జగన్ రెడ్డికి తన రాజకీయమే ముఖ్యం. తన హయాంలో దళిత అధికారుల్ని ముందు పెట్టి చేసిన వ్యవహారాలతో వారంతా ఎన్నోతిప్పలు పడుతున్నారు. ఇప్పుడు తనకు రాజకీయంగా వచ్చిన కష్టానికి కూడా దళితుల్నే పావుగా వాడేశారు. ఈ వ్యవహారం ఇప్పుడు ఆయన మనస్థత్వం, మానసిక స్థితిపై మరోసారి చర్చ పెట్టేలా చేసింది.
మాజీ ముఖ్యమంత్రినే తిరుమలకు పోనివ్వడం లేదు.. ఇక దళితుల పరిస్థితేమిటని ఆయన చేసిన వ్యాఖ్యలు ఆయన వైపు అందరూ ఆదో రకంగా చూడటానికి కారణం అవుతున్నాయి. అసలు ఇక్కడ దళితుల ప్రస్తావన ఎందుకు వచ్చింది ? వారందర్నీ జగన్ రెడ్డి క్రిస్టియన్లుగా చెబుతున్నారా ?. జగన్ రెడ్డి తన టార్గెట్ ప్రకారం మతం మార్చేసిన వాళ్లు హిందూ ఆలయాలరు రారు. వారు కూడా జగన్ రెడ్డిలాగే కనీసం ప్రసాదం కూడా పట్టుకోరు. హిందువుల్ని మోసం చేయాల్సిన అవసరం జగన్ రెడ్డికి ఉంది కాబట్టి.. ఆయన వెళ్తారు. కానీ ఇతర మతం మార్చుకున్ వారు వెళ్లరు. మతం మార్చుకోని స్వచ్చమైన హిందువులు ఎవరైనా .. దళితుళైనా సరే అన్ని ఆలయాలకు వెళ్తున్నారు. ఎక్కడా సమస్యలు రాలేదు . మరి జగన్ ఎందుకు దళితుల ప్రస్తావన తీసుకు వచ్చారు
తనకు వచ్చిన కష్టాన్ని తప్పించుకునేందుకు తన కు రక్షణ కవచంగా దళితుల్ని పెట్టుకునేందుకు జగన్ దిగజారిపోయారు. ఇలాంటి రాజకీయం చేస్తే ఎవరికి నష్టమో ఆయనకు వ్యూహాకర్తలు చెప్పారో లేదో. కానీ ఇది మరో ఘోరమైన తప్పిదం అవుతుంది. ఇప్పుడు మరోసారి ఆయన చేసేశారు. ఇప్పటికే దళితుల్లో ఆయన పట్టు కోల్పోయారు. ఇప్పుడు ఆయన వారిలోనూ అసహ్యాన్ని పెంచుకునే స్థితికి వెళ్తున్నారు.