వేణు స్వామి దంపతులకు మూర్తి మరో షాక్

జర్నలిజం కెరీర్‌లో ఎవరూ చేయని ఆరోపణల్ని చేసిన వేణు స్వామి దంపతులు తప్పు చేశామని లెంపలు వేసుకునే వరకూ వదిలి పెట్టేది లేదని మూర్తి పట్టదలగా ఉన్నారు. తప్పుడు ఆరోపణలు చేశారని పోలీసులకు ఫిర్యాదు చేసిన ఆయన.. తాజాగా మరో హెచ్చరిక జారీ చేశారు. తన అనుచరుడు అని చెప్పిన వ్యక్తి ఎవరో.. అతను ఏ నెంబర్ నుంచి కాల్ చేశాడో.. వివరాలు బయట పెట్టాలని డిమాండ్ చేశారు. లేకపోతే తానే బయట పెట్టి కుట్ర చేశారని చెప్పి సంభాషణలు జరిపిన ఇద్దరి మధ్య కేసు పెడతానని ప్రకటించారు.

తనపేరు వాడుకొని అలాంటి నేరాలు చేస్తున్న వ్యక్తులను పట్టుకొని శిక్షించాలని పోలీసులకు ఇప్పటికే ఫిర్యాదు చేశానని గుర్తు చేశారు. తన పేరుతో డబ్బులు అడగడం వల్లే ఆత్మహత్య చేసుకునే పరిస్థితి వచ్చారని చెబుతున్నారు కాబట్టి డబ్బులు అడిగిన అమర్ అనే వ్యక్తి ఎవరో బయట పెట్టాలని మూర్తి డిమాండ్ చేస్తున్నారు. నిజానికి అమర్ అనే వ్యక్తి వేణు స్వామి దంపతులకే సన్నిహితుడు. అతనితో కలిసి కామాఖ్య సహా ఇతర ఆలయాలకు వెళ్లారని స్వయంగా మూర్తి ప్రకటించారు.

ఇప్పుడు ఈ అమర్ అనే వ్యక్తిని పోలీసులకు అప్పగించకపోతే అతని గురించి వివరాలు బయట పెట్టి ఆ ఆడియోను వేణు స్వామినే క్రియేట్ చేయించారని తేల్చి కేసులు పెట్టే చాన్స్ ఉంది. ఒక వేళ అప్పగిస్త అసలు నిజాన్ని పోలీసులు కక్కిస్తారు. పైగా పోలీసులు త్వరగా స్పందించాలని రేవంత్ రెడ్డిని మూర్తి ట్విట్టర్ వేదికగా కోరుతున్నారు. ఎలా చూసినా మూర్తికి క్షమాపణలు చెప్పి.. బయటపడకపోతే వేణు స్వామి ఇంకా మునగిపోయే ప్రమాదం కనిపిస్తోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

శ్రీవారి లడ్డూ ఇష్యూ : వైసీపీ పాపం పండింది !

గుడిని గుడిలో లింగాన్ని మింగే బ్యాచ్‌కు ప్రజలు తిరుగులేని మెజార్టీతో అధికారం ఇస్తే.. తమకు దోచుకోమని లైసెన్స్ ఇచ్చారని ఫీలవుతారు. వైసీపీ నేతలు అదే ఫీలయ్యారు. దేవుడనే భయం కూడా...

కంగనపై దానం కామెంట్స్‌ – కేటీఆర్ ఖండన !

సినిమాల్లో బోగం వేషాలు వేసుకునే కంగనా.. రాహల్ గాంధీని విమర్శించడమా ?... అని దానం నాగేందర్.. హీరోయిన్ కంగనపై విరుచుకుపడ్డారు. ఈ బోగం వేషాలు అంటే ఏమిటో కానీ.. బీజేపీ నేతలకు...

తిరుపతి లడ్డూ ఇష్యూ : అడ్డంగా దొరికినా అదే ఎదురుదాడి !

వైసీపీ సిగ్గులేని రాజకీయాలు చేస్తుంది. అడ్డంగా దొరికిన తర్వాత కూడా ఎదురుదాడి చేసేందుకు ఏ మాత్రం సిగ్గుపడటం లేదు. తిరుమల శ్రీవారి ప్రసాదం లడ్డూలో నాణ్యత లేని నెయ్యిని.. పశువుల కొవ్వుతో కల్తీ...

తిరుప‌తి ల‌డ్డు చుట్టూ వివాదం… ఇంత‌కు ఈ ల‌డ్డూ ఎందుకింత స్పెష‌ల్?

తిరుప‌తి ల‌డ్డూ. తిరుమ‌ల‌లో శ్రీ‌వారి వెంక‌న్న ద‌ర్శ‌నాన్ని ఎంత మ‌హాభాగ్యంగా భావిస్తారో... తిరుప‌తి ల‌డ్డూను అంతే మ‌హాభాగ్యంగా భావిస్తారు. ఉత్త‌రాది, ద‌క్షిణాది అన్న తేడా ఉండ‌దు... ఆ రాష్ట్రం, ఈ రాష్ట్రం అన్న...

HOT NEWS

css.php
[X] Close
[X] Close