గంటా శ్రీనివాసరావు మళ్లీ టీడీపీలో యాక్టివ్గా మారుతున్నారనో.. లేకపోతే.. ఆయన నియోజకవర్గంలో టీడీపీ అభ్యర్థులకు ఓట్లేసినా తర్వాత వైసీపీలో చేరుతారని చెప్పడానికో కానీ విజయసాయిరెడ్డి గంటా మెడలో గంట కట్టారు. గంటా శ్రీనివాసరావు వైసీపీలో చేరేందుకు కొన్ని ప్రతిపాదనలు పంపించారని అవి ప్రస్తుతానికి జగన్ వద్ద ఉన్నాయన్నట్లుగా చెప్పుకొచ్చారు. జగన్ నిర్ణయం తీసుకుంటే గంటా పార్టీలో చేరుతారన్నట్లుగా విజయసాయిరెడ్డి చెప్పుకొచ్చారు. గంటా శ్రీనివాసరావు ముఖ్య అనుచరునిగా ఉన్న కాశీవిశ్వనాత్ అనే వ్యక్తి.. విజయసాయిరెడ్డి సమక్షంలో వైసీపీలో చేరారు. ఈ సందర్భంగా గంటా ప్రస్తావన విజయసాయిరెడ్డి తీసుకువచ్చారు. గంటా వైసీపీలో చేరుతారని పలుమార్లు ప్రచారం జరిగింది.
అవంతి శ్రీనివాస్ తో పాటు విజయసాయిరెడ్డి కూడా వ్యతిరేకిస్తున్నారు… అందుకే ఆయన చేరిక ఆగిపోయిందని ప్రచారం జరిగింది. అయితే గంటా… మంత్రి పదవితో పాటు విశాఖలో తన వర్గానికి ప్రాధాన్యత ఇవ్వాలన్న ప్రతిపాదనలు పెట్టినట్లుగా తెలుస్తోందని విజయసాయిరెడ్డి వ్యాఖ్యలతో తేలిపోతోందంటున్నారు. ఈ కారణంగా ఆయన చేరిక పెండింగ్లో పడిందన్న తెలుస్తోంది. టీడీపీ ఎన్నికల్లో ఓడిపోయినప్పటి నుండి గంటా టీడీపీకి దూరంగానే ఉన్నారు. ఆయన వ్యాపారాలు.. భయాల కారణంగా బీజేపీలో కూడా చేరుతారని అనుకున్నారు.
సోము వీర్రాజు లాంటి వాళ్లు గంటా చేరుతారని నేరుగానే ప్రకటించారు. కానీ జరగలేదు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నిర్ణయం తర్వాత గంటా యాక్టివ్ గా మారారు. రాజీనామా చేశారు. వైసీపీ, బీజేపీపై విమర్శలు చేస్తున్నారు. ఈ సమయంలో విజయసాయిరెడ్డి .. ఆయన వైసీపీలో చేరుతారని చెప్పుకొచ్చారు. దీనిపై గంటా స్పందిస్తారో లేదో క్లారిటీ లేదు. గంటా రిజర్వేషన్స్ గంటాకు ఉన్నాయి కాబట్టి.. ఆయన సైలెంట్ గా ఉండే అవకాశం ఉందంటున్నారు.