దువ్వాడ, మాధురీలపై పోలీసులు చర్యలెందుకు తీసుకోరు ?

దువ్వాడ ఫ్యామిలీ డ్రామాల చూసేందుకు ప్రజలకు మరింత కాలం అవకాశం ఇవ్వాలని పోలీసులు అనుకుంటున్నారేమో కానీ.. ఈ డ్రామాను నిరంతరం కొనసాగించేందుకు అవకాశం కల్పిస్తున్నారు. నిజానికి దువ్వాడ శ్రీనివాస్ తో పాటు దివ్వెల మాధురీ కూడా అరెస్టు చేయగలిగిన నేరాలు చేశారని వీడియో సాక్ష్యాలతో సహా ఉన్నాయి. కానీ వారిపై పోలీసులు కేసులు పెట్టడడం లేదు.. చర్యలు తీసుకోవడం లేదు.. దీంతో ఆయన పోలీసులకు చేత కాదని చెప్పి.. వారిపైనే రివర్స్‌లో హైకోర్టులో పిటిషన్ వేశారు.

దివ్వెల మాధురీ ఉద్దేశపూర్వకంగా వేరే కారును ఢీకొట్టారు. ఇది అత్యంత తీవ్రమైన నేరం. ఆ కారులో ఉన్న ముగ్గురు వృద్ధులు తీవ్రంగా గాయపడ్డారు. మామూలుగా అయితే ఆమెను అప్పుడే అరెస్టు చేసి జైలుకు పంపాల్సి ఉంది. కానీ ఇప్పటి వరకూ ఆ కోణంలో పోలీసులు కేసులు కూడా పెట్టలేదు. ఇక అరెస్ట్ కు చాన్స్ లేదు. ఇక దువ్వాడ శ్రీనివాస్ భార్య బిడ్డలను కొట్టేందుకు వెళ్లారు. అడ్డుకున్న పోలీసులపై రుబాబు చేశారు. ఆయనపైనా కేసులు పెట్టలేదు.

Read Also : దువ్వాడ ఫ్యామిలీ ఎపిసోడ్ లో కొత్త ట్విస్ట్

ఇప్పుడు ఆయనే రివర్స్‌లో తన భార్య, బిడ్డపై పోలీసులు చర్యలు తీసుకోలేదని హైకోర్టులో పిటిషన్ వేశారు. అసలు దువ్వాడ ఇష్యూ ఫ్యామిలీ మ్యాటర్ అనుకుంటే .. న్యూసెన్స్ చేస్తున్నారనుంటే పోలీసులు వారికి కౌన్సెలింగ్ ఇవ్వాలి. కానీ అలాంటిది చేయకుండా.. వారు దువ్వాడ శ్రీను, దివ్వెల మాధురీ ఇష్టం వచ్చినట్లుగా వ్యవహరిస్తున్నా ఎందుకు సైలెంట్ గా ఉంటున్నారో చూసేవారికీ అర్థం కావడంలేదు.

దువ్వాడ ఫ్యామిలీలో ఏం జరిగినా అది వారి వ్యక్తిగతం. ప్రజల్ని ఇబ్బంది పెడితే మాత్రం చర్యలు తీసుకోవాల్సిందే. ఈ విషయం పోలీసులకు ఎందుకు గుర్తు రావడం లేదో ?

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

బీఆర్ఎస్‌ను ట్రోల్ చేస్తోంది ఆ పార్టీ సోషల్ మీడియానే !

బీఆర్ఎస్ సోషల్ మీడియాకు తప్పు ఏదో.. ఒప్పు ఏదో తెలియడం లేదు. కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న ప్రతి దాన్ని విమర్శించడమే పనిగా పెట్టుకుంది. ఆ విమర్శల్లో అయినా కనీస లాజిక్ ఉండాలని...

శ్రీవారి లడ్డూ వివాదం : క్షమాపణలు చెప్పడమే వైసీపీకి మంచిది !

తిరుపతి లడ్డూ వివాదం వైసీపీని నిలువనా దహించి వేస్తోంది. ప్రపంచవ్యాప్తంగా హిందువులు తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తున్నారు. ఉత్తరభారతంలో జగన్ రెడ్డికి వ్యతిరేకంగా సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం తెలుసుకుంటే వైసీపీ నేతలకు...

క్యూలో ఉన్న నేతల జాబితా చాలా పెద్దదే !

కూటమి పార్టీల్లో చేరిపోవాలనుకునే వైసీపీ నేతల జాబితాల చాలా పెద్దగా ఉంది. అయితే చేరికలకు ఓ ప్రక్రియ పెట్టుకవడంతో వచ్చిన వారందర్నీ చేర్చుకోవడం లేదు. అన్ని పార్టీల నుంచి కలిసి...

మార్పు గమనించారా – ఏపీలో ఇప్పుడు బూతుల్లేవు !

వైసీపీ అధికారంలో ఉన్న ఐదేళ్లలో రాజకీయాల్లో బూతులు కామన్. అవి లేకపోతే అసలు రాజకీయ స్పీచ్‌లే ఉండేవి కాదు. అది అసెంబ్లీ అయినా సరే.. జనాల చెవులకు పట్టిన తుప్పును వదలగొట్టేవాళ్లు....

HOT NEWS

css.php
[X] Close
[X] Close