డీఎన్ఏ గురించి అడిగితే.. ఎన్‌డీఏపై పడ్డ విజయసాయి!

వైసీపీ లీడర్ విజయసాయి పరిస్థితి కుడితిలోపడ్డ ఎలుక మాదిరి తయారైంది. ఎరక్కపోయి సమస్యలో ఇరుక్కుపోవడమే కాదు.. బయటపడే మార్గం తెలియక గింజుకుంటున్నాడు. ఏం చేయాలో తెలియక.. ఏదేదో చేస్తున్నాడు. ప్రస్తుతం ఏపీలో చర్చ అంతా విజయసాయిరెడ్డి గురించే జరుగుతోంది.

శాంతి అనే ఉద్యోగినితో శారీరక సంబంధం ఉందని ఆమె మొదటి భర్త మదన్ ఆరోపణలు చేశారు. తాను చెప్పేది అబద్దమైతే..విజయసాయి డీఎన్ఏ టెస్ట్ కు సిద్దపడాలని మదన్ సవాల్ చేశారు. తనపై వచ్చిన ఆరోపణలను మీడియా సమావేశం ఏర్పాటు చేసి ఖండించిన విజయసాయి.. డీఎన్ఏ టెస్ట్ కు సిద్దపడాలని మదన్ చేసిన సవాల్ పై మాత్రం స్పందించలేదు.

కనీసం తను తప్పు చేయలేదు.. తనెందుకు డీఎన్ఏ టెస్ట్ కు సిద్దపడాలని రివర్స్ లో క్వశ్చన్ కూడా చేయలేదు. మీడియాను కెలికి అనవసరంగా బుక్ అయ్యానని అనుకున్నారేమో..ఈ వ్యవహారంపై ఇక స్పందించేందుకు అస్సలు ఇష్టపడటం లేదు.

పొలిటికల్ సర్కిల్ అంతా డీఎన్ఏ టెస్ట్ గురించి మాట్లాడుకుంటూంటే.. దాన్నుంచి డైవర్ట్ చేసేందుకు విజయసాయి తాజాగా తన తెలివిని మరోసారి ప్రదర్శించారు. తనపై పడిన మరకలను తుడుచుకునే ప్రయత్నం చేయకుండా కూటమి సర్కార్ ను టార్గెట్ చేశారు. రాష్ట్రంలో జరుగుతోన్న నేరాలు, ఘోరాలపై చంద్రబాబు శ్వేతపత్రం విడుదల చేయోచ్చు కదా అంటూ ఎక్స్ లో పోస్ట్ చేశారు.

విజయసాయిరెడ్డి ఈ అంశాన్ని లేవనెత్తడం వెనక వ్యూహం ఉందని అంటున్నారు. ఈ డీఎన్ఏ టెస్ట్ వ్యవహారంపై మీడియా అటెన్షన్ ను డైవర్ట్ చేసేందుకే ఆయన ఈ ట్వీట్ చేసి ఉంటారని రాజకీయ పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. జగన్ వద్ద కూడా ఇలాంటి తెలివి తేటలే ప్రదర్శించి దూరమయ్యారు అనే వాదనలకు తాజా ఎపిసోడ్ బలం చేకూర్చుతోంది.

కానీ, ఈ విషయం ప్రజల్లోకి వెళ్ళిపోయింది. మరో విధంగా డైవర్ట్ చేయాలనుకున్నా.. సాధ్యం అయ్యేలా లేదు. ఇప్పుడు డీఎన్ఏ టెస్టే విజయసాయి రెడ్డి నిజాయితీని తేటతెల్లం చేయగలదు. అందుకు ఆయన సిద్దపడకపోతే మాత్రం ఎప్పటికీ అది మచ్చగానే మిగిలిపోనుంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

మారుతికి ముందే తెలుసా?

రాజ్ తరుణ్ కి హ్యాట్రిక్ ఫ్లాపులు పడ్డాయి. రెండు నెలల వ్యవధిలో మూడు సినిమాలు రాజ్ నుంచి వచ్చాయి. పురుషోత్తముడు, తిరగబడరాస్వామి, భలే ఉన్నాడే. ఈ మూడు ఫ్లాపులే. భలే ఉన్నాడే చాలా...

బంగ్లాని లైట్ తీసుకోవద్దు బాసూ

ఇండియా - బంగ్లాదేశ్‌ టెస్ట్ సిరీస్ ఈనెల‌ 19 నుంచి ప్రారంభం కానుంది. డబ్ల్యూటీసీ 2023-25 సీజన్‌లో రాబోయే పది టెస్టులు టీమ్‌ఇండియాకు అత్యంత కీలకం. అందుకే ఈ సిరీస్ ప్రాధాన్యతని సంతరించుకుంది....

చిట్‌చాట్‌లతో BRSను చిరాకు పెడుతున్న రేవంత్ !

రేవంత్ రెడ్డి మీడియా ప్రతినిధులతో ఇష్టాగోష్టిగా మాట్లాడే మాటలు మీడియాలో హైలెట్ అవుతూంటాయి. వాటిని పట్టుకుని బీఆర్ఎస్ ఆవేశ పడుతోంది . అంతా అయిపోయిన తరవాత తీరిగ్గా.. నేను ఎప్పుడన్నాను అని రేవంత్...

ఢిల్లీ తర్వాత సీఎం కూడా కేజ్రీవాలే ?

ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ మంగళవారం రాజీనామా చేయబోతున్నారు. అదే రోజు ఢిల్లీ శాసనసభాపక్ష సమావేశం కూడా నిర్వహిస్తున్నారు. కొత్త సీఎంగా కేజ్రీవాల్ ఎవరికి చాన్సిస్తారన్నది హాట్ టాపిక్ గా మారింది. విచిత్రంగా...

HOT NEWS

css.php
[X] Close
[X] Close