జగన్ కు సోనియా గాంధీ ఫోన్…వైసీపీ వ్యూహం ఇదేనా..?

వైసీపీ అధినేత జగన్ ను ఏఐసీసీ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ సంప్రదించారా..? ఇండియా కూటమికి మద్దతు ఇవ్వాలని జగన్ ను ఆమె అభ్యర్థించారా..?అనే అంశంపై ఏపీ రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది.

సెంట్రల్ లో ఈసారి ఏ పార్టీ సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే మెజార్టీ రాకపోవడంతో ఇండియా కూటమి కూడా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేలా ప్రయత్నాలు చేసింది. ఇందులో భాగంగా ఎన్డీయే కూటమిలో కింగ్ మేకర్ లుగా మారిన టీడీపీ, జేడీయూలను కాంగ్రెస్ అగ్రనేతలు సంప్రదించారని ఈ క్రమంలోనే ఏపీలో నాలుగు సీట్లను గెలుచుకున్న వైసీపీని కూడా కాంగ్రెస్ సంప్రదించినట్లుగా ప్రచారం జరుగుతోంది.

సోనియా గాంధీ స్వయంగా జగన్ కు ఫోన్ చేశారని, ఇండియా కూటమికి మద్దతు ఇవ్వాలని కోరారనే టాక్ నడుస్తోంది. అందుకు జగన్ సున్నిహితంగా తిరస్కరించారని అంటున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో కేంద్రంలోని ఎన్డీయే కూటమికి జగన్ వ్యతిరేకంగా వ్యవహరిస్తే ఎలాంటి చిక్కులు ఎదుర్కొంటారో ఆయనకు తెలియనిది కాదు. అందుకే భవిష్యత్ రాజకీయాల దృష్ట్యా ఈ ప్రతిపాదనను జగన్ తిరస్కరించారని అంటున్నారు.

అయితే, కేవలం నాలుగు సీట్లను మాత్రమే గెలుచుకున్న జగన్ ను సోనియా గాంధీ సంప్రదించే అవకాశం ఉందా..? అదే సమయంలో జగన్ ను పార్టీ పెద్దలు సంప్రదిస్తే షర్మిల ఊరుకునేవారా..? అంటే రాజకీయాల్లో ఇలాంటి వాటిని కొట్టిపారేయలేం కానీ, షర్మిలను సంప్రదించకుండా జగన్ ను కాంగ్రెస్ నేతలు సంప్రదించే అవకాశం ఎంతమాత్రం లేదు.

జగన్ ను సోనియా గాంధీ సంప్రదించారని జరుగుతోన్న ప్రచారమే నిజమైతే షర్మిల నుంచి ఏదో ఒక రియాక్షన్ వచ్చి ఉండేదని…ప్రస్తుతం ఆలాంటిదేమీ లేకపోవడంతో ఈ ప్రచారంలో ఎంతమాత్రం వాస్తవం లేదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అయితే, ఈ ప్రచారాన్ని వైసీపీ నేతలే కావాలని ఉద్దేశ పూర్వకంగా ప్రచారం చేస్తున్నారనే సందేహాలు వ్యక్తం అవుతున్నాయి.

కేంద్రంలో కింగ్ మేకర్ గా టీడీపీ మారడంతో జగన్ తో కాంగ్రెస్ సంప్రదింపుల అంశాన్ని తెరమీదకు తీసుకొస్తే…బీజేపీ పెద్దలు జగన్ కు కూడా ప్రాధాన్యత ఇస్తారనే వ్యూహంలో భాగంగా ఈ ప్రచారం మొదలు పెట్టారన్న టాక్ వినిపిస్తోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

డి-ఏజింగ్… లాభమా? నష్టమా ?

సినిమాలో ఒక క్యారెక్టర్ బాల్యం, యవ్వనం, కౌమార, ప్రౌడ దశలని చూపించడం ఫిల్మ్ మేకర్స్ కి పెద్ద సవాల్. ఇందుకోసం హలీవుడ్ నుంచి కూడా మేకప్ మ్యాన్ లని దిగుమతి చేసుకునే వారు....

దువ్వాడ శ్రీనివాస్ ఇంట్లో దివ్వెల మాధురీ !

దువ్వాడ ఫ్యామిలీ డ్రామాలో కొత్త కొత్త ఎపిసోడ్లు ప్రారంభమవుతున్నాయి. కొద్ది రోజుల పాటు సైలెంట్ గా ఉంటానని చెప్పిన దివ్వెల మాధురీ.. ఒక్క సారిగా.. ఏకంగా దువ్వాడ శ్రీనివాస్ ఇంట్లోనే ప్రత్యక్షమయ్యారు. దువ్వాడ...

ఆ పడవలు నందిగం సురేష్ తాలూకానే !

ప్రకాశం బ్యారేజీకి వరద వస్తే ఈ మధ్య బోట్లు కొట్టుకు వస్తున్నాయి. బ్యారేజని డ్యామేజ్ చేస్తున్నాయి. అవి ఎలా వస్తున్నాయో తెలియడం లేదు. ఇప్పుడు మిస్టరీ బయటపడే అవకాశాలు కనిపిస్తున్నాయి. వైసీపీ రంగులేసిన...

శభాష్ నిమ్మల… అభినందించిన నారా లోకేష్

భారీ వర్షానికి తోడు బుడమేరకు పడిన గండ్లు విజయవాడను ముంచేత్తాయి. కనీవినీ ఎరుగని స్థాయిలో వరద పోటెత్తడంతో విజయవాడ గత ఆరు రోజులుగా వరదలో నానుతోంది. బుడమేరుకు పడిన గండ్లు పూడ్చితేనే విజయవాడకు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close