అసెంబ్లీలోనూ రఘురామపై తిట్లదండకం..!

ఎంపీ రఘురామకృష్ణరాజు అనుచిత వ్యాఖ్యలు చేశారని అదే విద్వేషం అని రాజద్రోహం కేసు పెట్టిన ప్రభుత్వం.. సొంత ఎమ్మెల్యేతో తిట్ల దండకం వినిపించింది. అసెంబ్లీలో పెడన ఎమ్మెల్యే జోగి రమేష్ గవర్నర్‌ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై మాట్లాడేందుకు అవకాశం పొందారు. ఆ అవకాశాన్ని ఆయన పూర్తిగా రఘురామకృష్ణరాజును తిట్టేందుకే వినియోగించుకున్నారు. అత్యంత దారుణమైన భాషలో మాట్లాడారు. వాస్తవానికి సభలో లేని.. సభకు సంబంధం లేని వ్యక్తుల గురించి అసెంబ్లీలో మాట్లాడకూడదు. అదో నైతిక నియమం. కానీ.. జోగి రమేష్ మాత్రం.. ఇష్టారీతిన మాట్లాడారు. అనాల్సిన మాటలు అన్నీ అనేసిన తర్వాత … ఆయనకు నిబంధనలు గుర్తుకు వచ్చాయి.

ఆయన మాట్లాడుతున్నంత సేపు వైసీపీ సభ్యులు చిరు వదనంతో చూస్తూనే ఉన్నారు. ముఖ్యమంత్రి జగన్ కూడా.. సంతోషంతోనే ఉన్నారు. స్పీకర్ కూడా.. జోగి రమేష్ ఏదో ప్రజా సమస్యపై సీరియస్‌గా మాట్లాడుతున్నట్లుగా చూస్తూ కూర్చున్నారు. అంతా మాట్లాడేసిన తర్వాత జోగి రమేషే.. స్పీకర్‌కు బాధ్యత గుర్తు చేశారు. వేరే సభలో సభ్యుడి గురించి అసెంబ్లీలో విమర్శించడం తప్పు అని తానే చెప్పుకుని.. స్పీకర్‌కు ఓ ఆఫర్ ఇచ్చారు. నేను మాట్లాడినదాంట్లో తప్పుంటే రికార్డుల నుంచి తొలగించాలని.. కోరారు. జోగి రమేష్ ప్రసంగానికి అబ్బురపడిన సీఎం జగన్ కూడా స్పందించారు. జోగి రమేష్‌కు థాంక్యూ చెప్పాలి, అభినందించాలన్నారు.

ఎందుకంటే.. తిట్టిన తిట్లకు ధ్యాంక్యూ… అలాగే..రికార్డుల నుంచి తొలగించాలని స్వయంగా కోరినందుకు అభినందనలు అన్నమాట. జోగి రమేష్ బాధలో ఆప్యాయత కనిపించిందని సీఎం జగన్‌ వాత్సల్యం చూపించారు. ఇంత జరిగిన తర్వాత కూడా.. ఆ మాటలను రికార్డుల నుంచి తొలగించారో లేదో క్లారిటీ లేదు. మొత్తానికి వైసీపీ బ్రాండ్ అంటే.. ఎక్కడైనా తిట్ల దండకం అందుకోవడమేనని జోగి రమేష్ మరోసారి నిరూపించినట్లయిందన్న విమర్శలు మాత్రం వినిపిస్తున్నాయి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

డి-ఏజింగ్… లాభమా? నష్టమా ?

సినిమాలో ఒక క్యారెక్టర్ బాల్యం, యవ్వనం, కౌమార, ప్రౌడ దశలని చూపించడం ఫిల్మ్ మేకర్స్ కి పెద్ద సవాల్. ఇందుకోసం హలీవుడ్ నుంచి కూడా మేకప్ మ్యాన్ లని దిగుమతి చేసుకునే వారు....

దువ్వాడ శ్రీనివాస్ ఇంట్లో దివ్వెల మాధురీ !

దువ్వాడ ఫ్యామిలీ డ్రామాలో కొత్త కొత్త ఎపిసోడ్లు ప్రారంభమవుతున్నాయి. కొద్ది రోజుల పాటు సైలెంట్ గా ఉంటానని చెప్పిన దివ్వెల మాధురీ.. ఒక్క సారిగా.. ఏకంగా దువ్వాడ శ్రీనివాస్ ఇంట్లోనే ప్రత్యక్షమయ్యారు. దువ్వాడ...

ఆ పడవలు నందిగం సురేష్ తాలూకానే !

ప్రకాశం బ్యారేజీకి వరద వస్తే ఈ మధ్య బోట్లు కొట్టుకు వస్తున్నాయి. బ్యారేజని డ్యామేజ్ చేస్తున్నాయి. అవి ఎలా వస్తున్నాయో తెలియడం లేదు. ఇప్పుడు మిస్టరీ బయటపడే అవకాశాలు కనిపిస్తున్నాయి. వైసీపీ రంగులేసిన...

శభాష్ నిమ్మల… అభినందించిన నారా లోకేష్

భారీ వర్షానికి తోడు బుడమేరకు పడిన గండ్లు విజయవాడను ముంచేత్తాయి. కనీవినీ ఎరుగని స్థాయిలో వరద పోటెత్తడంతో విజయవాడ గత ఆరు రోజులుగా వరదలో నానుతోంది. బుడమేరుకు పడిన గండ్లు పూడ్చితేనే విజయవాడకు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close