రైతు భరోసాపై సర్కార్ కీలక ప్రకటన

రెండు లక్షల రుణమాఫీ పేరుతో హడావిడి చేసి రైతు భరోసాను కాంగ్రెస్ ప్రభుత్వం ఎగ్గొట్టిందని బీఆర్ఎస్ పదేపదే విమర్శలు చేస్తోంది. రైతు భరోసాను ఎప్పటి నుంచి అమలు చేస్తారు? ఎవరికి రైతు భరోసా ద్వారా ఆర్థిక సాయం చేయనున్నారు? అనే అంశాలపై స్పష్టత ఇవ్వకుండా సర్కార్ కాలయాపన చేస్తోందని ఫైర్ అవుతున్నారు.

ఈ క్రమంలోనే రైతు భరోసాపై మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు కీలక వ్యాఖ్యలు చేశారు. పంటలు పండించే రైతులకే రైతు భరోసా ద్వారా ఆర్థిక సాయం చేయనున్నట్లు స్పష్టం చేశారు. గత ప్రభుత్వం మాదిరి కొండలకు , గుట్టలకు రైతు భరోసా ఇచ్చేది లేదని కుండబద్దలు కొట్టారు. అయితే, ఎప్పటి నుంచి ఇస్తారు అనే దానిపై క్లారిటీ ఇవ్వకపోయినా.. దసరా తర్వాత అంటే వచ్చే నెలాఖరులోపు రైతుభరోసా పథకాన్ని ప్రారంభించే అవకాశం ఉంది.

ఈసారి ఐదు ఎకరాలకా లేక పది ఎకరాలు ఉన్న వారికి ఈ రైతు భరోసాను వర్తింపజేయాలా? అనే విషయంలో ప్రభుత్వం ఎటు తేల్చుకోలేకపోతున్నట్లు తెలుస్తోంది. పేద రైతుకు మేలు చేయాలనే సర్కార్ భావిస్తుండటంతో ఐదు ఎకరాలకు రైతు భరోసాను వర్తింపజేయాలి అని తుది నిర్ణయానికి వచ్చినట్టు సమాచారం.

ఇప్పటివరకూ ఉన్న లెక్కల ప్రకారం మొత్తం 1.52 కోట్ల ఎకరాలకు రూ.22,800 కోట్లు అవుతుంది. అదే 5 ఎకరాలకే రైతు భరోసాను పరిమితం చేస్తే, అప్పుడు 62.34 లక్షల మంది రైతులకు ఈ సాయం అందుతుంది. రైతుల సంఖ్య తక్కువ అయినా.. ప్రతీ పేద రైతుకు గత ప్రభుత్వం కంటే అదనంగా 5000ఎక్కువ ఇచ్చినట్లు అవుతుందని ప్రభుత్వం భావిస్తోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కుక్కల విద్యాసాగర్ కూడా పరారీ !

కేసులు నమోదైన ప్రతి ఒక్కరూ పరారీ అవుతున్నారు. తాము తప్పు చేయలేదని విచారణ ఎదుర్కొంటామని ఒక్కరూ ధైర్యంగా ముందుకు రావడం లేదు. తాజాగా ముంబై నటి జెత్వానీపై కుట్ర చేసిన కేసులో...

తెలంగాణ తల్లి విగ్రహం – కేటీఆర్‌ ఆన్సర్ ఏది ?

రాజీవ్ గాంధీ విగ్రహాన్ని తీసేస్తామని కేటీఆర్ ప్రకటంచి.. గొప్పగా బెదిరించానని అనుకుంటున్నారు. కానీ వచ్చే ఎన్నికల నాటికి రాజకీయ పరిస్థితులు ఎలా ఉంటాయో చెప్పడం కష్టం. అప్పుడు కాంగ్రెస్ తో పొత్తులో ఉంటే......

తగ్గుతున్న జగన్ భయం – ఏపీలో పెట్టుబడుల వెలుగులు !

ఐదేళ్ల అరాచక నీడ నుంచి ఏపీ ఇప్పుడిప్పుడే బయటపడుతోంది. ఎవరైనా రూపాయి పెట్టుబడితో రావాలంటే వణికిపోయే పరిస్థితి నుంచి మళ్లీ ఏపీలో పెట్టుబడులు పెడితే బెటరన్న ఆలోచనలకు పెట్టుబడిదారులు వస్తున్నారు. గుజరాత్...

బెజవాడ ప్రజలకు తోడు, నీడగా ప్రభుత్వం !

బుడమేరు ఉగ్రరూపం కారణంగా నష్టపోయిన బెజవాడ వాసులందరికీ ఆర్థిక పరమైన మద్దతు ఇవ్వడానికి చంద్రబాబు భారీ ప్యాకేజీ ప్రకటించారు. ముంపు ప్రాంతంలోని ప్రతి ఇంటికి ఆయన పరిహారం ప్రకటించారు. ప్రతి ఒక్క కుటుంబానికి...

HOT NEWS

css.php
[X] Close
[X] Close