మహిళా దినోత్సవం సందర్భంగా ఈ రోజు విశాఖలో నిర్వహించాలనుకున్న ‘స్త్రీ స్వేచ్ఛ’ సభను వర్మ వాయిదా వేస్తున్నట్టు దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ప్రకటించాడు. శ్రీదేవి విషాద మరణం తనపై చాలా ప్రభావం చూపిన కారణంగా సభను వాయిదా వేస్తున్నట్టు ఆయన సోషల్ మీడియాలో పేర్కొన్నారు. అతి త్వరలో సభను నిర్వహించే కొత్త తేదీ ప్రకటిస్తానని చెప్పారు. అంతటితో ఆగితే వర్మను ‘న్యూస్ మేకర్’ అనడం ఎందుకు? ఏదో మెలిక పెడతారు కదా! మహిళల దినోత్సవం మీద తనదైన శైలిలో సెటైర్స్ వేశారు. ఏడాదిలో ఒక్క రోజు మాత్రమే మహిళా దినోత్సవంగా సెలెబ్రేట్ చేయడం ఆడవాళ్లను విమర్శించడమేనని అన్నారు. దీనికి అర్థం మిగతా 365 రోజులు మగవాళ్ల రోజులు అనే కదా అని పాయింట్ తీశారు. అంతే కాదు… ప్రతి రోజు మహిళా దినోత్సవమని నేను బలంగా విశ్వసిస్తున్నానని వర్మ ట్వీట్ చేశారు. అందువల్లే మగవాళ్లకు ఏ రోజూ సెలెబ్రేట్ చేసుకునే అర్హత లేదని, మెన్స్ డే లేదని మహిళలకు శుభాకాంక్షలు తెలిపారు.