రోహిత్ రెడ్డిని ఈడీ బారి నుంచి కాపాడలేకపోయిన వైసీపీ ఎంపీ !

ఎమ్మెల్యేలకు ఎర కేసులో ఈడీ విచారణ ప్రారంభించడాన్ని రోహిత్ రెడ్డి అంగీకరించడం లేదు. చట్ట విరుద్ధంగా విచారణ చేస్తున్నారని ఆయన హైకోర్టుకు వెళ్లారు. ఆయన తరపున వాదించడానికి నిరంజన్ రెడ్డిని పెట్టుకున్నారు. ఈయన జగన్ అక్రమాస్తుల కేసుల్లో వాదించే లాయర్ మాత్రమే కాదు….వైసీపీ ఎంపీ కూడా. ఆయననే రోహిత్ రెడ్డి పెట్టుకున్నారు. ఇటీవలి కాలంలో నిరంజన్ రెడ్డి.. టీఆర్ఎస్ నేతలకు కూడా లాయర్ గా వ్యవహరిస్తున్నారు. అయితే రోహిత్ రెడ్డికి ఆయన ఊరట కల్పించలేకపోకపోయారు. ఈడీ విచారణను నిలిపివేసేలా ఉత్తర్వలిచ్చేంత ధాటిగా ఆయన వాదనలు వినిపించలేకపోయారు.

ఈడీ విచారణ నిలిపివేస్తూ మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలన్న రోహిత్ రెడ్డి తరపు లాయర్ నిరంజన్ రెడ్డి అభ్యర్థన ను హైకోర్టు తోసిపుచ్చింది. ఈనెల 30న హాజరు కావాలన్న ఈడీ సమన్లలో జోక్యానికి నిరాకరించింది. పార్టీ మారాలని తనకు వందకోట్లు ఆఫర్ ఇచ్చారు లకానీ.. డబ్బు ఇవ్వలేదని… ఆర్థిక లావాదేవీలు జరగలేదు కనుక ఈడీకి విచారణ పరిధి లేదని నిరంజన్ రెడ్డి వాదించారు. ఈడీ ఈసీఐఆర్ మనీలాండరింగ్ చట్టానికి విరుద్ధమని వాదించారు. కానీ కోర్టు అంగీకరించలేదు.

హైకోర్టులో ఎదురు దెబ్బ తగలడంతో.. రోహిత్ రెడ్డి 30వ తేదీన ఈడీ ఎదుట విచారణకు హాజరు కావాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇప్పటికీ ఈడీ నందకుమార్ ను రెండు రోజుల పాటు కస్టడీలోకి తీసుకుని కొన్నికీలక వివరాలు సేకరించింది. ఇప్పుడ రోహిత్ రెడ్డిని విచారణకు పిలుస్తోంది. దీంతో కీలక పరిణామాలు చోటు చేసుకోవడం ఖాయంగా కనిపిస్తోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

డి-ఏజింగ్… లాభమా? నష్టమా ?

సినిమాలో ఒక క్యారెక్టర్ బాల్యం, యవ్వనం, కౌమార, ప్రౌడ దశలని చూపించడం ఫిల్మ్ మేకర్స్ కి పెద్ద సవాల్. ఇందుకోసం హలీవుడ్ నుంచి కూడా మేకప్ మ్యాన్ లని దిగుమతి చేసుకునే వారు....

దువ్వాడ శ్రీనివాస్ ఇంట్లో దివ్వెల మాధురీ !

దువ్వాడ ఫ్యామిలీ డ్రామాలో కొత్త కొత్త ఎపిసోడ్లు ప్రారంభమవుతున్నాయి. కొద్ది రోజుల పాటు సైలెంట్ గా ఉంటానని చెప్పిన దివ్వెల మాధురీ.. ఒక్క సారిగా.. ఏకంగా దువ్వాడ శ్రీనివాస్ ఇంట్లోనే ప్రత్యక్షమయ్యారు. దువ్వాడ...

ఆ పడవలు నందిగం సురేష్ తాలూకానే !

ప్రకాశం బ్యారేజీకి వరద వస్తే ఈ మధ్య బోట్లు కొట్టుకు వస్తున్నాయి. బ్యారేజని డ్యామేజ్ చేస్తున్నాయి. అవి ఎలా వస్తున్నాయో తెలియడం లేదు. ఇప్పుడు మిస్టరీ బయటపడే అవకాశాలు కనిపిస్తున్నాయి. వైసీపీ రంగులేసిన...

శభాష్ నిమ్మల… అభినందించిన నారా లోకేష్

భారీ వర్షానికి తోడు బుడమేరకు పడిన గండ్లు విజయవాడను ముంచేత్తాయి. కనీవినీ ఎరుగని స్థాయిలో వరద పోటెత్తడంతో విజయవాడ గత ఆరు రోజులుగా వరదలో నానుతోంది. బుడమేరుకు పడిన గండ్లు పూడ్చితేనే విజయవాడకు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close