పంత్‌ సెంచరీ.. చాలా ప్రత్యేకం

బంగ్లాదేశ్‌తో తొలి టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో టీమిండియా వికెట్ కీపర్ రిషభ్‌ పంత్ సెంచరీ కొట్టాడు. 128 బంతుల్లో109 పరుగులు సాధించాడు. ఈ శతకం పంత్ కి చాలా స్పెషల్. భారత్‌ తరఫున వికెట్‌ కీపర్లలో అత్యధిక సెంచరీలు సాధించిన క్రికెటర్ల జాబితాలో ధోనీని పంత్ సమం చేశాడు. ధోనీ 144 ఇన్నింగ్స్‌ల్లో ఆరు శతకాలు చేయగా.. పంత్ మాత్రం 58 ఇన్నింగ్స్‌ల్లోనే పూర్తి చేశాడు.

రికార్డులు పరంగానే కాదు.. ఈ సెంచరీ పంత్ పునరాగమనంకు గొప్ప ఉత్తేజాన్ని ఇచ్చింది. కొన్నేళ్ళ క్రితం రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డాడు పంత్. చాలా రోజుల పాటు మంచానికే పరిమితమయ్యాడు. తను వున్న కండీషన్ లో అతడు మళ్ళీ ఎప్పుడు నడుస్తాడో అనుకున్నారంతా. త్వరగా కోల్కొవాలని ప్రార్ధనలు చేశారు. కోలుకున్నప్పటికీ మళ్ళీ మైదానంలో రాణించగలడా అనే సందేహాలు.

ఆటగాళ్ళుకి చిన్న చిన్న గాయాలే కెరీర్ కి పుల్ స్టాప్ పడేలా చేసేస్తాయి. అలాంటింది పంత్ కి మేజర్ యాక్సిడెంట్ జరిగింది. మల్టిఫుల్ ఫ్రాక్చర్స్ అయ్యాయి. అయితే తన విల్ పవర్ తో మళ్ళీ మైదానంలో అడుగుపెట్టాడు. ఐపీఎల్ లో ఢిల్లీకి సారధ్యం వహించాడు. అదే దూకుడు చూపించాడు.

అయితే ఇంటర్నేషనల్ క్రికెట్ డిఫరెంట్ బాల్ గేమ్. అందులో టెస్ట్ క్రికెట్ అసలు సిసలైన ఆటకి పరీక్ష. అలాంటి టెస్ట్ క్రికెట్ లో మళ్ళీ సెంచరీ కొట్టి.. అంతర్జాతీయ మ్యాచులు ఆడేందుకు తను వందశాతం ఫిట్ గా వున్నాని చాటి చెప్పాడు పంత్.

ఇక ఈ మ్యాచ్ విషయానికి భారత్‌ తన రెండో ఇన్నింగ్స్‌ను 287/4 స్కోరు వద్ద డిక్లేర్‌ చేసింది. బంగ్లాదేశ్‌ ఎదుట 515 పరుగులను టార్గెట్‌గా నిర్దేశించింది. భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 376 పరుగులు చేయగా.. బంగ్లాదేశ్‌ 149 పరుగులకే ఆలౌటైన సంగతి తెలిసిందే.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

అశోక్ గల్లా హీరోగా సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ నిర్మిస్తున్న చిత్రం పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభం

ఒక వైపు అగ్ర కథానాయకులతో భారీ చిత్రాలు చేస్తూనే, మరోవైపు యువ ప్రతిభను ప్రోత్సహిస్తూ వైవిధ్యమైన చిత్రాలను నిర్మిస్తున్న ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ తాజాగా మరో కొత్త చిత్రాన్ని ప్రారంభించింది....

ఆ మూడో సినిమా ఏమిటి శేష్‌..?!

కెరీర్‌ని చాలా ప‌ద్ధ‌తిగా నిర్మించుకొంటున్న హీరోల్లో అడ‌విశేష్ ముందు వ‌రుస‌లో ఉంటాడు. థ్రిల్ల‌ర్‌, యాక్ష‌న్‌, ఫిక్ష‌న్‌... ఇలా అన్ని ర‌కాల క‌థ‌ల్నీ ఎంచుకొంటున్నాడు. త‌న నుంచి సినిమా వ‌స్తోందంటే ఓ ర‌క‌మైన అటెన్ష‌న్...

బీజేపీకి టెస్టులు పెడుతున్న కేటీఆర్ !

చంద్రబాబును తిట్టకపోతే మీరు మనుషులే కాదని బీజేపీ నేత్లని జగన్ రెడ్డి ఎలా బ్లాక్ మెయిల్ చేస్తున్నారో.. కేటీఆర్ కూడా అదే మాదిరిగా బీజేపీ నేతలకు టెస్టులు పెడుతున్నారు. తాను చెప్పినట్లుగా...

జగన్ ఫర్నీచర్ ఎప్పుడు తిరిగిస్తారు ?

తిరుమల లడ్డూ వివాదంపై జగన్ రెడ్డి పెట్టిన ప్రెస్మీట్ చూసిన వారికి..గతంలో ఆయన సీఎంగా పెట్టిన ప్రెస్మీట్లు చూసిన వారికి పెద్ద తేడా కనిపించదు. ఎందుకంటే అప్పుడు ఏ సమావేశ మందిరంలో...

HOT NEWS

css.php
[X] Close
[X] Close