పాపం గంజి చిరంజీవి – చీటీ చించేసిన జగన్

మంగళగిరిలో వైసీపీ టిక్కెట్ ఇస్తారని టీడీపీని వదిలేసిపోయి డబ్బులు ఖర్చు పెట్టుకుంటున్న గంజి చిరంజీవి టిక్కెట్ ను జగన్ రెడ్డి చించేశారు. ఆయనకు బదులుగా మాజీ ఎమ్మెల్యే కాండ్రు కమలను సీఎం జగన్ అభ్యర్థిగా ఖరారు చేశారు. నియోజకవర్గ నేతలతో సమావేశమైన ఆయన.. గంజి చిరంజీవి పరిస్థితి ఏమీ బాగోలేదని రిపోర్టులు వచ్చాయని.. మళ్లీ గెలిచాక మంచి పదవి ఇస్తామని.. కాండ్రు కమలను గెలిపించాలని సూచించినట్లుగా తెలుస్తోంది. మంగళగిరిలో చేనేత వర్గానికి టిక్కెట్ ఇవ్వాలని జగన్ గంజి చిరంజీవిని టీడీపీ నుంచి ఆకర్షించారు. టీడీపీలో మంగళగిరి తరపున 2014 తరపున పోటీ చేసి పోస్టర్ బ్యాలెట్ల కారణంగా ఓడిపోయారు.

ఇరవై ఓట్ల తేడాతో ఓడిపోయినా.. టీడీపీ అధికారంలోకి రావడంతో మంగళగిరి అనధికారిక ఎమ్మెల్యేగా చెలామణి అయ్యారు. లోకేష్ పోటీ చేయాలని నిర్ణయించడంతో ఆయనకు మళ్లీ టిక్కెట్ దక్కలేదు. కానీ ఆయనకు టీడీపీ ప్రాధాన్యత ఇచ్చింది. గత ఏడాదే ఆయనను వైసీపీలోకి ఆకర్షించారు. ఆయనకే టిక్కెట్ అని ఖరారు చేశారు. ఈ కారణంగా ఆళ్ల రామకృష్ణారెడ్డి కూడా పార్టీ కి గుడ్ బై చెప్పారు. కానీ ఇప్పుడు…ఆయనకూ టిక్కెట్ లేదని అంటున్నారు.

కాండ్రు కమల కాంగ్రెస్ లో నుంచి టీడీపీకి వచ్చారు.. చాన్స్ ఉండదని తెలిసి వైసీపీలోకి వెళ్లారు. అక్కడ టిక్కెట్ ఇవ్వకపోతే కాంగ్రెస్ నుంచి పోటీ చేయాలని ప్లాన్ చేసుకుంటున్నారు. ఈ లోపే జగన్ టిక్కెట్ ఆఫర్ చేశారు. అయితే చివరికి అభ్యర్థిగా ఎవరిని పెడతారో బీఫాం ఇచ్చే వరకూ తెలియదని జగన్ రెడ్డి నిర్ణయాల్లో నిలకడలేని తనం చూసిన వారు అంటున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

మారుతికి ముందే తెలుసా?

రాజ్ తరుణ్ కి హ్యాట్రిక్ ఫ్లాపులు పడ్డాయి. రెండు నెలల వ్యవధిలో మూడు సినిమాలు రాజ్ నుంచి వచ్చాయి. పురుషోత్తముడు, తిరగబడరాస్వామి, భలే ఉన్నాడే. ఈ మూడు ఫ్లాపులే. భలే ఉన్నాడే చాలా...

బంగ్లాని లైట్ తీసుకోవద్దు బాసూ

ఇండియా - బంగ్లాదేశ్‌ టెస్ట్ సిరీస్ ఈనెల‌ 19 నుంచి ప్రారంభం కానుంది. డబ్ల్యూటీసీ 2023-25 సీజన్‌లో రాబోయే పది టెస్టులు టీమ్‌ఇండియాకు అత్యంత కీలకం. అందుకే ఈ సిరీస్ ప్రాధాన్యతని సంతరించుకుంది....

చిట్‌చాట్‌లతో BRSను చిరాకు పెడుతున్న రేవంత్ !

రేవంత్ రెడ్డి మీడియా ప్రతినిధులతో ఇష్టాగోష్టిగా మాట్లాడే మాటలు మీడియాలో హైలెట్ అవుతూంటాయి. వాటిని పట్టుకుని బీఆర్ఎస్ ఆవేశ పడుతోంది . అంతా అయిపోయిన తరవాత తీరిగ్గా.. నేను ఎప్పుడన్నాను అని రేవంత్...

ఢిల్లీ తర్వాత సీఎం కూడా కేజ్రీవాలే ?

ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ మంగళవారం రాజీనామా చేయబోతున్నారు. అదే రోజు ఢిల్లీ శాసనసభాపక్ష సమావేశం కూడా నిర్వహిస్తున్నారు. కొత్త సీఎంగా కేజ్రీవాల్ ఎవరికి చాన్సిస్తారన్నది హాట్ టాపిక్ గా మారింది. విచిత్రంగా...

HOT NEWS

css.php
[X] Close
[X] Close