జగన్ రాజకీయ అజ్ఞాని..షర్మిల అలా తేల్చేస్తున్నారా?

రాజకీయాల్లో షర్మిల కంటే జగన్ చాలా సీనియర్. ఓసారి ముఖ్యమంత్రిగా కూడా పని చేసిన అనుభవం ఉంది. అలాంటి జగన్ వేస్తోన్న రాజకీయ అడుగులు ఆయనకు కనీస రాజకీయ అనుభవం లేదన్న అంచనాకు వచ్చేలా చేస్తున్నాయి. కారణం షర్మిల. అవును.. జగన్ రాజకీయ అవగాహనారాహిత్యాన్ని షర్మిల భూతద్దంలో చూపిస్తున్నారు. అదే సమయంలో రాజకీయం ఎలా చేయాలో తనను చూసి నేర్చుకో అనేలా ఆమె వ్యూహాత్మక రాజకీయం చేస్తున్నారు.

వైసీపీ అధికారం కోల్పోయి రెండు నెలలు కూడా కాలేదు. అప్పుడే ఢిల్లీకి వెళ్లి శాంతి భద్రతల పేరుతో జగన్ ధర్నాకు దిగారు. ఇప్పటికప్పుడు కొత్త సర్కార్ పై ఎదురుదాడి చేస్తే ప్రజల నుంచి ఎలాంటి పాజిటివ్ రియాక్షన్ ఉండదు. ఇప్పటికప్పుడు కొత్త ప్రభుత్వంపై అంతా ఈజీగా వ్యతిరేకత వచ్చే అవకాశం లేదు. కానీ, జగన్ ఐదేళ్ళు అధికారం లేకుండా ఉండటం ఎలా అని అప్పుడే మధనపడుతున్నట్టు కనిపిస్తున్నారు.

Also Read : జగన్ కు ఝలక్..ఢిల్లీలో ధర్నాకు ఆ ఎమ్మెల్సీలు దూరం!?

ఏపీలో రాష్ట్రపతి పాలన విధించాలని డిమాండ్ చేస్తున్నారు. ఢిల్లీకి వెళ్లి చేస్తోన్న కార్యక్రమం పూర్తిగా పార్టీ కార్యక్రమమే తప్ప ప్రజలకు ప్రయోజనం చేకూర్చే నిరసన కాదని ప్రజలకు అర్థమైంది. ఇదే విషయాన్ని వైఎస్ షర్మిల చెబుతున్నారు. శాంతి భద్రతలపై ఢిల్లీలో ధర్నాకు సిద్దమైన జగన్.. భారీ వర్షాలకు పంట నష్టపోయిన రైతుల విషయంలో ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు.

నిజమే.. ఈ విషయంలో కూటమి సర్కార్ ను ప్రశ్నించేందుకు ఇదొక మంచి టాపిక్. కానీ, జగన్ ఈ సబ్జెక్ట్ ను వదిలేసి ఏమాత్రం ప్రజామోదితం లేని అంశంపై ధర్నాకు దిగారు. దీంతో రాజకీయ వ్యూహకర్తలు పక్కనలేకుంటే జగన్ కు ఏ అంశంపై రాజకీయం చేస్తే ప్రజల నుంచి పాజిటివ్ రియాక్షన్ వస్తుందో కూడా తెలియని రాజకీయ అజ్ఞాని అని షర్మిల తన నిర్ణయాల ద్వారా తెలియజేస్తున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

మారుతికి ముందే తెలుసా?

రాజ్ తరుణ్ కి హ్యాట్రిక్ ఫ్లాపులు పడ్డాయి. రెండు నెలల వ్యవధిలో మూడు సినిమాలు రాజ్ నుంచి వచ్చాయి. పురుషోత్తముడు, తిరగబడరాస్వామి, భలే ఉన్నాడే. ఈ మూడు ఫ్లాపులే. భలే ఉన్నాడే చాలా...

బంగ్లాని లైట్ తీసుకోవద్దు బాసూ

ఇండియా - బంగ్లాదేశ్‌ టెస్ట్ సిరీస్ ఈనెల‌ 19 నుంచి ప్రారంభం కానుంది. డబ్ల్యూటీసీ 2023-25 సీజన్‌లో రాబోయే పది టెస్టులు టీమ్‌ఇండియాకు అత్యంత కీలకం. అందుకే ఈ సిరీస్ ప్రాధాన్యతని సంతరించుకుంది....

చిట్‌చాట్‌లతో BRSను చిరాకు పెడుతున్న రేవంత్ !

రేవంత్ రెడ్డి మీడియా ప్రతినిధులతో ఇష్టాగోష్టిగా మాట్లాడే మాటలు మీడియాలో హైలెట్ అవుతూంటాయి. వాటిని పట్టుకుని బీఆర్ఎస్ ఆవేశ పడుతోంది . అంతా అయిపోయిన తరవాత తీరిగ్గా.. నేను ఎప్పుడన్నాను అని రేవంత్...

ఢిల్లీ తర్వాత సీఎం కూడా కేజ్రీవాలే ?

ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ మంగళవారం రాజీనామా చేయబోతున్నారు. అదే రోజు ఢిల్లీ శాసనసభాపక్ష సమావేశం కూడా నిర్వహిస్తున్నారు. కొత్త సీఎంగా కేజ్రీవాల్ ఎవరికి చాన్సిస్తారన్నది హాట్ టాపిక్ గా మారింది. విచిత్రంగా...

HOT NEWS

css.php
[X] Close
[X] Close