వైసీపీ బాటలోనే షర్మిల !

బిర్యానీ పెడతాం అంటే అన్నం పెట్టడం ఆపేయబోతున్నారని ప్రచారం చేసే వైసీపీ మార్క్ ఫేక్ నెరేటివ్స్‌ ఊబిలో షర్మిల కూడా చిక్కుకుంటున్నారు. కేంద్ర మంత్రి పెమ్మసాని కేంద్ర ప్రభుత్వ పథకం.. ఆయుష్మాన్ భవను అందరూ ఉపయోగించుకోవాలని పిలుపునిచ్చారు. వెంటనే వైసీపీ సోషల్ మీడియాలో ఏపీలో ఆరోగ్యశ్రీ రద్దు అనే ప్రచారం ప్రారంభించింది. వీళ్ల ఆత్రం ఇలా ఉందని టీడీపీ సోషల్ మీడియా నిజాన్ని చెప్పేందుకు సిద్ధమవుతున్న సమయంలోనే.. షర్మిల కూడా రంగంలోకి దిగిపోయారు.

పెమ్మసాని చెప్పిన దాంట్లో ఏదో అర్థం ఉందని.. క్లారిటీ ఇవ్వాలని డిమాండ్ చేశారు. వెంటనే పెమ్మసాని చంద్రశేఖర్ కూడా స్పందించారు. కేంద్రం పథకాల్ని సమర్థంగా వాడుకోవడం అంటే రాష్ట్ర పథకాన్ని ఆపేయడమా అని ప్రశ్నించారు. కేంద్రం ఆయుష్మాన్ భవ పథకాన్ని కూడా ఉపయోగించుకుంటే చాలా మందికి మేలు జరుగుతుందని.. ఏపీ ఆరోగ్యశ్రీ పథకం కొనసాగుతుందని.. అదనపు వైద్య సేవలు అందినట్లే కదా అని క్లారిటీ ఇచ్చారు. ఈ మాత్రం క్లారిటీ పెమ్మసాని మాట్లాడిన మాటలను చూస్తే ఎవరికైనా వస్తుంది.

కానీ ఏదో ఒకటి రాజకీయం చేయాలన్న ఉద్దేశంతో వైసీపీ ఫేక్ నేరేటివ్స్ ప్రారంభిస్తే దాన్ని షర్మిల అందుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. కాంగ్రెస్ కు సోషల్ మీడియా బలం కొరత ఉండవచ్చు కానీ.. వైసీపీ సోషల్ మీడియాను వాడుకుంటే మాత్రం.. ఫేక్ న్యూస్ లతో బద్నాం అయిపోతారు. ప్రజల్లో చులకన అయిపోతారని కాంగ్రెస్ లోనే సెటైర్లు పడుతున్నాయి. వైసీపీకి, షర్మిలకు తేడా ఏముందనుకునే పరిస్థితి వస్తుంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

మారుతికి ముందే తెలుసా?

రాజ్ తరుణ్ కి హ్యాట్రిక్ ఫ్లాపులు పడ్డాయి. రెండు నెలల వ్యవధిలో మూడు సినిమాలు రాజ్ నుంచి వచ్చాయి. పురుషోత్తముడు, తిరగబడరాస్వామి, భలే ఉన్నాడే. ఈ మూడు ఫ్లాపులే. భలే ఉన్నాడే చాలా...

బంగ్లాని లైట్ తీసుకోవద్దు బాసూ

ఇండియా - బంగ్లాదేశ్‌ టెస్ట్ సిరీస్ ఈనెల‌ 19 నుంచి ప్రారంభం కానుంది. డబ్ల్యూటీసీ 2023-25 సీజన్‌లో రాబోయే పది టెస్టులు టీమ్‌ఇండియాకు అత్యంత కీలకం. అందుకే ఈ సిరీస్ ప్రాధాన్యతని సంతరించుకుంది....

చిట్‌చాట్‌లతో BRSను చిరాకు పెడుతున్న రేవంత్ !

రేవంత్ రెడ్డి మీడియా ప్రతినిధులతో ఇష్టాగోష్టిగా మాట్లాడే మాటలు మీడియాలో హైలెట్ అవుతూంటాయి. వాటిని పట్టుకుని బీఆర్ఎస్ ఆవేశ పడుతోంది . అంతా అయిపోయిన తరవాత తీరిగ్గా.. నేను ఎప్పుడన్నాను అని రేవంత్...

ఢిల్లీ తర్వాత సీఎం కూడా కేజ్రీవాలే ?

ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ మంగళవారం రాజీనామా చేయబోతున్నారు. అదే రోజు ఢిల్లీ శాసనసభాపక్ష సమావేశం కూడా నిర్వహిస్తున్నారు. కొత్త సీఎంగా కేజ్రీవాల్ ఎవరికి చాన్సిస్తారన్నది హాట్ టాపిక్ గా మారింది. విచిత్రంగా...

HOT NEWS

css.php
[X] Close
[X] Close