ఈడీ నోటీసులపై కేసీఆర్‌తో రోహిత్ రెడ్డి చర్చలు !

ఎమ్మెల్యేల కొనుగోలు కేసు వ్యవహారంలో కీలకంగా వ్యవహరంచి బీజేపీని ఇరుకున పెట్టిన పైలట్ రోహిత్ రెడ్డికి ఈడీ నోటీసులు జారీ చేయడంపై సీఎం కేసీఆర్ కూడా ప్రత్యేకంగా దృష్టి పెట్టారు. శుక్రవారం ఢిల్లీ నుంచి వచ్చిన ఆయన శనివారం పైలట్ రోహిత్ రెడ్డికి సమయం ఇచ్చారు. ముందుగా భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయానికి వెళ్లి… బండి సంజయ్‌కు సవాల్ చేసిన ఆయన తర్వాత నేరుగా ప్రగతి భవన్‌కు వెళ్లారు. ఈడీ తనకు జారీ చేసిన నోటీసుల్ని కేసీఆర్ కు చూపించారు. ప్రగతి భవన్ నుంచే ఆ నోటీసుల విషయంలో న్యాయనిపుణులతో సంప్రదింపులు జరిపినట్లుగా తెలుస్తోంది.

ఈడీ ఇచ్చిన నోటీసుల్లో ఎక్కడా ఫలానా కేసు అని లేకపోవడంతో పాటు.. అన్ని ఆస్తుల వివరాలు… కంపెనీల బ్యాలెన్స్ షీట్లు.. ఐటీ రిటర్నులు తీసుకు రావాలని అడిగారని.. అంటున్నారు. తాము ఇచ్చిన వివరాల్లో ఏమైనా లోపం ఉంటే..వాటితోనే తమపై కేసులు పెట్టేందుకు ప్రయత్నిస్తున్నారన్న అనుమానాలను పైలట్ వర్గం వ్యక్తీకరిస్తోంది. అందుకే న్యాయనిపుణుల అభిప్రాయాలు తీసుకుని .. ఈడీ విచారణకు వెళ్లాలా వద్దా అన్న ఆలోచన చేస్తున్నారని అంటున్నారు.

ఈడీ జారీ చేసిన నోటీసులు చట్ట పరంగా లేనందున కోర్టుకు వెళ్లి స్టే తెచ్చుకుంటే ఎలా ఉంటుందన్న దానిపైనా రోహిత్ రెడ్డి ఆలోచనలు చేస్తున్నారు. అయితే రోహిత్ రెడ్డికి ఎంతో సమయం లేదు. 19వ తేదీనే ఆయన హాజరు కావాల్సి ఉంది. ఆదివారంకోర్టులు పని చేయవు. సోమవారం ఈడీ ఎదుట హాజరు కావాల్సి ఉంది. ఆ రోజున డుమ్మా కొట్టి కోర్టుకెళ్తే ఎలా ఉంటుందనేది న్యాయనిపుణులతో సంప్రదింపులు జరుపుతున్నారు. అసలు నోటీసులు ఇచ్చింది హైదరాబాద్ డ్రగ్స్ కేసా.. కర్ణాటక డ్రగ్స్ కేసా అన్నదానిపై స్పష్టత లేదు. కర్ణఆటక డ్రగ్స్ కేసుపై ఇంత వరకూ ఈడీ కేసు నమోదు చేయలేదు. టాలీవుడ్ డ్రగ్స్ కేసులో మాత్రం ఈడీ విచారణ జరుపుతోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

డి-ఏజింగ్… లాభమా? నష్టమా ?

సినిమాలో ఒక క్యారెక్టర్ బాల్యం, యవ్వనం, కౌమార, ప్రౌడ దశలని చూపించడం ఫిల్మ్ మేకర్స్ కి పెద్ద సవాల్. ఇందుకోసం హలీవుడ్ నుంచి కూడా మేకప్ మ్యాన్ లని దిగుమతి చేసుకునే వారు....

దువ్వాడ శ్రీనివాస్ ఇంట్లో దివ్వెల మాధురీ !

దువ్వాడ ఫ్యామిలీ డ్రామాలో కొత్త కొత్త ఎపిసోడ్లు ప్రారంభమవుతున్నాయి. కొద్ది రోజుల పాటు సైలెంట్ గా ఉంటానని చెప్పిన దివ్వెల మాధురీ.. ఒక్క సారిగా.. ఏకంగా దువ్వాడ శ్రీనివాస్ ఇంట్లోనే ప్రత్యక్షమయ్యారు. దువ్వాడ...

ఆ పడవలు నందిగం సురేష్ తాలూకానే !

ప్రకాశం బ్యారేజీకి వరద వస్తే ఈ మధ్య బోట్లు కొట్టుకు వస్తున్నాయి. బ్యారేజని డ్యామేజ్ చేస్తున్నాయి. అవి ఎలా వస్తున్నాయో తెలియడం లేదు. ఇప్పుడు మిస్టరీ బయటపడే అవకాశాలు కనిపిస్తున్నాయి. వైసీపీ రంగులేసిన...

శభాష్ నిమ్మల… అభినందించిన నారా లోకేష్

భారీ వర్షానికి తోడు బుడమేరకు పడిన గండ్లు విజయవాడను ముంచేత్తాయి. కనీవినీ ఎరుగని స్థాయిలో వరద పోటెత్తడంతో విజయవాడ గత ఆరు రోజులుగా వరదలో నానుతోంది. బుడమేరుకు పడిన గండ్లు పూడ్చితేనే విజయవాడకు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close