ఎన్నికలకు ముందు చింతమనేనిని జైల్లో పెట్టే ప్లాన్ ఫెయిల్..!

పశ్చిమగోదావరి జిల్లా దెందులూరు నియోజకవర్గంలో పంచాయతీ ఎన్నికలు హాట్ టాపిక్ అవుతున్నాయి. మొదటి విడతలో జరగాల్సిన ఎన్నికలు… అధికారులు సహకరించకపోవడం వల్ల నాలుగో విడతకు వాయిదా వేశారు. ఇప్పుడు నాలుగో విడత ఎన్నికలకు వచ్చేశాయి. దెందులూరు నియోజకవర్గంలో పంచాయతీల్లో గెలిచి… తన ఓటమి ప్రజలు ఇచ్చింది కాదని.. ఈవీఎంలదేనని నిరూపించాలన్న పట్టుదలతో చింతమనేని ఉన్నారు. గత కొద్ది రోజులుగా అన్ని పంచాయతీలు చుట్టబెట్టేస్తున్నారు. భారీ హంగామా నేపధ్యంలో ప్రచారం చేస్తున్నారు.

చింతమనేని అలా తిరిగితే.. పంచాయతీల్లో వైసీపీ అనుకూల ఫలితాలు రావడం కష్టమని అనుకున్నారేమో కానీ ఆయనను అర్థరాత్రి అరెస్ట్ చేసేశారు. ఓ గ్రామంలో చింతమనేని ప్రచారం చేసి వెళ్లిన తర్వాత వైసీపీ వర్గీయులు టీడీపీ వాళ్లతో గొడవ పడ్డారు. దాన్నే పోలీసులు కాస్త మార్చుకుని చింతమనేని సర్పంచ్ అభ్యర్థిపై దాడి చేశారని.. సాక్షి మీడియాలో ప్రచారం చేసి పోలీసులు కేసు పెట్టి అర్థరాత్రి అరెస్ట్ చేసి తీసుకెళ్లారు. ఆయనను న్యాయమూర్తి ముందు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రవేశపెట్టారు. పోలీసులు ఎలాంటి ఆధారాలు చూపించకపోవడంతో .. నోటీసులు ఇచ్చి స్టేషన్ బెయిల్ ఇవ్వాలని న్యాయమూర్తి పోలీసుల్ని ఆదేశించారు. దాంతో వదిలి పెట్టక తప్పలేదు.

అయితే చింతమనేని తనను అక్రమంగా అరెస్ట్ చేశారని… తాను స్టేషన్ నుంచి వెళ్లబోనని భీష్మించారు. పోలీసులు ఆయనను బలవంతంగా వ్యాన్‌లో ఎక్కించుకుని ఇంటి దగ్గర విడిచిపెట్టి ఊపిరి పీల్చుకున్నారు. చింతమేనని జైల్లో పెట్టి ఎన్నికలు నిర్వహించాలనుకున్న వైసీపీ ప్లాన్ వర్కవుట్ కాలేదని టీడీపీ నేతలు అంటున్నారు. ఇప్పటికే చింతమనేనిపై ఎన్నో కేసులు పెట్టారు. రెండున్నర నెలలు జైల్లో పెట్టారు. ఆ తర్వాత కూడా చింతమనేని ప్రమేయం లేకపోయినా.. ఎవరెవరిద్వారానో ఫిర్యాదు చేయించి కేసులు నమోదు చేసిన ఘటనలు కూడా ఉన్నాయి. అయినా చింతమనేని వెనక్కితగ్గకుండా పంచాయతీ పోరు సాగిస్తున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

డి-ఏజింగ్… లాభమా? నష్టమా ?

సినిమాలో ఒక క్యారెక్టర్ బాల్యం, యవ్వనం, కౌమార, ప్రౌడ దశలని చూపించడం ఫిల్మ్ మేకర్స్ కి పెద్ద సవాల్. ఇందుకోసం హలీవుడ్ నుంచి కూడా మేకప్ మ్యాన్ లని దిగుమతి చేసుకునే వారు....

దువ్వాడ శ్రీనివాస్ ఇంట్లో దివ్వెల మాధురీ !

దువ్వాడ ఫ్యామిలీ డ్రామాలో కొత్త కొత్త ఎపిసోడ్లు ప్రారంభమవుతున్నాయి. కొద్ది రోజుల పాటు సైలెంట్ గా ఉంటానని చెప్పిన దివ్వెల మాధురీ.. ఒక్క సారిగా.. ఏకంగా దువ్వాడ శ్రీనివాస్ ఇంట్లోనే ప్రత్యక్షమయ్యారు. దువ్వాడ...

ఆ పడవలు నందిగం సురేష్ తాలూకానే !

ప్రకాశం బ్యారేజీకి వరద వస్తే ఈ మధ్య బోట్లు కొట్టుకు వస్తున్నాయి. బ్యారేజని డ్యామేజ్ చేస్తున్నాయి. అవి ఎలా వస్తున్నాయో తెలియడం లేదు. ఇప్పుడు మిస్టరీ బయటపడే అవకాశాలు కనిపిస్తున్నాయి. వైసీపీ రంగులేసిన...

శభాష్ నిమ్మల… అభినందించిన నారా లోకేష్

భారీ వర్షానికి తోడు బుడమేరకు పడిన గండ్లు విజయవాడను ముంచేత్తాయి. కనీవినీ ఎరుగని స్థాయిలో వరద పోటెత్తడంతో విజయవాడ గత ఆరు రోజులుగా వరదలో నానుతోంది. బుడమేరుకు పడిన గండ్లు పూడ్చితేనే విజయవాడకు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close