భూముల అమ్మకాల్లో స్కాంపై సీబీఐకి రేవంత్ ఫిర్యాదు !

కోకాపేట, ఖానామెట్ గ్రామాల్లో ప్రభుత్వం వేలం వేసిన భూములన్నీ మైహోం, వాటి అనుబంధ సంస్థలు, టీఆర్ఎస్‌ నేతలకు అత్యంత సన్నిహితంగా ఉండే రియల్ ఎస్టేట్ వ్యాపార సంస్థలు కొనుగోలు చేయడంపై రేవంత్ రెడ్డి అవినీతి ఆరోపణలు చేస్తున్నారు. రాహుల్ ను కలిసేందుకు ఢిల్లీ వెళ్లిన ఆయన తరవాత సీబీఐ డైరక్టర్‌ను నేరుగా కలిసి భూముల అమ్మకాలపై విచారణ జరపాలని విజ్ఞప్తి పత్రం ఇచ్చారు. రూ. వెయ్యి కోట్ల స్కాం జరిగిందన్న ఆధారాలు కూడా ఇచ్చానని రేవంత్ రెడ్డి ప్రకటించారు.

భూముల స్కాంలో ప్రధానంగా మై హోం రామేశ్వర్రావుతో పాటుగా సీఎస్‌ సోమేశ్‌కుమార్‌, సీనియర్ ఐఏఎస్లు జయేశ్ రంజన్, అర్వింద్ కుమారులు ఉన్నారని రేవంత్ అంటున్నారు. సిద్దిపేట కలెక్టర్‌ వెంకట్రామిరెడ్డి కుటుంబ సభ్యుల పేరిట ఉన్న రాజ్పుష్ప కంపెనీ పేరుతోనూ తక్కువకు భూములు కొనుగోలు చేశారని సీబీఐకి ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నట్లుగా రేవంత్ స్పష్టం చేశారు. రూ.3 వేల కోట్లు రావాల్సిన భూములను, రూ.2 వేల కోట్లకే పరిమితం చేశారని సీబీఐకి ఇచ్చిన లేఖలో వివరించారు. ఎకరం రూ. 60 కోట్లకు అమ్మిన భూమి తప్ప మిగతా భూమికంతా మళ్ళీ టెండర్లు పిలవాలని రేవంత్ డిమాండ్ చేస్తున్నారు.

రేవంత్ రెడ్డి ఫిర్యాదు చేసినంత మాత్రాన.. ఒక వేళ పక్కా ఆధారాలు ఉన్నా దర్యాప్తు చేయడానికి సీబీఐకి అధికారం లేదు. కోర్టులైనా ఆదేశించాలి లేకపోతే తెలంగాణ ప్రభుత్వమే సిఫార్సు చేయాలి. ఆ రెండు జరిగే పరిస్థితి లేదు. అందుకే బీజేపీ నేతలను రేవంత్ ఇన్వాల్వ్ చేస్తున్నారు. బీజేపీ నేతలు బండి సంజయ్, కిషన్ రెడ్డి ఎప్పుడూ కేసీఆర్ అవినీతి గురించి ప్రశ్నిస్తారు కానీ కేంద్ర దర్యాప్తు సంస్థలకు ఫిర్యాదు చేయరని.. వారు వారు ఒకేటనని విమర్శించారు. బీజేపీ కి చిత్తశుద్ధి ఉంటే మోడీ,అమిత్ షాలతో చెప్పి అవినీతిపై విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. లేకపోతే ఎన్ని పాదయాత్రలు చేసినా ప్రజలు నమ్మరని స్పష్టం చేశారు. ఐఏఎస్ అధికారులపై సీబీఐ విచారణ.. అలాగే భూముల వేలం నిర్వహించిన సంస్థపై విచారణకు రాష్ట్ర ప్రభుత్వ అనుమతి అవసరం లేదన్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

డి-ఏజింగ్… లాభమా? నష్టమా ?

సినిమాలో ఒక క్యారెక్టర్ బాల్యం, యవ్వనం, కౌమార, ప్రౌడ దశలని చూపించడం ఫిల్మ్ మేకర్స్ కి పెద్ద సవాల్. ఇందుకోసం హలీవుడ్ నుంచి కూడా మేకప్ మ్యాన్ లని దిగుమతి చేసుకునే వారు....

దువ్వాడ శ్రీనివాస్ ఇంట్లో దివ్వెల మాధురీ !

దువ్వాడ ఫ్యామిలీ డ్రామాలో కొత్త కొత్త ఎపిసోడ్లు ప్రారంభమవుతున్నాయి. కొద్ది రోజుల పాటు సైలెంట్ గా ఉంటానని చెప్పిన దివ్వెల మాధురీ.. ఒక్క సారిగా.. ఏకంగా దువ్వాడ శ్రీనివాస్ ఇంట్లోనే ప్రత్యక్షమయ్యారు. దువ్వాడ...

ఆ పడవలు నందిగం సురేష్ తాలూకానే !

ప్రకాశం బ్యారేజీకి వరద వస్తే ఈ మధ్య బోట్లు కొట్టుకు వస్తున్నాయి. బ్యారేజని డ్యామేజ్ చేస్తున్నాయి. అవి ఎలా వస్తున్నాయో తెలియడం లేదు. ఇప్పుడు మిస్టరీ బయటపడే అవకాశాలు కనిపిస్తున్నాయి. వైసీపీ రంగులేసిన...

శభాష్ నిమ్మల… అభినందించిన నారా లోకేష్

భారీ వర్షానికి తోడు బుడమేరకు పడిన గండ్లు విజయవాడను ముంచేత్తాయి. కనీవినీ ఎరుగని స్థాయిలో వరద పోటెత్తడంతో విజయవాడ గత ఆరు రోజులుగా వరదలో నానుతోంది. బుడమేరుకు పడిన గండ్లు పూడ్చితేనే విజయవాడకు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close