విశాఖ బీచ్ ను కబ్జా చేసి..భారీ బీచ్ రిసార్టును కట్టాలనుకున్న విజయసాయిరెడ్డి నిర్వాకం సాక్ష్యాలతో వెలుగులోకి వస్తోంది. ఆయన కుమార్తె నేహారెడ్డి పేరుతో ఓ హోటల్ కట్టాలని ఆయన డిసైడ్ అయ్యారు. ఆ ప్రకారం వైసీపీ హయాంలోనే బీచ్ ను కబ్జా చేశారు. ఎప్పుడు వేశారో తెలియదు కానీ… బీచ్ లో గోడలు కట్టేందుకు ఎనిమిది నుంచి పది అడుగుల లోతున కాంక్రీట్ గోడలు కట్టేశారు. హైకోర్టు ఆదేశాలతో వాటిని పెకిలిస్తున్న అధికారులకు చుక్కలు కనిపిస్తున్నాయి. ఇంత లోతుగా ఎప్పుడు తవ్వి కాంక్రీట్ పోశారో వారికే అర్థం కాలేదు.
బీచ్లో చేస్తున్న అక్రమాలపై హైకోర్టు సీరియస్ గా స్పందించింది. తవ్వే ఖర్చు కూడా ఆ కట్టడాలు నిర్మించిన నేహారెడ్డి నుంచే వసూలు చేయాలని ఆదేశించింది. అంతే కాదు వాటిని తొలగించి నివేదిక సమర్పించాలని ఆదేశించింది. అందుకే చాలా వేగంగా వాటిని తొలగిస్తున్నారు. అన్ని అనుమతులతోనే సీఆర్జెడ్-2 ప్రాంతంలో నిర్మాణాలు చేపట్టామని నేహారెడ్డి వాదించారు. జనసేన నేత కార్పొరేటర్ పీఎల్వీఎన్ మూర్తి యాదవ్ ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలుపై హైకోర్టు విచారణ జరుపుతోంది.
నిర్మాణానికి వినియోగిస్తున్న భారీ యంత్రాలను సీజ్ చేయాలని గత సెప్టెంబర్ లోనే ఆదేశించారు. హైకోర్టు కూడా స్టే ఇవ్వలేదు. వారు నిబంధనలు ఉల్లఘించి బీచ్ లో నిర్మాణాలు చేస్తున్నది నిజమని తేలడంతో పూర్తి స్థాయిలో తొలగించాలని ఆదేశించారు. ఆ మేరకు స్టేటస్ రిపోర్టు కూడా సమర్పించాలని ఆదేశించారు దీంతో విశాఖ తీరంలో లోతుగా తవ్వి కాంక్రీట్ పునాదుల్ని తొలగిస్తున్నారు.