యూపీ మాజీ మంత్రికి బినామీ వేణు స్వామి ?

తప్పుడు ఆరోపణలు చేసిన వేణుస్వామికి.. అతని భార్యకి జర్నలిస్టు మూర్తి చుక్కలు చూపిస్తున్నారు. ఇప్పటికే క్రిమినల్ డిఫమేషన్ కేసు ఫైల్ చేయడానికి నోటీసులు పంపిన ఆయన తాజాగా జర్నలిస్టును బయటకు తీసి.. వేణు స్వామి, ఆయన భార్య బినామీ బాగోతాలు బయట పెట్టేందుకు సిద్ధమయ్యారు. యూపీకి చెందిన గ్యాంగ్ స్టర్, రాజకీయ నాయకుడు గాయత్రి ప్రజాపతికి వేణు స్వామి బినామీ అని మూర్తి సంచలన వివరాలు బయట పెట్టారు.

గతంలో పలుమార్లు గాయత్రి ప్రజాపతిని వేణుస్వామి కలిసిన ఫోటోలు బయటకు వచ్చాయి. వేణుస్వామి దంపతులు యూపీకి వెళ్లారా లేపోతే ప్రజాపతి ఇక్కడకు వచ్చారా అన్నది స్పష్టత లేదు కానీ ఆ ప్రజాపతికి మాత్రం వీరు బినామీలుగా ఉంటున్నారన్న అనుమానాలు మాత్రం ఉన్నాయి. గాయత్రి ప్రజాపతి ప్రస్తుతం అత్యాచారం, హత్య వంటి తీవ్రమైన కేసుల్లో జైలు శిక్షకు గురై జైల్లో ఉన్నాడు.

వేణు స్వామి భార్య శ్రీవాణి మా ఫామ్ హౌస్ అంటూ వీడియోలు తీసి సోషల్ మీడియాలో పోస్టు చేస్తున్నారు. కొన్ని కోట్ల విలువ చేసే ఆ ఫామ్ హౌస్ వారిది కాదని.. గాయత్రి ప్రజాపతిదేనని ఈ విషయంపై ఈడీ, సీబీఐ విచారణ చేయాలని మూర్తి డిమాండ్ చేస్తూ వివరాలు బయటపెట్టారు. ఒక్కొక్కటిగా వేణుస్వామి వ్యవహారాలను మూర్తి బయట పెడుతూ పోతున్నారు. ఇదెక్కడికి పోతుందోనని వేణు స్వామి దంపతులు బిక్కుబిక్కుమంటున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

శ్రీవారి లడ్డూ ఇష్యూ : వైసీపీ పాపం పండింది !

గుడిని గుడిలో లింగాన్ని మింగే బ్యాచ్‌కు ప్రజలు తిరుగులేని మెజార్టీతో అధికారం ఇస్తే.. తమకు దోచుకోమని లైసెన్స్ ఇచ్చారని ఫీలవుతారు. వైసీపీ నేతలు అదే ఫీలయ్యారు. దేవుడనే భయం కూడా...

కంగనపై దానం కామెంట్స్‌ – కేటీఆర్ ఖండన !

సినిమాల్లో బోగం వేషాలు వేసుకునే కంగనా.. రాహల్ గాంధీని విమర్శించడమా ?... అని దానం నాగేందర్.. హీరోయిన్ కంగనపై విరుచుకుపడ్డారు. ఈ బోగం వేషాలు అంటే ఏమిటో కానీ.. బీజేపీ నేతలకు...

తిరుపతి లడ్డూ ఇష్యూ : అడ్డంగా దొరికినా అదే ఎదురుదాడి !

వైసీపీ సిగ్గులేని రాజకీయాలు చేస్తుంది. అడ్డంగా దొరికిన తర్వాత కూడా ఎదురుదాడి చేసేందుకు ఏ మాత్రం సిగ్గుపడటం లేదు. తిరుమల శ్రీవారి ప్రసాదం లడ్డూలో నాణ్యత లేని నెయ్యిని.. పశువుల కొవ్వుతో కల్తీ...

తిరుప‌తి ల‌డ్డు చుట్టూ వివాదం… ఇంత‌కు ఈ ల‌డ్డూ ఎందుకింత స్పెష‌ల్?

తిరుప‌తి ల‌డ్డూ. తిరుమ‌ల‌లో శ్రీ‌వారి వెంక‌న్న ద‌ర్శ‌నాన్ని ఎంత మ‌హాభాగ్యంగా భావిస్తారో... తిరుప‌తి ల‌డ్డూను అంతే మ‌హాభాగ్యంగా భావిస్తారు. ఉత్త‌రాది, ద‌క్షిణాది అన్న తేడా ఉండ‌దు... ఆ రాష్ట్రం, ఈ రాష్ట్రం అన్న...

HOT NEWS

css.php
[X] Close
[X] Close