పింక్ బాల్ టెస్ట్‌: తొలిరోజే 13 వికెట్లు

ప్ర‌పంచంలోనే అతి పెద్ద క్రికెట్ స్టేడియం.. మొతేరాలో జ‌రుగుతున్న పింక్ బాల్ టెస్ట్ లో బౌల‌ర్లు ఆధిప‌త్యం చ‌లాయిస్తున్నారు. తొలి రోజే 13 వికెట్లు కూల‌డం… అందుకు నిద‌ర్శ‌నం. టాస్ గెలిచి బ్యాటింగ్ చేప‌ట్టిన ఇంగ్లండ్ ఏ ద‌శ‌లోనూ భార‌త బౌల‌ర్ల ధాటికి నిల‌వ‌లేక‌పోయింది. కేవ‌లం 112 ప‌రుగుల‌కే ఆలౌట్ అయ్యింది. భార‌త బౌల‌ర్ల‌లో అక్ష‌ర్ ప‌టేల్ ఆరు వికెట్లు తీసుకున్నాడు. అనంత‌రం బ్యాటింగ్ చేప‌ట్టిన భార‌త్.. తొలి రోజు ఆట ముగిసే స‌మ‌యానికి మూడు వికెట్ల న‌ష్టానికి 99 ప‌రుగులు చేసింది. రోహిత్ శ‌ర్మ (57 బ్యాటింగ్‌), రెహానే (3 బ్యాటింగ్) క్రీజులో ఉన్నారు.

పిచ్ తీరుచూస్తుంటే.. రోజులు గ‌డుస్తున్న కొద్దీ.. బ్యాటింగ్ చేయ‌డం క‌ష్టంగా క‌నిపిస్తోంది. భార‌త్ క‌నీసం 100 ప‌రుగుల ఆధిక్యం సంపాదించినా ఈ మ్యాచ్ పై ప‌ట్టు సాధించవ‌చ్చు. నాలుగో ఇన్నింగ్స్ లో ఎంత త‌క్కువ టార్గెట్ నిర్దేశిస్తే.. భార‌త విజ‌యం అంత సుల‌భం అవుతుంది. నాలుగో ఇన్నింగ్స్ లో 200 ప‌రుగుల టార్గెట్ అయినా ఛేదించ‌డం క‌ష్టం అవుతుంద‌ని నిపుణులు భావిస్తున్నారు. తొలి రోజే స్పిన్న‌ర్ల‌కు అనుకూలించిన ఈ పిచ్‌, పేస్ బౌల‌ర్ల‌కూ చ‌క్క‌గా స‌హ‌క‌రిస్తోంది. రెండో రోజు ఉద‌యం… పిచ్ బ్యాటింగ్ కి అనుకూలంగా ఉంటుంది. ఆ త‌ర‌వాత‌.. బౌల‌ర్ల‌కు స‌హ‌రించే అవ‌కాశం ఉంది. రోహిత్ క్రీజ్ లో ఉండ‌డం, పంత్ ఫామ్ లో ఉండ‌డం భార‌త్‌కు ఊర‌ట క‌లిగించే విష‌యాలు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

డి-ఏజింగ్… లాభమా? నష్టమా ?

సినిమాలో ఒక క్యారెక్టర్ బాల్యం, యవ్వనం, కౌమార, ప్రౌడ దశలని చూపించడం ఫిల్మ్ మేకర్స్ కి పెద్ద సవాల్. ఇందుకోసం హలీవుడ్ నుంచి కూడా మేకప్ మ్యాన్ లని దిగుమతి చేసుకునే వారు....

దువ్వాడ శ్రీనివాస్ ఇంట్లో దివ్వెల మాధురీ !

దువ్వాడ ఫ్యామిలీ డ్రామాలో కొత్త కొత్త ఎపిసోడ్లు ప్రారంభమవుతున్నాయి. కొద్ది రోజుల పాటు సైలెంట్ గా ఉంటానని చెప్పిన దివ్వెల మాధురీ.. ఒక్క సారిగా.. ఏకంగా దువ్వాడ శ్రీనివాస్ ఇంట్లోనే ప్రత్యక్షమయ్యారు. దువ్వాడ...

ఆ పడవలు నందిగం సురేష్ తాలూకానే !

ప్రకాశం బ్యారేజీకి వరద వస్తే ఈ మధ్య బోట్లు కొట్టుకు వస్తున్నాయి. బ్యారేజని డ్యామేజ్ చేస్తున్నాయి. అవి ఎలా వస్తున్నాయో తెలియడం లేదు. ఇప్పుడు మిస్టరీ బయటపడే అవకాశాలు కనిపిస్తున్నాయి. వైసీపీ రంగులేసిన...

శభాష్ నిమ్మల… అభినందించిన నారా లోకేష్

భారీ వర్షానికి తోడు బుడమేరకు పడిన గండ్లు విజయవాడను ముంచేత్తాయి. కనీవినీ ఎరుగని స్థాయిలో వరద పోటెత్తడంతో విజయవాడ గత ఆరు రోజులుగా వరదలో నానుతోంది. బుడమేరుకు పడిన గండ్లు పూడ్చితేనే విజయవాడకు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close