప్పుకొనే వాళ్ళు BJP...

డ్ర‌గ్స్‌పై పోరుకు టాలీవుడ్ సిద్ధం

డ్ర‌గ్స్ మహ‌మ్మారిని త‌రిమికొట్టేలా తెలంగాణ రాష్ట్ర ప్ర‌భుత్వం ప్ర‌త్యేక చ‌ర్య‌లు తీసుకొంటోంది. డ్ర‌గ్స్‌పై ప్ర‌జ‌ల్లో అవ‌గాహ‌న క‌ల్పించ‌డానికి కొత్త మార్గాల్ని అన్వేషిస్తోంది. ఈ ఉద్య‌మంలో చిత్ర‌సీమ కూడా పాలుపంచుకోవాల‌ని ఇటీవ‌ల తెలంగాణ సీఎం...

అడుసు తొక్కనేలా.. కోర్టుల చుట్టూ తిరగనేలా?

వైసీపీ నేతలు ఒక్కొక్కరుగా హైకోర్టు వైపు పరుగులు పెడుతున్నారు. ఒకరు ముందస్తు బెయిల్ కావాలని.. మరొకరు అరెస్ట్ చేయకుండా ఆదేశాలు ఇవ్వాలని.. ఇంకొందరూ అదే లైన్ లో ఉన్నారు. వరుసగా వైసీపీ నేతలు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close