ర‌వితేజ పారితోషికం తీసుకోవ‌డం లేదా?

ర‌వితేజ పారితోషికం ఇప్పుడు ప‌రిశ్ర‌మ‌లో హాట్ టాపిక్‌. హిట్టూ, ఫ్లాపుతో సంబంధం లేకుండా సినిమా సినిమాకీ పారితోషికం పెంచుకొంటూపోతున్నాడు. రెండేళ్ల క్రితం ర‌వితేజ పారితోషికం రూ.12 నుంచి రూ.15 కోట్లు. ఇప్పుడు అది రూ.30 కోట్ల‌కు చేరింది. ర‌వితేజ – గోపీచంద్ మ‌లినేని సినిమా పారితోషికం స‌మ‌స్య‌తోనే ఆగిపోయింది. ర‌వితేజకు రూ.30 కోట్లు ఇవ్వ‌లేమని మైత్రీ మూవీస్ చేతులు ఎత్తేసింది.

పారితోషికం విష‌యంలో ఏమాత్రం రాజీ ప‌డ‌ని ర‌వితేజ‌.. ఇప్పుడు పారితోషికం లేకుండానే ఓ సినిమా చేసేస్తున్నాడు. అదే.. ‘మిస్ట‌ర్ బ‌చ్చ‌ర్‌’. బాలీవుడ్ లో ఘ‌న విజ‌యం సాధించిన `రైడ్‌` చిత్రానికి ఇది రీమేక్‌. హ‌రీష్ శంక‌ర్ ద‌ర్శ‌కుడు. పీపుల్ మీడియా ఫ్యాక్ట‌రీ నిర్మిస్తోంది. ఈ సినిమాని కేవ‌లం 45 రోజుల్లో పూర్తి చేయాల‌న్న‌ది టీమ్ నిర్ణ‌యం. పైగా ద‌ర్శ‌కుడు, హీరో.. ఇద్ద‌రూ పారితోషికం తీసుకోవ‌డం లేదు. వీళ్ల‌కు లాభాల్లో వాటా ద‌క్కుతుంది. ర‌వితేజకి ఓ సొంత బ్యాన‌ర్ ఉంది. సో.. త‌ను కూడా ఓ నిర్మాతే. ఈ క‌థలో సింహ‌భాగం ఓ పెద్ద సెట్లో జ‌రుగుతుంది. ప్రొడ‌క్ష‌న్ కాస్ట్ ప‌రంగానూ జాగ్ర‌త్త‌లు తీసుకొంటే కేవ‌లం శాటిలైట్‌, డిజిట‌ల్ రైట్స్ తోనే టేబుల్ ప్రాఫిట్ ద‌క్కించుకోవొచ్చు. ఆ త‌ర‌వాత ఎంతొచ్చినా అది బోన‌సే. ర‌వితేజ ఇలా పారితోషికం విష‌యంలో కాస్త వెసులుబాటు క‌ల్పిస్తే… నిర్మాత‌లు హ్యాపీ!

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

డి-ఏజింగ్… లాభమా? నష్టమా ?

సినిమాలో ఒక క్యారెక్టర్ బాల్యం, యవ్వనం, కౌమార, ప్రౌడ దశలని చూపించడం ఫిల్మ్ మేకర్స్ కి పెద్ద సవాల్. ఇందుకోసం హలీవుడ్ నుంచి కూడా మేకప్ మ్యాన్ లని దిగుమతి చేసుకునే వారు....

దువ్వాడ శ్రీనివాస్ ఇంట్లో దివ్వెల మాధురీ !

దువ్వాడ ఫ్యామిలీ డ్రామాలో కొత్త కొత్త ఎపిసోడ్లు ప్రారంభమవుతున్నాయి. కొద్ది రోజుల పాటు సైలెంట్ గా ఉంటానని చెప్పిన దివ్వెల మాధురీ.. ఒక్క సారిగా.. ఏకంగా దువ్వాడ శ్రీనివాస్ ఇంట్లోనే ప్రత్యక్షమయ్యారు. దువ్వాడ...

ఆ పడవలు నందిగం సురేష్ తాలూకానే !

ప్రకాశం బ్యారేజీకి వరద వస్తే ఈ మధ్య బోట్లు కొట్టుకు వస్తున్నాయి. బ్యారేజని డ్యామేజ్ చేస్తున్నాయి. అవి ఎలా వస్తున్నాయో తెలియడం లేదు. ఇప్పుడు మిస్టరీ బయటపడే అవకాశాలు కనిపిస్తున్నాయి. వైసీపీ రంగులేసిన...

శభాష్ నిమ్మల… అభినందించిన నారా లోకేష్

భారీ వర్షానికి తోడు బుడమేరకు పడిన గండ్లు విజయవాడను ముంచేత్తాయి. కనీవినీ ఎరుగని స్థాయిలో వరద పోటెత్తడంతో విజయవాడ గత ఆరు రోజులుగా వరదలో నానుతోంది. బుడమేరుకు పడిన గండ్లు పూడ్చితేనే విజయవాడకు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close