రేట్లు తగ్గించకపోతే ఇక పెట్రోల్, డీజిల్ స్మగ్లింగ్ కూడా !?

తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు పెట్రోల్, డిజిల్ రేట్లను తగ్గించడానికి ముందూ వెనుకాడుతున్నాయి. అలాంటి ఆలోచనే లేదని ఏపీ ప్రభుత్వం సూచనలు పంపుతూండగా.. పరిశీలన చేస్తాం కానీ ఇప్పుడల్లా తగ్గించే అవకాశం లేదని తెలంగాణ చెబుతోంది. అయితే ఈ రెండు రాష్ట్రాలకు కర్ణాటకతో బోర్డర్ ఉంది. ఏపీ వైపున బెంగళూరు… తెలంగాణ వైపు రాయచూర్ ఉన్నాయి. కర్ణాటకలో పెట్రోల్, డీజిల్ రేట్లను కేంద్రంతో పాటు రాష్ట్రం కూడా తగ్గించింది. కేంద్రం రూ. ఐదు, పది తగ్గిస్తే కర్ణాటక కూడా పోటీగా రూ. ఏడు నుంచి పది వరకూ తగ్గించింది. దీంతో అక్కడ పెట్రోల్ రేటు 90కి వచ్చింది.

డిజిల్ రేటు ఇంకా తగ్గింది. కానీ ఏపీ, తెలంగాణలో మాత్రం తగ్గించలేదు. కేంద్రం తగ్గించిన రూ. ఐదు , పది మాత్రమే తగ్గాయి. ఈ కారణంగా పెట్రోల్ రేటు తెలంగాణలో రూ. 108 వరకూ ఉంది. ఏపీలో రూ. 110వరకూ ఉంది. ఇప్పుడు కర్ణాటకతో పోలిస్తే ఎలా చూసినా రూ. పదిహేను వరకూ ఎక్కువ ఉంటుంది. అందుకే సరిహద్దుల్లో ఉన్నవారు.. అటు వైపు నుంచి వచ్చే వారు ట్యాంక్ ఫుల్ చేయించుకుని వస్తున్నారు. ఇంకా కావాలంటే క్యాన్లలో స్టాక్ పెట్టుకుని వస్తున్నారు.

ఒక వేళ ప్రభుత్వాలు రేట్లను తగ్గించకపోతే పొరుగు రాష్ట్రం నుంచి మద్యం తెచ్చినట్లుగా పెట్రోల్, డీజిల్‌ను కూడా తీసుకొచ్చి అమ్మినా ఆశ్చర్యం లేదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. లీటర్‌కు రూ. పదిహేను వరకూ లాభం అంటే స్మగ్లర్లకు అంత కంటే కావాల్సింది ఏముంటుంది. అందుకే ఈ విషయంలో ప్రభుత్వాలు చురుకుగా ఆలోచించి పొరుగు రాష్ట్రాలతో సమానంగా రేట్లు ఉండేలా చూసుకోవాలని లేకపోతే రాష్ట్రానికే నష్టమని హెచ్చరికలు పంపుతున్నారు నిపుణులు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

డి-ఏజింగ్… లాభమా? నష్టమా ?

సినిమాలో ఒక క్యారెక్టర్ బాల్యం, యవ్వనం, కౌమార, ప్రౌడ దశలని చూపించడం ఫిల్మ్ మేకర్స్ కి పెద్ద సవాల్. ఇందుకోసం హలీవుడ్ నుంచి కూడా మేకప్ మ్యాన్ లని దిగుమతి చేసుకునే వారు....

దువ్వాడ శ్రీనివాస్ ఇంట్లో దివ్వెల మాధురీ !

దువ్వాడ ఫ్యామిలీ డ్రామాలో కొత్త కొత్త ఎపిసోడ్లు ప్రారంభమవుతున్నాయి. కొద్ది రోజుల పాటు సైలెంట్ గా ఉంటానని చెప్పిన దివ్వెల మాధురీ.. ఒక్క సారిగా.. ఏకంగా దువ్వాడ శ్రీనివాస్ ఇంట్లోనే ప్రత్యక్షమయ్యారు. దువ్వాడ...

ఆ పడవలు నందిగం సురేష్ తాలూకానే !

ప్రకాశం బ్యారేజీకి వరద వస్తే ఈ మధ్య బోట్లు కొట్టుకు వస్తున్నాయి. బ్యారేజని డ్యామేజ్ చేస్తున్నాయి. అవి ఎలా వస్తున్నాయో తెలియడం లేదు. ఇప్పుడు మిస్టరీ బయటపడే అవకాశాలు కనిపిస్తున్నాయి. వైసీపీ రంగులేసిన...

శభాష్ నిమ్మల… అభినందించిన నారా లోకేష్

భారీ వర్షానికి తోడు బుడమేరకు పడిన గండ్లు విజయవాడను ముంచేత్తాయి. కనీవినీ ఎరుగని స్థాయిలో వరద పోటెత్తడంతో విజయవాడ గత ఆరు రోజులుగా వరదలో నానుతోంది. బుడమేరుకు పడిన గండ్లు పూడ్చితేనే విజయవాడకు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close